రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.
తొలి విడతలో 11 రోజులు, 8 నియోజకవర్గాల్లో ప్రచారం
9న ఉగాది వేడుకలు పిఠాపురంలోనే..
ఈనాడు, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మార్చి 30న ఆయన తొలి విడత ప్రచారం ప్రారంభమవుతుంది. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 11 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. ఇందులో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. మొదటి నాలుగు రోజులు పవన్ పిఠాపురంలో నియోజకవర్గంలోనే ఉంటారు. పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారి దర్శించుకుని, వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. మొదట మూడు రోజులే పిఠాపురంలో ఉండాలనుకున్నారు. తాజా పర్యటన షెడ్యూలు ప్రకారం మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఆయన పిఠాపురంలోనే ఉంటారు. అక్కడ బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న పవన్ ప్రచారం చేయనున్నారు. మనోహర్తో కలిపి సభలో పాల్గొంటారు. రోడ్డు షో నిర్వహణకూ అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలో 4 రోజుల పర్యటన
అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగు రోజులపాటు జనసేన అధినేత పర్యటిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఏప్రిల్ 4న ఆయన పర్యటన ఉంటుంది. ఆ మరునాడు ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 6న అనకాపల్లి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు తిరిగి కాకినాడ జిల్లాకు చేరుకుని, కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు.పవన్ ఉగాది రోజున పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండాలని, అక్కడే ఉగాది వేడుకల్లోనూ పాల్గొనాలని నిర్ణయించారు. జనసేన తరఫున విశాఖ దక్షిణం, పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు పోటీచేయాల్సిన అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. విశాఖ దక్షిణం నుంచి ఇప్పటికే ఒక అభ్యర్థికి అనధికారికంగా చెప్పినా తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మచిలీపట్నం లోక్సభ స్థానానికి అభ్యర్థినీ ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితా ప్రకటనకు మరికొంత సమయం తీసుకుంటారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా