వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు.
తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్టుడే: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించారని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్ర యాదవ్ ఆరోపిస్తూ వైకాపా సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తెలు.. నగరపాలిక 48, 49 డివిజన్ల కార్పొరేటర్లు అన్నా అనిత యాదవ్, అన్నా సంధ్య యాదవ్ సైతం అదేబాటలో తమ పదవులకు రాజీనామా చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం వారు మాట్లాడారు. తమ తండ్రి వాస్తవాలు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక సొంత పార్టీ నాయకులే దూషించడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడిన నోర్లు తమ కులంవారివే అయినా గొంతు మాత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఆయన కుమారుడు అభినయరెడ్డిదేనని విమర్శించారు. తమ తండ్రి రాజీనామా అనంతరం పార్టీ నాయకులు అడిగినందుకే రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు. అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తమ కుటుంబం మేయర్ పదవిని ఆశించినట్లు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం