అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు.
మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం
ఇంట్లో ఉన్న అర్హులందరికీ పింఛను
9 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
జగన్ మోసాల్ని జనంలోకి తీసుకెళ్లాలని పిలుపు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష ఇస్తామని ఆమె వెల్లడించారు. ‘గడప గడపకు కాంగ్రెస్’ ప్రచార కార్యక్రమాన్ని షర్మిల విజయవాడలో శనివారం ప్రారంభించి, 9 గ్యారంటీలను ప్రకటించారు. సీఎం జగన్ ప్రత్యేకహోదా తెస్తానని రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. భాజపాతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన జగన్ మోసాలను ప్రజలకు వివరించాలని షర్మిల కార్యకర్తలకు సూచించారు. ‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేయకపోయినా.. జగన్, చంద్రబాబు ఆ పార్టీకి బానిసలుగా మారారు. విభజన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. ప్రత్యేకహోదా ఊసే లేదు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే అన్నారు. జగన్, చంద్రబాబులకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. భాజపా అంటే.. బాబు, జగన్, పవన్ అని తెలియజేయాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాంగ్రెస్తోనే సాధ్యం’ అని షర్మిల అన్నారు. ‘కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన 1,500 దరఖాస్తులపై సర్వేలు చేశాం. అభ్యర్థి పనితీరు, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నాం. టికెట్లు రానివారు కాంగ్రెస్ గెలుపునకు శ్రమించకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాకపోతే మణిపుర్ లాంటి ఘటనలే పునరావృతమవుతాయి’ అని పేర్కొన్నారు.
1న అభ్యర్థుల జాబితా: రఘువీరారెడ్డి
ఏప్రిల్ 1న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని, టికెట్ ఎవరికి వచ్చినా విజయానికి మిగిలిన వారంతా కృషిచేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీల ద్వారా కర్ణాటక, తెలంగాణల్లో మంచి ఫలితాలొచ్చాయని.. పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ మరో సభ్యుడు గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మేయప్పన్, ఎన్నికల పరిశీలకులు శంకర్, మనోజ్ చౌహాన్, కేంద్ర మాజీమంత్రులు జేడీ శీలం, పళ్లంరాజు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ తదితరులు మాట్లాడారు.
ఇవీ 9 గ్యారంటీలు
- అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా
- పెట్టుబడిపై 50% లాభంతో రైతులకు మద్దతు ధర
- రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
- మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష
- ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం
- ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరుమీద రూ.5 లక్షలతో పక్కా ఇల్లు
- ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పింఛను. అర్హులైన వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?