అవినాష్ చేతిలో జగన్ గుట్టు
‘మీ చిన్నాన్న వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేశారు.
అందుకే ఆయనంటే సీఎంకు భయం
రాష్ట్రాన్ని కాపాడటం ఎన్డీయేతోనే సాధ్యం
మా వెనుక నడిస్తే స్వర్ణయుగం... లేదంటే రాతియుగం
నాది ఎస్వీయూ... జగన్ది రహస్య విద్యాలయం
ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు-కడప, తిరుపతి, ఈనాడు డిజిటల్- తిరుపతి: ‘మీ చిన్నాన్న వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేశారు. ఏదైనా తేడా వస్తే వివేకా హత్యకేసు మీదాకా వస్తుందని భయమా?’ అని జగన్ను చంద్రబాబు ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలని సవాలు విసిరారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్కు నీరు, ప్రాజెక్టుల విలువ తెలియదని మండిపడ్డారు. ఈ అయిదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండు చేశారు. తెదేపా హయాంలో రాయలసీమకు కియాను తీసుకొచ్చామని, కరవు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలోని పలు దేశాల్లో పరుగులు తీస్తున్నాయన్నారు. ‘మా హయాంలో పరిశ్రమలు వచ్చాయి. జగన్ వచ్చి అమరరాజ బ్యాటరీస్, జాకీలను తరిమేశారు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘సీఎం ఎక్కడికి వెళ్లినా ఖాళీ బిందెలతో జనం నిరసనలు తెలుపుతున్నారు. కర్నూలులో వారానికోసారి నీరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు’ అని చెప్పారు. ‘క్విట్ జగన్... సేవ్ రాయలసీమ’ నినాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
దోపిడీ... బాదుడు ఉండవు
రాష్ట్రాన్ని కాపాడటం ఎన్డీయేతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు. ‘మమ్మల్ని గెలిపిస్తే... రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మీ బిడ్డలకు ఉపాధి దొరుకుతుంది. పంటలకు గిట్టుబాటు ధర, నీళ్లు వస్తాయి. విద్యుత్తు ఛార్జీలు, మద్యం ధరలను నియంత్రిస్తాం. సహజవనరుల దోపిడీ, ధరల బాదుడు ఉండవు’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. ఫ్యాన్ను ముక్కలు చేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నాలాగా ఎండలో నిల్చో చూద్దాం...
‘నా వయసు గురించి జగన్ మాట్లాడుతున్నారు. నాలాగా రెండు గంటలు ఎండలో నిల్చో జగన్... నీ కథ తేలిపోతుంది. నేను ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఏ అర్థశాస్త్రం చదివా. మీరు ఎక్కడ చదివారు? రహస్య విశ్వవిద్యాలయంలో చదివారా? జగన్... మీరు గోళీలు ఆడుకుంటున్న సమయంలో... మీ నాన్నకంటే ముందే నేను సీఎం అయ్యాను. ఒకసారి చరిత్ర చూడండి. తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. 14 ఏళ్లు సీఎంగా ఉంటే ఎనిమిది సార్లు డీఎస్సీ కింద ఖాళీల్ని భర్తీ చేశాం. మీరు అయిదేళ్లలో ఎన్ని డీఎస్సీలు పెట్టారు’ అని ప్రశ్నించారు.
ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది
‘జగన్ అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే ఏపీ వెనకబడింది. ఈ రాతియుగం నుంచి స్వర్ణయుగానికి తీసుకెళ్లేందుకు నేనే చోదకుడిని అవుతా. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. జీవన పయనంలోనూ తోడ్పాటు అందిస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘దళితులంటే జగన్కు చిన్నచూపు. అందుకే వారిలో కొందరికి టికెట్లివ్వలేదు. మరికొందరి స్థానాల్ని మార్చేశారు’ అని విమర్శించారు.
వాలంటీర్లకు న్యాయం చేస్తా..
‘వాలంటీర్లూ జగన్ ఉచ్చులో పడకండి. రాజీనామాలు చేసి వైకాపా కోసం పనిచేస్తే మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. వారు వచ్చేదీ లేదు... ఇచ్చేదీ లేదు. మీరు తటస్థంగా ఉండాలి. మేం గెలిస్తే మీకు న్యాయం చేస్తా. చదువుకున్నవారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించే మార్గం చూపిస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘వైకాపా పాలనలో స్కీం అంటే అందులో పెద్ద స్కాం ఉంటుంది. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల పేరుతో దోచేశారు. విశాఖ, గుంటూరు, తణుకు, విజయవాడ, తిరుపతిల్లో రూ.25 వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెదేపా రాగానే వాటిని రద్దుచేస్తాం. జగన్ అప్పుల అప్పారావులా మారి లక్షల కోట్లు రుణాలు తెచ్చారు. అందుకోసం తహసీల్దారు కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఆసుపత్రులను తనఖా పెట్టారు. ఇక మిగిలింది ప్రజల ఇళ్లు, ఆస్తులే’ అని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట