వ్యక్తి కాదు.. వ్యవస్థల రక్షణే లక్ష్యం
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో ‘లోక్తంత్ర బచావో ర్యాలీ’ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శనివారం స్పష్టం చేసింది.
దిల్లీలో నేటి ఇండియా కూటమి ర్యాలీపై కాంగ్రెస్ స్పష్టీకరణ
దిల్లీ: భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో ‘లోక్తంత్ర బచావో ర్యాలీ’ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శనివారం స్పష్టం చేసింది. ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదని తెలిపింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి దిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగానే ఈ సభ జరుగుతోందని ఆప్ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ శకం ముగిసిపోయిందనే సందేశాన్ని కల్యాణ్ మార్గ్( ప్రధాని మోదీ నివాసం)కి ఇండియా కూటమి గట్టిగా వినిపించనుందని కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
‘ఇది ఏ ఒక్క వ్యక్తి లేదా పార్టీ కోసమో నిర్వహిస్తున్న సభ కాదు. అందుకే లోక్తంత్ర బచావో ర్యాలీ అనే పేరు పెట్టాం. ఇండియా కూటమికి చెందిన 27-28 పార్టీలన్నీ పాల్గొంటాయి’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. భాజపా పాలనలో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని, ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు భగవంత్మాన్, అఖిలేశ్యాదవ్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు సభకు హాజరవుతారని జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా సభలో పాల్గొంటారని సమాచారం.
దిల్లీలో ఆదివారం ఇండియా కూటమి నిర్వహించే సభకు 20వేల మంది ప్రజలు హాజరయ్యేందుకు మాత్రమే అధికారులు అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే, పంజాబ్ రాష్ట్రం నుంచే లక్ష మందికి పైగా వస్తారని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్లీలా మైదానంలో నిర్వహించే సభ కోసం పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. సభకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రాంగణంలోకి అనుమతిస్తామని తెలిపారు.
దేశాన్ని పాలిస్తోంది నేరగాళ్ల ముఠానా?: రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం గొంతు నులిమేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశాన్ని ప్రభుత్వం పాలిస్తున్నట్లుగా లేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా ఒక చేత్తో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ మరో చేత్తో విపక్షాల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తోందని దుయ్యబట్టారు. ‘భాజపా వెంట లేకపోతే జైళ్లలోకి తోసేయడం... విరాళాలు ఇస్తే బెయిల్పై విడుదల చేయడం...ఇదంతా చూస్తుంటే దేశాన్ని నేరస్థుల ముఠా పాలిస్తున్నట్లుగా ఉంద’ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాహుల్ పోస్ట్ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఇండియా కూటమి వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.
భాజపా...ఓ వాషింగ్ మెషిన్!
అవినీతిపరుల మరకల్ని మాయం చేస్తుంది
కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వ్యాఖ్య
దిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు భాజపాలో చేరిన తర్వాత నిజాయతీ గల వ్యక్తులుగా బయటకు వస్తారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భాజపా పెద్ద ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్ అని..అవినీతి, మోసం, కుంభకోణం వంటి మరకలు పడిన వారిని మోదీ అనే వాషింగ్ పౌడర్తో శుభ్రంగా మారుస్తోందంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై వాషింగ్ మెషిన్ను ప్రదర్శించి దానిని భాజపాతో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మెషిన్ ధర రూ.8,500 కోట్లు (భాజపా ఎన్నికల బాండ్ల విలువ) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.