సంక్షిప్త వార్తలు (12)
లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ భాజపాలో చేరారు.
భాజపాలో చేరిన శివరాజ్ పాటిల్ కోడలు
ముంబయి: లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ భాజపాలో చేరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. యూపీఏ-1 హయాంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రదాడి నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు. దీనికి ముందు ఆయన లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు.
ఎన్డీయేకే పశుపతి పరాస్ మద్దతు
దిల్లీ: బిహార్లో తమకు ఒక్క సీటూ కేటాయించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటికొచ్చిన కేంద్ర మాజీ మంత్రి, ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి కుమార్ పరాస్ యూటర్న్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతిస్తామని శనివారం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ‘ఎన్డీయేలో రాష్ట్రీయ లోక్ జన్శక్తి పార్టీ అవిభాజ్య భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీయే మా నేత. ఎన్డీయే ఈసారి 400కుపైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం’ అని పరాస్ పేర్కొన్నారు. తన పోస్టును కేంద్ర మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్యాగ్ చేశారు.
అరుణాచల్ సీఎం సహా 10 మంది ఏకగ్రీవం
ఈటానగర్: అరుణాచల్ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మే సహా 10 మంది భాజపా అభ్యర్థులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారం ముగియడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పవన్కుమార్ సైన్ విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. తవాంగ్ జిల్లా ముక్తో నియోజకవర్గం నుంచి ఖండూ ఒక్కరే నామినేషన్ వేశారు. ఆరు చోట్ల ఇలా ఒక్కొక్క నామినేషన్ రాగా, నాలుగుచోట్ల ప్రత్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 10 మంది ఎలాంటి పోటీ లేకుండా విజేతలయ్యారు. ఖండూ అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇది నాలుగోసారి.
ఐటీ నోటీసులపై కాంగ్రెస్ నిరసనలు
దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పంపిన తాజా నోటీసులపై కాంగ్రెస్ శనివారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పన్ను ఉగ్రవాద’ చర్యలతో తాము బెదిరేది లేదని స్పష్టంచేసింది. ఈ విమర్శలను భాజపా ఖండించింది. శుక్రవారం రాత్రి తనకు ఐటీ శాఖ నుంచి నోటీసు అందిందని, అది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. తనకు సంబంధించిన కేసు ఇప్పటికే పరిష్కారమైందని చెప్పారు. భాజపా నేతల పన్ను ఉల్లంఘనలను అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలు.. ఐటీ అధికారుల కళ్లకు ఎవరు గంతలు కడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక సాయం చేయాలని ప్రజలనే కోరాలని పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్విరాజ్ సాథే సూచించారు. పార్టీలన్నింటినీ నాశనం చేయాలని భాజపా అనుకుంటోందని, ఇది అందరికీ హెచ్చరిక అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘ఆ పార్టీ ఎజెండా అయిన ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ఉద్దేశం ‘ఒకే దేశం.. ఒకే పార్టీ’. ప్రజలు దీన్ని త్వరలోనే గమనిస్తారు’’ అని పేర్కొన్నారు.
బారామతిలో వదినా మరదళ్ల మధ్యే పోటీ
ముంబయి: శరద్ పవార్ కంచుకోట బారామతిలో ఆయన కుటుంబ సభ్యులే పరస్పరం తలపడే పరిస్థితి నెలకొంది. పవార్ కుమార్తె, ప్రస్తుత ఎంపీ సుప్రియా సూలేతో.. పార్టీని చీల్చి ఎన్డీయేలో చేరిన అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీపడనున్నారు. వీరిద్దరూ వదినా మరదళ్లు. శనివారం బారామతిలో మహాయుతి (ఎన్డీయే కూటమి- శివసేన, భాజపా, ఎన్సీపీ) అభ్యర్థిగా సునేత్రను అధికారికంగా ప్రకటించారు. ఇది తనకెంతో కలిసివచ్చిన రోజని తన అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత స్పందించిన 60ఏళ్ల సునేత్ర వ్యాఖ్యానించారు.
చట్టానికి కాంగ్రెస్ పార్టీ అతీతం కాదు
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్
జమ్ము: చట్టానికి కాంగ్రెస్ పార్టీ అతీతమేమీ కాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి శనివారం జమ్ము వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే యూపీఏ నుంచి ఇండియా కూటమి అని పేరు మార్చుకున్నారని విమర్శించారు. ‘ఆరు దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్కు ఇంకా ఆ అభిజాత్యం పోలేదు. అన్ని పార్టీలూ ఐటీ నిబంధనలను అమలు చేస్తున్నప్పుడు ఆ ఒక్క పార్టీనే ఎందుకు ప్రత్యేకం?’ అని కేంద్రమంత్రి ప్రశ్నించారు.
కొండలెక్కగలను.. ఓట్లు అడగగలను!
ఉధంపుర్: జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ నియోజక వర్గం నుంచి భాజపా తరఫున పోటీచేస్తున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం ఇలా కొండ ప్రాంతాల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
యుద్ధప్రాతిపదికన పింఛన్లు పంపిణీ చేయాలి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: వాలంటీర్లను పింఛను పంపిణీ తదితర విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినందున సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే పింఛన్లు అందజేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాలంటీర్లను ప్రజాసేవా కార్యక్రమాలకు ఉపయోగించకుండా... వైకాపా ప్రచారానికి వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. వాలంటీర్లతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా చేసి.. వారి సస్పెన్షన్లు, క్రిమినల్ కేసుల నమోదుకు జగన్ కారణమయ్యారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
బుట్టా రేణుక పేదరాలనడం కంటే దౌర్భాగ్యం లేదు
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
ఈనాడు డిజిటల్, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్కు మతిపోయి.. బుట్టా రేణుక లాంటి సంపన్నుల్ని పేదవాళ్లంటున్నారని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. బుట్టా రేణుకను పేదరాలు అనడం కంటే దౌర్భాగ్యం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలను పరిశీలిస్తే అత్యంత ధనికులకు సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్రెడ్డేనని తెలిపారు. ఈసారి గనులు, భూములు, ఇసుక, మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్రెడ్డి... మరోసారి వస్తే రాష్ట్రాన్నే హోల్సేల్గా అమ్మేస్తారని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పేదల పెన్నిధి చంద్రబాబు... ద్రోహి జగన్. తెదేపా హయాంలో పేదల కడుపు నింపడానికి పెట్టిన అన్నక్యాంటీన్లను.. జగన్ సీఎం కాగానే రద్దుచేశారు. మద్యనిషేధం చేస్తానని.. కల్తీమద్యాన్ని ఏరులై పారించి మహిళల మాంగల్యాలు తెంచారు. 20 వేల ఎకరాల ఎసైన్డ్భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు కుదించి బీసీలకు దక్కాల్సిన 16,800 పదవుల్ని దూరం చేశారు’’ అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా మాజీమంత్రి కేఎస్ జవహర్కు రాష్ట్రంలో ఏదైనా ఎస్సీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలని దళిత ప్రజాసంఘాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పున:పరిశీలించాలని కోరుతూ తెదేపా ఎన్నికల సమన్వయకర్త దేవినేని ఉమా, పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు శనివారం వినతిపత్రం ఇచ్చారు.
మద్యం నిషేధించకుండా ఎలా ఓట్లడుగుతారు?
పదేపదే అబద్ధాలతో మోసం చేస్తామంటే కుదరదు
సీఎం జగన్పై దేవినేని ఉమా ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి... మద్యం నిషేధించకుండా ఎలా ఓట్లడుగుతారని సీఎం జగన్పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో రూ.వేల కోట్లు దోచుకున్నది కాక.. 30వేల పేద కుటుంబాల్ని దిక్కులేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు ఛార్జీలు పెంచనని ప్రతిపక్షనేతగా చెప్పి.. అధికారంలోకి వచ్చాక తొమ్మిది సార్లు ఛార్జీలను పెంచారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘గతంలో రూ.200 ఉన్న ఇంటిపన్నును నేడు రూ.వెయ్యికి పెంచారు. ఏటా జనవరి 1న జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నిరుద్యోగ యువతను మోసం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రిస్తానని కనీసం వ్యాట్ తగ్గించలేదు’’ అని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ముందు చెల్లెళ్లు షర్మిల, సునీతల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ అసమర్థ పాలనే నిరుద్యోగితకు కారణం!
భాజపా నేత లంకా దినకర్
ఈనాడు, అమరావతి: దేశంలో అత్యధికంగా 24% నిరుద్యోగిత రేట్తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడం సీఎం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ప్రధాని మోదీ అగ్రవర్ణాల పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే.. రాష్ట్రప్రభుత్వం అమలుచేయట్లేదని ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. మరోసారి జగన్ గెలిస్తే శతాబ్దం వెనక్కిపోతుంది. కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఒంగోలువద్ద కొత్తపట్టణం ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాలు ఎందుకు సాగడంలేదు? 2024-25 సంవత్సరానికి సంబంధించి కొత్తగా 5 వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు రావడంలో తీవ్ర జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’ అని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే