వైవీపై ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలున్నాయి
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని ఇందూ-హౌసింగ్ బోర్డు కేసులో వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆరోపణలున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
విల్లాలు కృష్ణప్రసాద్ కుమార్తెలు, వైవీ సోదరి, కేవీపీ కోడలు తదితరులకే ఇచ్చారు
కింది కోర్టులో తేల్చుకోవాలన్న తెలంగాణ హైకోర్టు
జగన్ అక్రమాస్తుల కేసులో వైవీ పిటిషన్ కొట్టివేత
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని ఇందూ-హౌసింగ్ బోర్డు కేసులో వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆరోపణలున్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందూ శ్యాంప్రసాద్రెడ్డికి హౌసింగ్ ప్రాజెక్టులు అప్పగించడంలో వైఎస్ను ప్రభావితం చేయడం ద్వారా గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో 50 శాతం వాటా వైవీకి దక్కిందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందుకుగాను సీబీఐ 48 మంది సాక్షులు, 46 డాక్యుమెంట్లను అభియోగపత్రంతో సహా సీబీఐ కోర్టుకు సమర్పించిందని పేర్కొంది. వైవీ పాత్రపై ఏపీహెచ్బీ ఎస్ఈ దాట్ల సూర్యానారాయణరాజు, ఈఈ వి.నాగార్జున, వసంత ప్రాజెక్ట్స్ ఆర్థిక సలహాదారు గరికపాటి కమలేష్, నిమ్మగడ్డ ప్రకాశ్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి.కె.దివాన్, యూనిటీ ఇన్ఫ్రా ఛైర్మన్ కిశోర్ కృష్ణారావుల వాంగ్మూలాల్లో సీబీఐ స్పష్టంగా పేర్కొందని తెలిపింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసిన ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లోనే క్రిమినల్ కేసు కొట్టివేస్తారని.. అయితే ఇది అలాంటి అరుదైన కేసు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
స్పష్టమైన ఆధారాలున్నందున కింది కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, అందువల్ల వై.వి.సుబ్బారెడ్డి పిటిషన్ను అనుమతించలేమంటూ కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వై.వి.సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరిస్తూ వై.వి.సుబ్బారెడ్డి పిటిషన్ను కొట్టివేశారు. గచ్చిబౌలిలో 4.29 ఎకరాల హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి వసంత ప్రాజెక్ట్స్, ఇందూ శ్యాంప్రసాద్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వసంత ప్రాజెక్ట్స్లో ఇందూ ప్రాజెక్ట్సుకు ఉన్న 51 శాతాన్ని వైవీకి 50 శాతం, కృష్ణప్రసాద్కు 1 శాతం కేటాయించారు. దీనికి ప్రతిఫలంగా శ్యాంప్రసాద్రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్పల్లి హౌసింగ్ ప్రాజెక్ట్స్లో అదనంగా 15 ఎకరాలను ప్రభుత్వం కేటాయింపు జరిగింది. ఎలాంటి చెల్లింపులు లేకుండా రూ.25.42 కోట్ల ప్రాజెక్టులో వై.వి.సుబ్బారెడ్డి 50 శాతం వాటా పొందారు.
ప్రాథమిక ఆధారాలనే పరిశీలిస్తుంది
కేసును కొట్టివేయాలంటూ నిందితులు పిటిషన్లు దాఖలు చేసినప్పుడు కోర్టు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిశీలిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ సమర్పించిన ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనూప్కుమార్ శ్రీవాత్సవ కేసులో స్పష్టం చేసిందన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారనడానికి బలమైన కారణం ఉంటే తప్ప జోక్యం చేసుకోలేమన్నారు. ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లోనే అలాంటి ఉత్తర్వులను హైకోర్టు జారీ చేస్తుందన్నారు. ప్రస్తుత కేసులో ప్రాథమిక ఆరోపణలను బలపరిచేలా తగిన సమాచారం ఉందన్నారు. అంతేగాకుండా సీబీఐ సమర్పించిన పత్రాలు తప్ప పిటిషనర్ వైవీ అదనంగా ఎలాంటి పత్రాలను సమర్పించలేదన్నారు. కుట్ర ద్వారా లబ్ధి పొందారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
కేవలం ముఖ్యమంత్రి తోడల్లుడన్న కారణంగా కేసు నమోదు చేయడం సరికాదని, దీనికి సంబంధించిన చింతలపాటి శ్రీనివాసరాజు వర్సెస్ సెబీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్రెడ్డి ప్రస్తావించగా ఆ తీర్పు ఇక్కడ వర్తించదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్కడ కేవలం తోడల్లుడన్న కారణం తప్ప ఎలాంటి ఆధారాలు లేవని, ప్రస్తుత కేసులో వైవీ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వి.వి.కృష్ణప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్లు తమపై కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పులో నిందితుల పాత్రను పేర్కొందన్నారు. కేసును కొట్టివేయడానికి తగిన కారణాలను వైవీ చూపలేదని, అందువల్ల పిటిషన్ను కొట్టివేస్తున్నామన్నారు.
వైవీ పాత్రపై ఆరుగురు కీలకమైన సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. ఎంబసీ యూనిటీ కన్సార్షియం పేరుతో కూకట్పల్లి, గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులు అనర్హుల (ఇందూ, వసంత)ల చేతికి వెళ్లాయని ఏపీహెచ్బీ ఎస్ఈ దాట్ల సూర్యానారాయణరాజు వాంగ్మూలం ఇచ్చారు. వసంత గ్రూపు ఆర్థిక సలహాదారుగా ఉన్న గరికపాటి కమలేష్ కీలకమైన సమాచారాన్ని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు