తెదేపా అభ్యర్థుల తుది జాబితా విడుదల
తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది.
తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్సభ స్థానాలకు ప్రకటన
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. భాగస్వామ్య పక్షాల్లో భాజపా కూడా పోటీ చేస్తున్న ఆరు లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. జనసేన ఒక లోక్సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెదేపా పోటీ చేసే మొత్తం స్థానాలకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు సీట్లపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ తెరదించింది. గంటా కోరుకున్నట్లే ఆయనకు భీమిలి టికెట్ దక్కింది. పార్టీ అధినేత చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించగా, ఆయన మొదటి నుంచీ భీమిలిపైనే ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. చివరకు ఆయన అభీష్టానికి తగ్గట్లే భీమిలి స్థానాన్ని పార్టీ ఆయనకు ఖరారు చేసింది.
పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు భాజపాకు వెళ్లడంతో కళా వెంకట్రావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది. ఎచ్చెర్ల సీటు కోసం కళాతో పోటీపడ్డ కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం లోక్సభ టికెట్ దక్కింది. ఈసారి కళా వెంకట్రావు అభ్యర్థిత్వంపై మొదటి నుంచీ కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. మొదటి మూడు జాబితాల్లో కళా పేరు లేకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. భాజపాకు మొదట కేటాయించిన శ్రీకాకుళం సీటుకు బదులుగా... ఎచ్చెర్ల ఇవ్వడంతో కళా కోసం పార్టీ ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. చీపురుపల్లితో పాటు, విజయనగరం లోక్సభ స్థానానికీ ఆయన పేరు పరిశీలించింది. చివరకు చీపురుపల్లి స్థానాన్ని ఖరారు చేసింది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్ దక్కింది. ఆయన ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆలూరు శాసనసభాస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలూరు స్థానాన్ని పార్టీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్కే తెదేపా ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు అసెంబ్లీ స్థానానికి మొదటి జాబితాలోనే సియారి దొన్నుదొరను అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. పొత్తులో భాగంగా పాడేరు సీటు భాజపాకు వెళుతుందని అనుకున్నారు. భాజపా అరకు సీటు కోసం పట్టుబట్టడంతో... తెదేపా ఆ స్థానాన్ని వదులుకుని పాడేరు తీసుకుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అసెంబ్లీ టికెట్
- ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన పాడేరు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేశ్నాయుడికి తెదేపా అవకాశం కల్పించింది. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రమేశ్నాయుడి తల్లి కిల్లు వెంకటరత్నం గతంలో మండల ఉపాధ్యక్షురాలిగా, పాడేరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు.
- ఒంగోలు జిల్లాలోని దర్శి టికెట్ను యువ వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మికి కేటాయించింది. ఆమె మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి వరుసకు కుమార్తె అవుతారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు, తెదేపా నేత కడియాల వెంకటేశ్వరరావు కోడలు.
- కందికుంట వెంకట ప్రసాద్పై తెలంగాణ కోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో మొదట కదిరి టికెట్ను ఆయన భార్య యశోదాదేవికి పార్టీ ప్రకటించింది. ప్రసాద్పై ఇటీవల కేసు కొట్టేయడంతో ఆయనకే టికెట్ ఖరారు చేసింది.
- అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు.
- రాజంపేట అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి కుమారుడు. మొదట ఆయన పేరుని రాజంపేట లోక్సభ స్థానానికి పార్టీ పరిశీలించింది. పొత్తులో ఆ సీటు భాజపాకి వెళ్లడంతో... రాజంపేట అసెంబ్లీ సీటు ఖరారు చేసింది.
ఒంగోలు లోక్సభ సీటు శ్రీనివాసులురెడ్డికే
విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని తెదేపా శుక్రవారం ప్రకటించింది. ఒంగోలు టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే ఖరారు చేసింది. ఆ స్థానానికి మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేరును పార్టీ పరిశీలించినా... తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపింది. విజయనగరం టికెట్ను కలిశెట్టి అప్పలనాయుడికి కేటాయించింది. పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... దివంగత నేత ఎర్రన్నాయుడి శిష్యుడిగా ఎదిగారు. ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ను ఆశించారు. అనూహ్యంగా ఆయనకు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం దక్కింది. కడప టికెట్ను చదిపిరాళ్ల భూపేష్రెడ్డి దక్కించుకున్నారు. ఆయన జమ్మలమడుగు భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు. భూపేష్రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జిగా ఉన్నారు. పొత్తులో ఆ సీటు భాజపాకు వెళ్లడంతో, పార్టీ ఆయనకు కడప లోక్సభ టికెట్ కేటాయించింది. అనంతపురం అభ్యర్థిఅంబికా లక్ష్మీనారాయణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. గతంలో అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా పనిచేశారు.
38 మంది బీసీలకు ఎన్డీఏ అసెంబ్లీ టికెట్లు
రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జనసేన, భాజపా కలిసి మొత్తం 38 మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చాయి. జనసేన ఇంకా 3 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన 172 స్థానాల్లో తెదేపా 34, జనసేన 2, భాజపా 2 సీట్లు బీసీలకు కేటాయించాయి. శాసనసభ సీట్లలో తెదేపా ముస్లింలకు 3, ఎస్సీలకు 25, ఎస్టీలకు 4, వైశ్యులకు 2, క్షత్రియులకు 5, వెలమకు 1 స్థానాన్ని కేటాయించింది. జనసేన ప్రకటించిన 18 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 సీటు కేటాయించింది. భాజపా పోటీ చేస్తున్న 10 స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీ, ఎస్టీలకు చెరొక స్థానాన్నీ కేటాయించింది. లోక్సభ స్థానాల్లో తెదేపా ఆరుగురు బీసీలకు, ముగ్గురు ఎస్సీలకు టికెట్లు ఇచ్చింది. మహిళలకు తెదేపా 21, జనసేన ఒక అసెంబ్లీ సీటు కేటాయించాయి. లోక్సభ సీట్లలో మహిళలకు భాజపా 2, తెదేపా ఒక సీటు కేటాయించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!