విపక్షాలకు పన్ను పోట్లు
ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో రాజకీయ పార్టీలు తలమునకలవుతుండగా...మరోవైపు వివిధ ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వరుసపెట్టి నోటీసులు పంపిస్తోంది.
రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్కు మళ్లీ ఐటీ నోటీసు
దేశవ్యాప్త నిరసనలకు హస్తం పార్టీ పిలుపు
దిల్లీ: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో రాజకీయ పార్టీలు తలమునకలవుతుండగా...మరోవైపు వివిధ ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వరుసపెట్టి నోటీసులు పంపిస్తోంది. తమపై ఐటీ అధికారుల చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు కొట్టేసిన వెంటనే...2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆ పార్టీకి తాఖీదు అందింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి కూడా ఇదే తరహా నోటీసు వచ్చింది. గత కొన్నేళ్లుగా పన్ను రిటర్నుల దాఖలు సమయంలో పాత పాన్ వినియోగించినందుకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలని ఐటీ శాఖ నుంచి షోకాజ్ నోటీసు వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత తెలిపారు. అయితే, అంతకుముందు మరో నాయకుడు వెల్లడించినట్లుగా రూ.11 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులో పేర్కొనలేదన్నారు. సీపీఎంకు 2016-17కు సంబంధించి పన్ను మినహాయింపును ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఆ సంవత్సరం పన్ను రిటర్నులో ఒక బ్యాంక్ ఖాతా వెల్లడించనందుకు గాను రూ.15.59 కోట్లు పన్ను విధించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. తనకు కూడా 72 గంటల వ్యవధిలో 11 ఐటీ నోటీసులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే తెలిపారు. ఆదాయపు పన్ను విభాగం చర్యను సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు సీపీఎం తెలిపింది. తమకు పంపిన రూ.1,823 కోట్ల ఐటీ డిమాండ్ నోటీస్పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ స్పష్టంచేయగా....న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు సీపీఐ పేర్కొంది.
ప్రభుత్వం మారితే కఠిన చర్యలు తప్పవు: రాహుల్
ఐటీ శాఖ రూ.1,823 కోట్లకు డిమాండ్ నోటీసులివ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ భాజపా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికృత చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం మారిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికార పక్షం పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని హస్తం పార్టీ నేతలు జైరాం రమేశ్, అజయ్ మాకెన్ శుక్రవారం డిమాండ్ చేశారు. వీరు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘ఎన్నికల బాండ్ల స్కాంను ఉపయోగించి భాజపా రూ.8,200 కోట్లు వసూలు చేసింది. దీనికోసం ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్, పోస్ట్రెయిడ్ ముడుపులు, డొల్ల కంపెనీల వంటి విధానాలను అనుసరించింది. ఆ పార్టీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇదేనా? ఎన్నికల సంఘం ఎందుకు మౌనప్రేక్షకుడిలా ఉంటోందని నిలదీశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓ రాజకీయ పార్టీకి పన్ను నోటీసులు ఇవ్వడం అసాధారణమైన చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దీనిపై శనివారం, ఆదివారం నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్