తెదేపా అభ్యర్థుల తుది జాబితా విడుదల
తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది.
తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్సభ స్థానాలకు ప్రకటన
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ నాలుగు లోక్సభ, తొమ్మిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెదేపా పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ, 144 శాసనసభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. భాగస్వామ్య పక్షాల్లో భాజపా కూడా పోటీ చేస్తున్న ఆరు లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. జనసేన ఒక లోక్సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెదేపా పోటీ చేసే మొత్తం స్థానాలకు నాలుగు విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు సీట్లపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ తెరదించింది. గంటా కోరుకున్నట్లే ఆయనకు భీమిలి టికెట్ దక్కింది. పార్టీ అధినేత చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించగా, ఆయన మొదటి నుంచీ భీమిలిపైనే ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. చివరకు ఆయన అభీష్టానికి తగ్గట్లే భీమిలి స్థానాన్ని పార్టీ ఆయనకు ఖరారు చేసింది.
పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు భాజపాకు వెళ్లడంతో కళా వెంకట్రావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది. ఎచ్చెర్ల సీటు కోసం కళాతో పోటీపడ్డ కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం లోక్సభ టికెట్ దక్కింది. ఈసారి కళా వెంకట్రావు అభ్యర్థిత్వంపై మొదటి నుంచీ కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. మొదటి మూడు జాబితాల్లో కళా పేరు లేకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. భాజపాకు మొదట కేటాయించిన శ్రీకాకుళం సీటుకు బదులుగా... ఎచ్చెర్ల ఇవ్వడంతో కళా కోసం పార్టీ ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. చీపురుపల్లితో పాటు, విజయనగరం లోక్సభ స్థానానికీ ఆయన పేరు పరిశీలించింది. చివరకు చీపురుపల్లి స్థానాన్ని ఖరారు చేసింది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్ దక్కింది. ఆయన ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆలూరు శాసనసభాస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలూరు స్థానాన్ని పార్టీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్కే తెదేపా ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు అసెంబ్లీ స్థానానికి మొదటి జాబితాలోనే సియారి దొన్నుదొరను అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. పొత్తులో భాగంగా పాడేరు సీటు భాజపాకు వెళుతుందని అనుకున్నారు. భాజపా అరకు సీటు కోసం పట్టుబట్టడంతో... తెదేపా ఆ స్థానాన్ని వదులుకుని పాడేరు తీసుకుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అసెంబ్లీ టికెట్
- ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన పాడేరు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేశ్నాయుడికి తెదేపా అవకాశం కల్పించింది. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రమేశ్నాయుడి తల్లి కిల్లు వెంకటరత్నం గతంలో మండల ఉపాధ్యక్షురాలిగా, పాడేరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు.
- ఒంగోలు జిల్లాలోని దర్శి టికెట్ను యువ వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మికి కేటాయించింది. ఆమె మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తె, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి వరుసకు కుమార్తె అవుతారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు, తెదేపా నేత కడియాల వెంకటేశ్వరరావు కోడలు.
- కందికుంట వెంకట ప్రసాద్పై తెలంగాణ కోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో మొదట కదిరి టికెట్ను ఆయన భార్య యశోదాదేవికి పార్టీ ప్రకటించింది. ప్రసాద్పై ఇటీవల కేసు కొట్టేయడంతో ఆయనకే టికెట్ ఖరారు చేసింది.
- అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు.
- రాజంపేట అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి కుమారుడు. మొదట ఆయన పేరుని రాజంపేట లోక్సభ స్థానానికి పార్టీ పరిశీలించింది. పొత్తులో ఆ సీటు భాజపాకి వెళ్లడంతో... రాజంపేట అసెంబ్లీ సీటు ఖరారు చేసింది.
ఒంగోలు లోక్సభ సీటు శ్రీనివాసులురెడ్డికే
విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని తెదేపా శుక్రవారం ప్రకటించింది. ఒంగోలు టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే ఖరారు చేసింది. ఆ స్థానానికి మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేరును పార్టీ పరిశీలించినా... తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపింది. విజయనగరం టికెట్ను కలిశెట్టి అప్పలనాయుడికి కేటాయించింది. పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... దివంగత నేత ఎర్రన్నాయుడి శిష్యుడిగా ఎదిగారు. ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ను ఆశించారు. అనూహ్యంగా ఆయనకు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం దక్కింది. కడప టికెట్ను చదిపిరాళ్ల భూపేష్రెడ్డి దక్కించుకున్నారు. ఆయన జమ్మలమడుగు భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు. భూపేష్రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జిగా ఉన్నారు. పొత్తులో ఆ సీటు భాజపాకు వెళ్లడంతో, పార్టీ ఆయనకు కడప లోక్సభ టికెట్ కేటాయించింది. అనంతపురం అభ్యర్థిఅంబికా లక్ష్మీనారాయణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. గతంలో అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా పనిచేశారు.
38 మంది బీసీలకు ఎన్డీఏ అసెంబ్లీ టికెట్లు
రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జనసేన, భాజపా కలిసి మొత్తం 38 మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చాయి. జనసేన ఇంకా 3 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన 172 స్థానాల్లో తెదేపా 34, జనసేన 2, భాజపా 2 సీట్లు బీసీలకు కేటాయించాయి. శాసనసభ సీట్లలో తెదేపా ముస్లింలకు 3, ఎస్సీలకు 25, ఎస్టీలకు 4, వైశ్యులకు 2, క్షత్రియులకు 5, వెలమకు 1 స్థానాన్ని కేటాయించింది. జనసేన ప్రకటించిన 18 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 సీటు కేటాయించింది. భాజపా పోటీ చేస్తున్న 10 స్థానాల్లో బీసీలకు 2, ఎస్సీ, ఎస్టీలకు చెరొక స్థానాన్నీ కేటాయించింది. లోక్సభ స్థానాల్లో తెదేపా ఆరుగురు బీసీలకు, ముగ్గురు ఎస్సీలకు టికెట్లు ఇచ్చింది. మహిళలకు తెదేపా 21, జనసేన ఒక అసెంబ్లీ సీటు కేటాయించాయి. లోక్సభ సీట్లలో మహిళలకు భాజపా 2, తెదేపా ఒక సీటు కేటాయించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం