జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు.
మోదీ, బాబు, పవన్లపై పూర్తి విశ్వాసం
నరసాపురం నుంచే బరిలో దిగొచ్చు
ఎంపీ రఘురామకృష్ణరాజు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. వాటిని త్వరగా విచారించాలని ఒకటి, ఇన్నాళ్లూ న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో బెయిల్ రద్దు చేయాలని మరొక పిటిషన్ వేశా’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఆ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న విచారణకు రాబోతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నా కేసు తప్పు అనడానికి లేదు. 3 వేలకుపైగా వాయిదాలు కోరిన మాట నిజం. అన్ని వాయిదాలు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నమాట నిజం. ఏమవుతుందో చూద్దాం. వై.ఎస్ జగన్ ఎన్నోసార్లు నన్ను అనుకున్నది చేయలేకపోయారు. డిస్క్వాలిఫై చేయలేకపోయారు. చంపలేక పోయారు. చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు టికెట్ విషయంలో ఫెయిల్ అవుతారనుకున్నా. తాత్కాలికంగా ఆయన విజయం సాధించారు. ముందుచూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో నేను చెప్పలేదు. భాజపా తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. నేను ఏ పార్టీలోనూ లేను. ఆ పార్టీలూ అదే చెబుతున్నాయి.
చంద్రబాబు నాకు అన్యాయం చేయరు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్లపై పూర్తి విశ్వాసం ఉంది. జగన్మోహన్రెడ్డిని వాళ్లు ప్రేమించరు అనేది నా ప్రగాఢ నమ్మకం. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉంది. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొన్న నన్ను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు తాను చేయగలిగిన సాయం చేశారు. అంత సహాయ పడిన వ్యక్తి నాకు ఎందుకు అన్యాయం చేస్తారు. నన్ను చంపకుండా, నా పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన లేదు. మూడురోజులా, నాలుగురోజులు పడుతుందా అనేది చెప్పలేను. నాకు సీటు వచ్చే విషయంపై నా కన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని ద్వేషించే అందరికీ నమ్మకం ఉంది. భాజపా రాష్ట్ర అధిష్ఠానంతో నాకు పరిచయంగాని, సాన్నిహిత్యం గాని లేదు. దాంతోనే అంతరం వచ్చి ఉండొచ్చు. నాకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయి. కూటమి నూటికి నూరుశాతం నాకు న్యాయం చేస్తుంది. అందుకు మీరంతా మద్దతుగా రావాలని కోరుతున్నా’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం