సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు.
12 ఏళ్లుగా కలిసి ఉన్నా నిర్లక్ష్యమే: అఠావలె
పుణె: ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా కూటమితో కలిసి ఉన్నా నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన కలుగుతోందని పేర్కొన్నారు. తమ పార్టీకి కనీసం రెండు లోక్సభ స్థానాలను కోరుతున్నామని తెలిపారు. గురువారం పుణెలో ఆయన మాట్లాడారు. శిర్డీ, శోలాపుర్లను తాము కోరామని చెప్పారు. అయితే సీట్ల పంపిణీలో ఆర్పీఐ (ఎ) ఎక్కడా కనిపించడంలేదని, కొత్తగా వచ్చిన పార్టీలకు ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.
31న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ!
దిల్లీ: పార్టీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు.. సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఇప్పటివరకు 208 లోక్సభ స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిన శివసేన
ముంబయి: ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన గురువారం ఎనిమిది మందిని లోక్సభ ఎన్నికల బరిలోకి దింపింది. వీరిలో ఇప్పటికే ఎంపీలుగా కొనసాగుతున్న ఏడుగురు ఎంపీలకు మళ్లీ సీట్లు కేటాయించింది. రామ్టెక్ ఎంపీని పక్కన పెట్టి ఇటీవలే పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు పార్వేకు టికెట్ కట్టబెట్టింది. రాష్ట్రంలో ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలవనున్నాయి.
ఝార్ఖండ్లోని 13 సీట్లలో భాజపా పోటీ
దిల్లీ: ఝార్ఖండ్లోని మొత్తం 14 సీట్లలో 13 చోట్ల భాజపా పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా ఒక సీటును ఏజేఎస్యూకు కేటాయించింది. గిరిధ్ను ఆ పార్టీకి భాజపా కేటాయించింది.
కశ్మీర్ బాధను కాంగ్రెసే అర్థం చేసుకోగలదు: ముఫ్తీ
దిల్లీ: జమ్మూకశ్మీర్ అనుభవిస్తున్న బాధను కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ మాత్రమే అర్థం చేసుకోగలరని ‘భారత్ జోడో యాత్ర’పై శుక్రవారం విడుదల కానున్న పుస్తకంలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. పుస్తకంలో ఆమె ఒక వ్యాసం రాశారు. అందులో ఆమె జమ్మూకశ్మీర్ను మినీ ఇండియాగా అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మండీ నుంచి పోటీకి సిద్ధం
- సిట్టింగ్ ఎంపీ ప్రతిభాసింగ్ సుముఖత
శిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి మళ్లీ పోటీకి విముఖత చూపిన ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు, సిట్టింగ్ ఎంపీ ప్రతిభాసింగ్ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిభాసింగ్.. పార్టీ అధిష్ఠానం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీతో బుధవారం చండీగఢ్లో సమావేశమైన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకొని పోటీకి ముందుకు వచ్చారు.
యూపీలో సమాజ్వాదీకి షాక్
రాంపుర్: తొలి విడత నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి షాక్ తగిలింది. రాంపుర్లో ఆ పార్టీ అభ్యర్థి అసిం రజా నామినేషన్ తిరస్కరణకు గురైంది. కొన్ని పత్రాలు జతచేయని కారణంగా నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అయితే సమాజ్వాదీ తరఫున ముహీబుల్లా నద్వీ కూడా నామినేషన్ వేశారు. దీంతో పార్టీ అభ్యర్థిగా నద్వీ బరిలో నిలవనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి