జగన్ నిర్వాకం వల్లే సీమలో కరవు
మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే జగన్ రద్దు చేశారు.
కర్నూలులో వారానికోసారి నీళ్లు ఇస్తున్నారు
కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా
తాడేపల్లి నుంచి కంటెయినర్లో తరలిపోతున్న డబ్బులు
ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే జగన్ రద్దు చేశారు. రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా. రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రద్దు చేశారు.. రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.
తెదేపా అధినేత చంద్రబాబు
నంద్యాల పట్టణం, బనగానపల్లి, కావలి, వింజమూరు, న్యూస్టుడే, ఈనాడు- నెల్లూరు : ‘తాగు.. సాగు నీరు ఇవ్వలేని వ్యక్తి ఓట్లు అడిగేందుకు వస్తున్నారు.. జగన్ నిర్వాకం వల్లే సీమలో నీళ్లు లేవు. కర్నూలులో వారానికోసారి సరఫరా చేస్తున్నారు. స్నానం చేయడానికి, ఇతర అవసరాలకూ నీళ్లు లేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. తెదేపా హయాంలో రాయలసీమలో ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్రెడ్డి మాత్రం సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు అంత కూడా వెచ్చించలేదు. సలహాదారులకు ఇచ్చే వేతనం అంత కూడా వ్యయం చేయలేకపోయారు. ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో రాయలసీమలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు. సిద్దాపురం, పులకుర్తి, గోరుకల్లు రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఇచ్చామని, పులికనుమ, అవుకు టన్నెల్నూ పూర్తిచేశామని తెలిపారు. రాయలసీమకు ఆప్తులెవరు.. ద్రోహులెవరు.. జగన్రెడ్డి రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు.
ప్రజాగళం పేరుతో వచ్చా.. సింహగర్జన, శంఖారావం చేయడానికి వచ్చా.. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించడానికి వచ్చా.. మీరు సిద్ధమా? అని ప్రజలను ఉత్తేజపరిచారు. శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి, వింజమూరుల్లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన మహానుభావుడు ఎన్టీఆర్.. అన్ని వర్గాలనూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. కియా తెదేపా బ్రాండ్గా పేర్కొంటూ.. జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్గా అభివర్ణించారు. జాబు రావాలంటే కచ్చితంగా బాబు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నీరు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు ద్వారా సీమ దశ, దిశ మారుతుందని స్పష్టం చేశారు.
‘మూడు రాజధానులు చేశానని జగన్ మాట్లాడుతున్నారు. కర్నూలుకు రాజధాని వచ్చిందా’ అని చంద్రబాబు ప్రజల్ని అడిగారు.. అందరూ లేదు.. లేదు అంటూ సమాధానం ఇచ్చారు. మూడు ముక్కలాటతో చిరునామా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయని.. వాటికి పరిష్కారం చూపే బాధ్యత తెదేపా తీసుకుందన్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావాలన్నది తన సంకల్పమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద పేదవారికి పంచాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ‘తాడేపల్లి నుంచి కంటెయినర్లో డబ్బులు తరలిపోతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఫర్నిచర్, వంట సామగ్రికి అని వైకాపా నాయకులు చెబుతున్నారు. మద్యంలో దొంగిలించిన, ఇసుకలో బొక్కిన, అడ్డంగా సంపాదించిన డబ్బులను పోలీసుల సహకారంతో కంటెయినర్లో పెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు.
క్వార్టర్ మద్యం సీసాను రూ.200కు విక్రయించి రూ.140 జగన్ తన ఖాతాలో జమ చేసుకుంటున్నారు. క్వార్టర్ బాటిల్ చూస్తే గుర్తుకు వచ్చేది జగన్రెడ్డి మాత్రమే’ అని చంద్రబాబు విమర్శించారు. ‘రాష్ట్రంపై రూ.12 లక్షల కోట్ల అప్పు ఉంది. వ్యవస్థలను జగన్ ఛిన్నాభిన్నం చేశారు. బీసీ జనార్దన్రెడ్డి లాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టారు. నాతో సహా అనేక మందిని జైలుకు పంపించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చక్రవడ్డీతో సహా వసూలు చేస్తాం. సైకో పోవాలి-రాష్ట్రం నిలబడాలి. అందుకే కలిసి వచ్చే పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకున్నాం. వ్యతిరేక ఓటు చీలకూడదనే భాజపాతో కలిశాం. ఏ ఒక్క మైనార్టీకి కూడా మా పాలనలో అన్యాయం జరగదు. మతసామరస్యం కాపాడిన పార్టీ తెదేపానే. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సైకోను ఇంటికి పంపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
తెలుగువారు గుర్తింపు పొందాలి
తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలనేది మా ఆశయం. ఇది జరుగుతుంది. తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే నా హామీ అంటూ చంద్రబాబు ప్రకటించారు. కూడు, గూడు, గుడ్డ పేదవారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని చెప్పారు. పేదవారికి, వృద్ధులకు రూ.30తో పింఛన్ ప్రారంభించిన పార్టీ తెదేపానేనన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు తెచ్చామన్నారు. ఓర్వకల్లులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు వచ్చిందంటే అది తెదేపా వల్లనేనని తెలిపారు.
తెదేపాతోనే మైనార్టీలకు న్యాయం
‘తెలుగుదేశం ప్రభుత్వంతోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. ఎన్డీయేలో ఉన్నా ముస్లింల హక్కులను కాపాడటం తెదేపా బాధ్యత. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలని తెదేపా హయాంలో 12 లక్షల టిడ్కో ఇళ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా వాటిని ఇవ్వకుండా రంగులు మార్చుకున్నారు. ఇప్పుడున్న కాలనీలు అలానే ఉంటాయి. ఏమీ రద్దు కావు. అక్కడే మీరు ఇళ్లు కట్టుకునేందుకు మరిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆదుకుంటా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
9 డీఎస్సీలు నిర్వహించాం
‘నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. ప్రజల నుంచి ఉద్యగ సంఘాల వరకు అందిరినీ అణగదొక్కుతున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను ఆదుకుంటాం. యానాదుల కోసం కొత్తగా ప్రత్యేక కార్యక్రమాలు తెస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డీఎస్సీలు, ఎన్టీఆర్ 3 డీఎస్సీలు పెడితే.. జగన్రెడ్డి 5 ఏళ్లల్లో ఒక్కటైనా పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అధికారంలోకొచ్చాక నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం’ అని చంద్రబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు