మాది ఏకపక్ష విజయమే
మే 13న జరగబోయేది తెదేపా కూటమి అనుకూల ఏకపక్ష పోలింగ్ అని, ఎన్డీయే గెలుపు ఖాయమైందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
వైకాపా ఇంటికెళ్లడం ఖాయం
రాయలసీమకు జగన్ ఏం చేశారు?
పింఛన్లకు డబ్బుల్లేకే మాపై విష ప్రచారం
ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు
జగన్ నమ్మించి గొంతు కోసే రకం. ఈ సీఎం ఫేక్ ఫెలో. హూ కిల్డ్ బాబాయ్? అని అడుగుతున్నా. చంపించిన వాళ్లకు ఎంపీ సీటు, బాధితులపై కేసులా? చెల్లినే ఇబ్బంది పెట్టారు. భాజపాతో తాత్కాలిక ఒప్పందమంటూ నాపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మోసగాళ్లు వచ్చారు.
చంద్రబాబు
‘అయిదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైకాపా సహకరించింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ ఇప్పుడు రెచ్చగొడుతోంది. తెదేపా ఎప్పుడు అధికారంలో ఉన్నా 4% ముస్లిం రిజర్వేషన్లను కాపాడింది. మా పిల్లల భవిష్యత్తు నువ్వే చంద్రన్న అంటూ ముస్లిం సోదరులూ పేర్కొంటున్నారు. మా మూడు పార్టీల కలయిక మా కోసం కాదు.. రాష్ట్రం కోసం. జగన్ గేమ్ ఓవర్. కూటమి అన్స్టాపబుల్’
ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ఈనాడు, ఒంగోలు- మార్కాపురం పట్టణం, ఎమ్మిగనూరు, న్యూస్టుడే: మే 13న జరగబోయేది తెదేపా కూటమి అనుకూల ఏకపక్ష పోలింగ్ అని, ఎన్డీయే గెలుపు ఖాయమైందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను ఇంటికి పంపడం తప్పదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని జగన్ ముద్ర ఎక్కడుందని ప్రశ్నించారు. ‘సీమలో అయిదేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు. 102 ప్రాజెక్టులు రద్దుచేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. నీళ్లు లేని వెనకబడిన ప్రాంతం కర్నూలు. కనీసం నీళ్లివ్వాలని ఆలోచించారా? నేనూ రాయలసీమ బిడ్డనే. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68వేల కోట్లు వెచ్చించాం. రాయలసీమకే రూ.12వేల కోట్లు ఖర్చుచేశాం. జగన్ కేవలం రూ.2వేల కోట్లు కేటాయించారు’ అని చంద్రబాబు వివరించారు.
‘వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా. కోర్టు కేసుల వంటి సమస్యలనూ పరిష్కరించుకుని ముందుకెళ్లాం. తెదేపా హయాంలోనే 80% పనులు చేశాం. అధికారం కొనసాగితే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లిచ్చేవాళ్లం. ఆ తర్వాత వచ్చిన జగన్ డబ్బులకు కక్కుర్తిపడి గుత్తేదారును మార్చారు. మిగిలిన 20% పనులూ చేయలేకపోయారు. నిర్వాసితులకు పరిహారం అందించలేదు. నీళ్లివ్వకుండా సొరంగాలకు రిబ్బన్ కత్తిరించి ప్రాజెక్టు ప్రారంభమంటూ అబద్ధపు ప్రచారం చేయించుకున్నారు. 72% పనులైన పోలవరాన్నీ నాశనం చేశారు. బుద్ధున్నోడు ఎవరైనా ఇలా చేస్తారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తిచేసి నీళ్లిస్తానని, దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సీమలో 52 మంది ఎమ్మెల్యేల్లో 49 మంది వైకాపావారు గెలిచారు. వారు ఒక్క పనైనా చేశారా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా?’ అని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం ఎవరిది?
‘తెదేపా వెనకబడిన వర్గాలకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది. పేర్లతో సహా దీనిపై చర్చించేందుకు సిద్ధం. మీరు సిద్ధమా? ఒకే వర్గానికి 49 సీట్లు ఇచ్చిన వైకాపా నాయకులా మాట్లాడేది? సామాజిక న్యాయం అందించేదే తెదేపా. వైకాపాది బూటకపు న్యాయం. తెదేపా పేదల ప్రగతికి పనిచేసింది. బుట్టా రేణుక పేద మహిళ అంటూ జగన్రెడ్డి ప్రకటించారు. 2014లోనే ఆమె ఆస్తి రూ.250 కోట్లు. బీవై రామయ్య కూడా పేదనట. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఇసుక, మట్టితోపాటు మంత్రాలయం క్షేత్రాన్ని మింగేసిన వ్యక్తికి మళ్లీ సీటిచ్చారు. ఆదోనిలో వలసపక్షి ఉన్నారు. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లులోనూ వీళ్లు షాడోలుగా ఉంటారు. యుద్ధాల్లో సామంతరాజును చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లు వీళ్లు నాయకులను అణగదొక్కి దోచుకుంటున్నారు. సామాన్యుడు, కురబల కోసం రాజీ లేకుండా పోరాడిన నాగరాజును మా పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాం.
మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి అనే బోయ కులస్థుడిని నిలిపాం. పత్తికొండలో ఈడిగ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాం. భాజపా కూడా ఆదోని నుంచి బోయవర్గానికి చెందిన పార్థసారథికి టికెట్ ఇచ్చింది. కర్నూలులో వైశ్య, కోడుమూరులో ఎస్సీలకు ఇచ్చాం. వారందరి డీఎన్ఏలోనూ తెదేపా ఉంది’ అని వెల్లడించారు. ‘ఒంగోలు ఎంపీ మాగుంట కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. ఆయన ఆత్మగౌరవాన్ని వైకాపా దెబ్బతీసింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీసుకొచ్చింది. చిత్తూరులో ఆయన పుష్ప 1, ఒంగోలులో పుష్ప 2. అలాంటి పుష్ప 2కు ఓటేస్తారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ముస్లింలను రెచ్చగొడుతున్న వైకాపా
‘మేము భాజపాతో పొత్తు పెట్టుకున్నామని సీఎం జగన్ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. పార్లమెంటులో బిల్లులకు ఇంతకాలం మద్దతిచ్చి ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ముస్లింల అభివృద్ధికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?’ అని తెదేపా అధినేత సవాలు విసిరారు. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు.. ఒక్క అవకాశం ఇవ్వండి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఎన్నికల్లో ఏదైనా పొరపాటు జరిగితే నా శవాన్ని చూడాల్సి వస్తుంది..’ అని మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సభలో ఉద్వేగంగా అన్నారు. కార్యక్రమాల్లో కర్నూలు, ఒంగోలు లోక్సభ పార్టీ అభ్యర్థులు పంచలింగాల నాగరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవీ జయనాగేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, దామచర్ల జనార్దన్, అశోక్రెడ్డి, గూడూరి ఎరిక్షన్బాబు, గొట్టిపాటి లక్ష్మి, బాలవీరాంజనేయస్వామి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా సాగుదారులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్తు
ఈనాడు, బాపట్ల: మిగ్జాం తుపాను వచ్చి రైతులు నష్టపోతే వారిని ఆదుకోలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం బాపట్లలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘కరోనా సమయంలో లాక్డౌన్ పేరుతో అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అన్నం పెట్టే రైతన్న మాత్రం నిరంతరం కష్టపడ్డారు. అలాంటి రైతుకు కష్టం వస్తే ఆదుకోలేని ఈ ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరం. రైతులు పంటలు నష్టపోకూడదని నేను పట్టిసీమ కడితే సీఎం జగన్ అక్కసుతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు. కోస్తా తీరంలో ఆక్వా సాగును ప్రోత్సహించడానికి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్తు సరఫరా చేస్తానని హామీనిచ్చారు.
‘అక్కను వేధించవద్దని వేడుకున్న పాపానికి బీసీ సామాజికవర్గం బాలుడు, జిల్లాకు చెందిన ఉప్పాల అమరనాథ్గౌడ్ను దారుణంగా వైకాపాకు చెందినవారు హతమార్చారు. ఈ కేసులో నిందితుడు రెండు నెలల్లోనే బయటకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్టాడంటే ఈ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ఎలా న్యాయం చేస్తుంది’ అని సూటిగా ప్రశ్నించారు. సభలో వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఆయన తనయుడు జడ్పీటీసీ సభ్యుడు కోటయ్య చంద్రబాబును కలిశారు. సభకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో అప్పికట్లకు చెందిన తెదేపా కార్యకర్త కుంచాల వెంకటరత్నం రోడ్డుప్రమాదంలో మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల