ఇది వచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు
రాష్ట్రంలో ప్రస్తుత కరవు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని.. అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
వంద రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
అన్ని పంటలకు రూ.500 బోనస్ చెల్లించేదాకా ఉద్యమం
ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు
6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు
భారాస అధినేత కేసీఆర్
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పంటల పరిశీలన
ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలో ప్రస్తుత కరవు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని.. అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులతో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని.. ఎకరాకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా ప్రస్తుత సీజన్ నుంచే ప్రతి పంటకూ రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో భారాస కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘‘తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందనుకోలేదు. గత ఏడెనిమిదేళ్లు వ్యవసాయ స్థిరీకరణ, రైతు కేంద్రంగా పాలన సాగించాం. వారికి అనేక పద్ధతుల ద్వారా సాగునీళ్లివ్వడం, సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించడం, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7,600 కేంద్రాలు ఏర్పాటు చేశాం. నీళ్లిస్తారని నమ్మి పంటలు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం కాల్వలకు నీళ్లు వదలకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని రైతులు నా పర్యటనలో చెప్పారు. దేశంలోనే నంబర్ వన్గా ఉన్న రాష్ట్రంలో ఇంత స్వల్పకాలంలోనే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మళ్లీ ట్యాంకర్లు సందడి చేస్తున్నాయి. బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయో ఆలోచించాలి.
మిషన్ భగీరథపై పట్టింపేదీ?
‘‘ఐదారేళ్లపాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాం. ఇప్పుడు మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి? మోటార్లు నడవాలంటే 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు ఉండాలి. రైతుల మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి? గత పదేళ్లుగా రాష్ట్రంలో మాయమైన జనరేటర్లు, ఇన్వర్టర్లు, క్రేన్లు, బోర్లు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంకా మూడున్నర నెలలు గడిస్తే గానీ ప్రాజెక్టులకు వరద ప్రారంభం కాదు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటి? హైదరాబాద్కు ఒక్క అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై ఆధారపడకుండా సాగర్ నుంచి డెడ్ స్టోరేజీలోనూ నీటిని తీసుకునేలా రూ.1,450 కోట్లతో సుంకిశాలను ప్రారంభించాం. 70-75 శాతం పనులు చేశాం. దాన్ని పూర్తి చేస్తే హైదరాబాద్కు తాగునీటి కొరత తీర్చవచ్చు. మా హయాంలో హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చాం. కొంతమంది ఐటీ పెట్టుబడుదారులు న్యూయార్క్, లండన్లలో కరెంటు పోతుంది కానీ, హైదరాబాద్లో పోదని చెప్పేవాళ్లు. జాతీయ గ్రిడ్కు రాష్ట్రాన్ని అనుసంధానించడం వల్ల దేశంలో ఎక్కడ కరెంటు ఉన్నా రాష్ట్రంలో అవసరం ఉన్న సమయంలో వాడుకునేవాళ్లం. రాష్ట్రం ఏర్పడే సమయంలో 7,600 మెగావాట్ల సామర్థ్యం ఉంటే.. 18 వేలకు పెంచాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి అదనంగా 1,600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీతో పాటు 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ కేంద్రం అందుబాటులో ఉంది. అసమర్థ విధానాల వల్లే ప్రస్తుతం విద్యుత్తు వ్యవస్థ ఇలా తయారైంది. దీనికి నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
రైతులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3.5 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తుంగతుర్తిలో 25 వేలు, సూర్యాపేటలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాళ్లవానతో పంటలు ఎండిపోతే ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ రైతులను పరామర్శించరు. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. మా పాలనలో ఖమ్మంలో రాళ్లవానతో రైతులకు పంటనష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.500 కోట్ల వరకు ఇచ్చాం. అప్పుడు మేం ఇచ్చిన రూ.10 వేలు తక్కువంటూ కాంగ్రెస్ నానా యాగీ చేసింది. ఇప్పుడు రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి. రణరంగమైనా ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తాం. నాగార్జునసాగర్లో కనీస నీటిమట్టానికి ఎగువన 7 టీఎంసీలు, దిగువన 7 టీఎంసీలు.. మొత్తం 14 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కేఆర్ఎంబీ పేరు చెప్పి తాత్సారం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలు సరిపోతున్నాయి తప్పితే రైతుల బాధలు పట్టడం లేదు. ‘సాగర్’ను కేఆర్ఎంబీకి అప్పజెప్పి.. ప్రస్తుత ఎడమ కాల్వ ఆయకట్టు దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైంది. గత పదేళ్లు పచ్చగా ఉన్న పల్లెసీమలో ప్రస్తుతం బోరుబండ్ల హోరు వినిపిస్తోంది. చిల్లర డ్రామాల కోసం కాళేశ్వరం నీళ్లను కిందకు వదిలారు. గతంలో ఎస్సారెస్పీలో నీళ్లు లేకపోతే సింగూరు నుంచి నిజాంసాగర్ ద్వారా ఆయకట్టుకు నీళ్లిచ్చాం. ఇప్పుడు నీళ్లిచ్చే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో సాగర్ కుడివైపు కుంగితే పునరుద్ధరించారు. కాళేశ్వరంపై ప్రస్తుత ప్రభుత్వం ప్రళయం వచ్చినట్లు గందరగోళం సృష్టించింది. పారిశ్రామిక, ఐటీ సెక్టార్లలో తెలంగాణ గత మూడేళ్లలో అద్భుత ప్రతిభ కనబరిచిందని, 2019 నుంచి 2021 వరకు 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో) చెప్పింది.
రుణమాఫీ ఏమైంది?
డిసెంబరు 9 నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తామని రేవంత్ అన్నారు. డిసెంబరు 9 గడిచి ఎన్నాళ్లైంది? ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారు? రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. వారికి భారాస అండగా ఉంటుంది. పంట నష్టంపై తక్షణం జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వం లెక్కలు తీయించాలి. మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించాలి. ఏప్రిల్ 2న అన్ని జిల్లాల్లో రూ.500 బోనస్పై కలెక్టర్లకు భారాస శ్రేణులు వినతిపత్రం ఇవ్వాలి. 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయాలి. ఎస్ఎల్బీసీ మరో 20 ఏళ్లయినా పూర్తి కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే