రెండంచెల వ్యూహం.. గెలుపే ధ్యేయం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వలసలతో లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలు మారనున్నాయి.
ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహం
ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయంపై దృష్టి
అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం
వలసలతో మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వలసలతో లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలు మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ పురపాలక సంఘాలను, నగర పాలికలను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నాయకులపై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనేందుకు కాంగ్రెస్ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో మరింత మెజార్టీ సాధించడం, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ వచ్చింది. ఇందులో పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్ ఉన్నాయి. మిగిలిన ఎనిమిదింటిలో హైదరాబాద్ లోక్సభను మినహాయిస్తే ఆదిలాబాద్లో మూడో స్థానంలో ఉండగా, మిగిలిన ఆరింటిలో రెండో స్థానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన స్థానాల్లో వరంగల్ మినహా మిగిలిన అన్నిచోట్లా శాసనసభ ఎన్నికలకు ముందు చేరినవారికి, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చింది. మెజార్టీ వచ్చిన స్థానాల్లో కూడా ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట గట్టి అభ్యర్థిని రంగంలోకి దించడం.., ఇతరపార్టీల నుంచి వచ్చే ముఖ్యనాయకులను చేర్చుకొని ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్ఠంగా చేసేలా చర్యలు చేసుకుంటోంది.
నియోజకవర్గాల వారీగా నజర్
వరంగల్ లోక్సభ స్థానంపై పార్టీ ప్రత్యేకదృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్టేషన్ఘన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరిని చేర్చుకుంది. ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వనుంది. వరంగల్ పరిధిలోని వర్థన్నపేట, పరకాల మున్సిపల్ ఛైర్మన్లు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. డీసీసీబీ ఛైర్మన్ కూడా భారాస నుంచి కాంగ్రెస్లో చేరారు. వరంగల్ మేయర్ ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశారు. మహబూబ్నగర్ లోక్సభ నుంచి భారాస సిటింగ్ ఎంపీ పోటీలో ఉండటం, భాజపా నుంచి డీకే అరుణ బరిలోకి దిగడంతో నియోజకవర్గంపై ప్రభావం చూపగల నాయకులను చేర్చుకొంది. భాజపాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, భారాసకు చెందిన మహబూబ్నగర్ జడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డితో పాటు స్థానికసంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరారు. జహీరాబాద్ లోక్సభ పరిధిలో భారాస కంటే కేవలం 14 వేల ఓట్లే కాంగ్రెస్కు ఎక్కువగా వచ్చాయి. భారాస సిటింగ్ ఎంపీ బీబీపాటిల్ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ పార్టీ పటిష్ఠానికి కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టి ఈ పురపాలికను కైవసం చేసుకొంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు భారాస నుంచి వచ్చిన వారిని పోటీకి దింపింది.
ఆదిలాబాద్పై పట్టు బిగించే దిశగా..
గత డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 4.64 లక్షలు, భాజపాకు 4.47 లక్షలు, కాంగ్రెస్కు 2.51 లక్షల ఓట్లు వచ్చాయి. 7 అసెంబ్లీ స్థానాలకు గాను.. నాలుగు భాజపా, రెండు భారాస, కాంగ్రెస్ ఒకటి గెలుచుకొన్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆదిలాబాద్ను దక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడి అభ్యర్థిగా ఆత్రం సుగుణను ఎంపిక చేసింది. ఈమె ఉపాధ్యాయురాలిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంతో పాటు.. మానవ హక్కులు, ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ లోక్సభ పరిధిలో సిర్పూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొన్నాళ్ల కిందట కాంగ్రెస్లో చేరగా, తాజాగా ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి చేరారు. ఈ రెండుచోట్ల భాజపా గెలవగా, భారాస సమీప ప్రత్యర్థిగా ఉంది. కాంగ్రెస్కు సిర్పూరులో 8500, ముథోల్లో 15,500 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పట్టున్న మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం తమకు లాభిస్తుందని పార్టీ భావిస్తోంది. నిర్మల్లో కూడా ప్రభావం చూపగల భారాస నాయకులను తమవైపు తిప్పుకోవడం, భాజపాలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఉన్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ప్రభావం చూపని కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఇక్కడ మొదటి స్థానంలో ఉన్న భారాస కంటే బాగా వెనకబడి ఉంది. ఈ స్థానం నుంచి భాజపా సిటింగ్ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. ఇక్కడ భారాసకు 4.63 లక్షలు రాగా, కాంగ్రెస్కు 2.8 లక్షలు, భాజపాకు 2.16 లక్షలు, ఎంఐఎంకు 62 వేల ఓట్లు వచ్చాయి. సిటింగ్ ఎంపీ ఉన్న భాజపా మూడో స్థానంలో నిలిచినా, మొదటి, రెండో స్థానానికి 1.80లక్షల ఓట్ల తేడా ఉంది. దీంతో భారాస తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముందే కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ కొన్నాళ్ల కిందటే చేరగా, తాజాగా మేయర్, పలువురు కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నాయకులు చేరారు. ఇక్కడ ప్రధాన పోటీదారుగా మారడానికి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
నిజామాబాద్లో పోటాపోటీ
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస, కాంగ్రెస్, భాజపాలకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడు భారాస, కాంగ్రెస్, భాజపా రెండేసి గెలుచుకొన్నాయి. భారాసకు 4.17 లక్షలు, కాంగ్రెస్కు 4.08 లక్షలు, భాజపాకు 3.65 లక్షల ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీ ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని బరిలోకి దించింది. ఈయన జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో జగిత్యాలలో ఆధిపత్యం సాధించడంతో పాటు తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి కొందరు ముఖ్యుల్ని చేర్చుకొనే పనిలో ఉంది. ఆర్మూర్ పురపాలికపై అవిశ్వాసం పెట్టి కైవసం చేసుకొంది.
కరీంనగర్ అభ్యర్థి ఎంపికపై మరింత కసరత్తు
కరీంనగర్ లోక్సభలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి 7 అసెంబ్లీ సెగెంట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు భారాస కైవసం చేసుకొన్నాయి. ఓట్లపరంగా చూసినపుడు భారాసకు 5.17 లక్షలు, కాంగ్రెస్కు 5.12 లక్షలు రాగా, భాజపాకు 2.5 లక్షలు వచ్చాయి. అయితే భాజపా నుంచి సిటింగ్ ఎంపీ బండి సంజయ్, భారాస తరఫున మాజీ ఎంపీ వినోద్కుమార్ పోటీ చేస్తుండటంతో అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చొప్పదండి మున్సిపల్ ఛైర్పర్సన్ కాంగ్రెస్లో చేరగా, తాజాగా జమ్మికుంట మున్సిపల్ వైస్ ఛైర్మన్ చేరారు. మరికొందరి చేరికల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
సీనియర్ నేతలపై గాలం
కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో సీనియర్ నేతలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకొంటే కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఆ పార్టీ కంటే భారాసకు 2.4 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ నీలం మధును కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇక్కడ ముఖ్యనాయకులు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, భారాస సీనియర్ నాయకుడు మదన్రెడ్డి, మరో నాయకుడు ఎలక్షన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి.. పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బాగా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వీటిపై ఎక్కువగా కేంద్రీకరించే ఆలోచన చేస్తోంది. ఇక చేవెళ్ల లోక్సభ పరిధిలో భారాస కంటే కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికలలో లక్ష ఓట్లు తక్కువ వచ్చాయి. ఈక్రమంలో రంగారెడ్డి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్లు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సహా అనేక మందిని చేర్చుకుంది. భారాస సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆయనకే సీటు ఇచ్చింది. వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పూర్తి స్థాయిలో మల్కాజిగిరిపై కేంద్రీకరించారు. ఈ రెండు లోక్సభల పరిధిలో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ రెండు చోట్లా భాజపా తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం