లోక్సభ నుంచి అసెంబ్లీ బాట
17వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన 16 మంది ఎంపీలు ఇక్కడ ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి వెళ్లిపోయారు.
17వ లోక్సభలో 16 మంది ఎంపీలది ఇదే దారి
సీఎం, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, స్పీకర్ బాధ్యతల్లోకి..
మరో నలుగురి రాజీనామాలు
నలుగురి మరణం, ఇద్దరిపై అనర్హతవేటు
మొత్తంగా 26 స్థానాలు ఖాళీ
ఈనాడు, దిల్లీ: 17వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన 16 మంది ఎంపీలు ఇక్కడ ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి వెళ్లిపోయారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియాకుమారి, ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ సాయ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్రసింగ్ తోమర్, కేంద్రమంత్రి పదవి నుంచి రాష్ట్రమంత్రి పదవిలోకి వెళ్లిపోయిన ప్రహ్లాద్పటేల్లు ఉన్నారు. కొత్త పదవుల్లోకి మారడం, సభ్యులు కాలధర్మం వంటి కారణాల వల్ల 17వ లోక్సభలో 26 స్థానాలు ఖాళీ అయ్యాయి. 17వ లోక్సభ నుంచి భగవంత్ మాన్ (పంజాబ్), రేవంత్ రెడ్డి (తెలంగాణ), నాయబ్ సింగ్ సైనీ (హరియాణా) ముఖ్యమంత్రులు కావడం గమనార్హం.
తెలంగాణలో..
రాష్ట్రం నుంచి నాలుగు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, నల్గొండ, భువనగిరిల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు రాష్ట్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కారణంగా తమ లోక్సభ స్థానాలకు ముందే రాజీనామా చేశారు. మెదక్ భారాస ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన ఇదే దారిలో నడిచారు.
రాజస్థాన్..
రాజ్సమంద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జైపుర్ మహారాజ మాన్సింగ్-2 మనుమరాలైన దియాకుమారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్ర 6వ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జైపుర్ రూరల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒలింపిక్ షూటర్, మోదీ తొలి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో జోట్వారా స్థానం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా చేరిపోయారు. అదే రాష్ట్రంలోని ఆల్వార్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది రాష్ట్ర రాజకీయాలకు వెళ్లిపోయారు. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధినేత హనమాన్ బేనీవాల్ అక్కడి నాగౌర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసి కిన్వసర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది దిల్లీ వీడిపోయారు. ఇలా రాజస్థాన్లోనూ నాలుగు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
మధ్యప్రదేశ్..
5సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి, 2003లో వాజ్పేయీ ప్రభుత్వంలో, 2019లో నరేంద్రమోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన మధ్యప్రదేశ్లోని దామోహ్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రహ్లాద్ పటేల్ గత నవంబరులో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్పుర్ నుంచి పోటీచేసి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా వెళ్లిపోయారు. నాలుగుసార్లు మధ్యప్రదేశ్లోని మొరేనా లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి 2014 నుంచి 2023 వరకు కేంద్రంలో కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలు చేపట్టిన నరేంద్రసింగ్ తోమర్ అసెంబ్లీ ఎన్నికల్లో దిమని స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీ స్పీకర్ పదవిలోకి వెళ్లిపోయారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆ రాష్ట్రంలోని జబల్పూర్ ఎంపీ రాకేష్సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జబల్పుర్ పశ్చిమస్థానం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే రాష్ట్రంలోని హోసంగాబాద్ లోక్సభ స్థానం నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన ఉదయ్ ప్రతాప్సింగ్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. సిద్ధి స్థానం నుంచి 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన రీతిపాఠక్ అదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వెళ్లిపోయారు. మొత్తంగా ఇలా ఈ రాష్ట్రం నుంచి 5 లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఛత్తీస్గఢ్లో..
ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ లోక్సభ స్థానానికి 17వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన అరుణ్ సావో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా వెళ్లిపోయారు. రాయ్గడ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన గోమతి సాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా మారిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లోని సుర్గుజా స్థానం నుంచి గెలుపొంది కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రిగా పనిచేసిన రేణుకాసింగ్ సరూతా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే స్థానానికి పరిమితమయ్యారు. ఇలా ఎంపీలు అసెంబ్లీకి వెళ్లడంతో ఆ రాష్ట్రం నుంచి మూడుస్థానాలు ఖాళీ అయ్యాయి. వీటితోపాటు సభ్యుల మరణం, అనర్హతవేటు, పార్టీల మార్పిడి కారణంగా రాజీనామా, ఎగువసభకు వెళ్లడంలాంటి కారణాలతో మొత్తం 26 స్థానాలు ఖాళీకావడంతో పార్టీలు ఆ స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీలుచిక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం