వైకాపా ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ
ఓడిపోయినా దశాబ్దకాలంగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నోరు తెరిచి ఏమీ అడగలేదు.
ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికొస్తే.. మా కోసం ఏం చేశారని నిలదీయండి
కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి
వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్
మీ ఆశీర్వాదం కావాలి..
ఓడిపోయినా దశాబ్దకాలంగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఈ రోజు అడుగుతున్నాను. నా పిఠాపురం వాసులను, ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల ప్రజలను అడుగుతున్నాను. 54 గ్రామాల ప్రజల్ని పేరుపేరునా అడుగుతున్నాను. నేను మీ కోసం నిలబడతాను. మీ ఆశీర్వాదం కావాలి. నన్ను గెలిపించండి. నియోజకవర్గ ప్రజల్ని గుండెల్లో పెట్టుకోవడానికి ఇక్కడికొచ్చా.. ఆదర్శంగా తీర్చిదిద్ది పిఠాపురం ఖ్యాతిని దేశవ్యాప్తం చేస్తా.
పవన్ కల్యాణ్
ఈనాడు, కాకినాడ: వైకాపా ఫ్యానుకు సౌండ్ ఎక్కువ... గాలి తక్కువ.. ఆ పార్టీని నమ్మొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాతికేళ్ల భవిష్యత్తు కావాలా? రూ.5 వేల జీతం కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా కావాలా.. మీ కోసం నిలబడే కూటమి కావాలా తేల్చుకోవాలని కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో శనివారం రాత్రి ఆయన ప్రసంగించారు. ‘నన్ను పదేళ్లుగా చూస్తున్నారు... ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు.. వేరెవరైనా పార్టీ మార్చేస్తారు.. జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కానీ నేను మీరిచ్చిన మనోబలంతో ఈ దశాబ్ద కాలం గడిపాను. ఉప్పాడ తీరంలో సముద్రం కోతలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ జనసేన నిలబడింది. మీ వెన్నంటి నడవడానికే నేను, పార్టీ నిలబడి ఉన్నాం’ అని పవన్కల్యాణ్ అన్నారు.
‘నేను ఓ ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చే మార్గం చెప్పాలని మా అన్నయ్యను అడిగాను. ఆయన తిట్టి నన్ను యాక్టింగ్ స్కూల్లో చేర్చారు. అదే నా స్కిల్ డెవలప్మెంట్. ఈరోజు మీ గుండెల్లో నన్ను నిలిపింది ఆ నైపుణ్యమే. అందుకే నేను పిఠాపురం నుంచి మాట ఇస్తున్నాను. యువతకు ఉపాధి కోసం పిఠాపురంలో 20 సెక్టార్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చే బాధ్యతను తీసుకుంటా. వర్మగారు వాళ్ల నాయకులతో ఒక్కటే చెప్పారట.. పవన్ కల్యాణ్ అన్ని కులాల మనిషి అని. నేనూ అలాగే పనిచేస్తా’ అని పవన్ స్పష్టంచేశారు.
భవిష్యత్తు మనదేనని తెలిసే ఈ కక్ష
‘జగన్ మాట్లాడితే పేదలకు పెత్తందార్లకు పోటీ అంటారు. వాళ్ల ఇంట్లో ఎవరికీ డబ్బులు లేవంట పాపం. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆయన అంటున్నారు. జగన్ పేదనా? రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ల ఎమ్మెల్యేలు పేదలా? వాళ్ల అభ్యర్థులు అంతంతమాత్రం అంటే ఎంతెంత మాత్రమో అర్థం కావడం లేదు. సాక్షి పేపర్, భారతి సిమెంట్, సజ్జల, 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన మిథున్రెడ్డి పేదవాళ్లా. రూ.20 వేల కోట్లు దోచేసిన జగన్ పేదా? 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ను పేదవాడంటారా? కాకినాడలో మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి మిథున్రెడ్డి వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. పవన్ కల్యాణ్ దగ్గర శక్తి ఏముంది.. పట్టుమని పాతిక మంది ఎంపీలను నిలబెట్టలేని పరిస్థితి. కనీసం ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవడానికి తపన పడుతున్నాను. నా మీద ఎందుకీ కక్ష.. భవిష్యత్తు మనదని తెలిసే ఇలా చేస్తున్నారు’ అని పవన్ చెప్పారు.
219 దేవాలయాల్ని అపవిత్రం చేశారు
‘వైకాపా పాలనలో అవినీతి లేదా? అవినీతి నిరోధకశాఖ టోల్ఫ్రీ నంబరు ఇస్తే నాలుగేళ్లలో 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అందులో 2 లక్షల ఫిర్యాదులు వాళ్ల మంత్రి వర్గం, సిబ్బంది మీదే. మరో 4 లక్షలు వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీదనే వచ్చాయి. జగన్ పాలనలో 219 దేవాలయాలను అపవిత్రం చేశారు. వైకాపా నాయకులు, వంగా గీత వస్తే... ఇన్ని దేవాలయాలను ధ్వంసం, అపవిత్రం చేస్తే ఎంతమందిని పట్టుకున్నారని అడగండి. పిఠాపురంలో విగ్రహాలను అపవిత్రం చేస్తే ఆ దోషులను ఎందుకు పట్టుకోలేదని అడగండి.. కాకినాడలో ఇటీవల శివాలయం పూజారిని చొక్కా పట్టుకుని వైకాపా నాయకుడి అనుచరుడు భక్తులు చూస్తుండగానే కొట్టాడు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్లు’ అని ధ్వజమెత్తారు. ‘వైకాపా హయాంలో కాకినాడ పోర్టు డ్రగ్స్ అక్రమ బియ్యం, డీజిల్ మాఫియాకు హబ్గా మారింది. ఎన్నికల కోసం కాకినాడ పోర్టులోని కంటెయినర్లలో డబ్బు దాచారన్న ప్రచారం నడుస్తోంది’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.