రేవంతూ.. ఐదేళ్లుండు.. 420 హామీలు నెరవేర్చు
ఎన్నికల హామీలపై ప్రశ్నించకుండా ఉండేందుకే సీఎం రేవంత్రెడ్డి లీకువీరుడిగా మారారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
ఎన్నికల హామీలను ప్రశ్నించకుండా ఉండేందుకే లీకు వీరుడిగా మారారు
ఫోన్ ట్యాపింగ్, గొర్రెలు, బర్రెలు, కాళేశ్వరం స్కాములంటూ దుష్ప్రచారం
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల హామీలపై ప్రశ్నించకుండా ఉండేందుకే సీఎం రేవంత్రెడ్డి లీకువీరుడిగా మారారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్, గొర్రెలు, బర్రెలు, కాళేేశ్వరంలో స్కాములంటూ తమ పార్టీపై యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్లో శుక్రవారం జరిగిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఐదేళ్లు అధికారంలో ఉండి... ఇచ్చిన 420 హామీలను రేవంత్రెడ్డి నెరవేర్చాలి. మేము వారి ప్రభుత్వాన్ని పడగొట్టం. పక్కనే ఉండే నల్గొండ, ఖమ్మం నాయకులే మానవ బాంబులవుతారు. గత ఎన్నికల్లో భారాసను భాజపాకు బీ టీమ్ అని ప్రచారం చేశారు.. వాస్తవానికి ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డే భాజపా బీటీమ్గా మారతారు. ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదే కాబట్టి నేను పదేపదే చెబుతున్నా. మైనారిటీలు కాంగ్రెస్కు ఓటువేస్తే అది భాజపాకు లాభిస్తుంది. సీఎంగా కాకుండా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు. సిటింగ్ ఎంపీగా ఉండి మల్కాజిగిరిలో పోటీకి వెనకంజ వేసిన ఆయన రాష్ట్రంలోని అన్ని లోక్సభ సీట్లను గెలిపిస్తామని.. భారాసను వంద అడుగుల లోతున పాతిపెడ్తానని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
కాళ్లు పట్టుకున్నా మళ్లీ రానీయం
కేకే, కడియం లాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్లారు. వెళ్లేటప్పుడు నాలుగు రాళ్లు వేసి వెళ్తున్నారు. వారు పెద్దలు.. నేనేమి మాట్లాడను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా.రంజిత్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డికి కార్యకర్తలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలి. వీరు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానీయం. ఎన్నికల తర్వాత మొదట రంజిత్రెడ్డి నాకు ఫోన్ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని గెలుద్దామని చెప్పారు. మీడియాకు చెప్పాలని కోరారు. నమ్మి ప్రకటించాను కూడా. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై మహేందర్రెడ్డిని అడిగితే ఖండించారు. ఆస్కార్ కంటే బాగా నటించారు. చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు.. కేసీఆర్ అన్నట్లుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలి. తుక్కుగూడకు సభకు కాంగ్రెస్వాళ్లు కర్ణాటక నుంచి కూడా జనాలను తెప్పిస్తున్నారు. వారు తుక్కుగూడలో నిర్వహించే రాష్ట్ర సభను మించి ఏప్రిల్ 13న చేవెళ్లలో నిర్వహించే సభ ఉండాలి. రాష్ట్రంలో 17 స్థానాల్లో రిజర్వు నియోజకవర్గాలు మినహాయించి మిగతా వాటిలో అత్యధికంగా ఆరింటిలో బలహీన వర్గాల అభ్యర్థులనే బరిలోకిదింపాం. గెలిపించండి’’ అని కోరారు.
గెలిచే మొదటి స్థానం చేవెళ్లదే
రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచే మొదటి స్థానం కచ్చితంగా చేవెళ్లదే అని భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తన మనవరాలి పెళ్లికి కార్డు ఇచ్చేందుకు వచ్చి కేసీఆర్తో గంటపాటు సమావేశమయ్యారని.. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం పనిచేసి మంచి ఆధిక్యం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కేటీఆర్ సమావేశంలో తెలిపారు. ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు సబితారెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, వికారాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?