కేసీఆర్లో మొదలైన భయం
గతంలో ఉన్న టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారి ఇప్పుడు వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ)కు వచ్చిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.
అందుకే అబద్ధాలు చెబుతున్నారు
నీటిపారుదల రంగాన్ని నాశనం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: గతంలో ఉన్న టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారి ఇప్పుడు వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ)కు వచ్చిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటూ గెలవలేదని, అందుకే కేసీఆర్ మానసిక ఒత్తిడితో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సోమవారం గాంధీభవన్లో ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రాంమోహన్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ‘భారాస పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్ద నేతలు జైలుకు పోతారు. ఈ లోక్సభ ఎన్నికల తరవాత భారాస పార్టీ మిగలదనే భయం కేసీఆర్లో మొదలైంది. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అది నిజం కాదు. భారాస నుంచి 200 మంది కాంగ్రెస్లో చేరుతున్నారు. ఆదివారం సూర్యాపేటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప భారాసలో ఎవరూ మిగలరు. సూర్యాపేటలో జనరేటర్ పెట్టుకొని సమావేశం పెట్టి, సాంకేతిక సమస్య ఏర్పడితే కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్ధం చెప్పారు. జగన్తో దోస్తీ కట్టి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు.
నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు...
కమీషన్ల కక్కుర్తి, అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందే కేసీఆర్. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత అక్టోబరులో భారాస పాలనలోనే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు నీరు ఇవ్వడం లేదని కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. ఈ పెద్దమనిషి గతంలో సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకొన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అప్పగించేది లేదని శాసనసభలో తీర్మానం చేశాం. 2023 జులై 2న అప్పటి సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి గోదావరి, కృష్ణాలో నీళ్లు లేనందున పంటలకు సరఫరా తగ్గించి తాగునీటికే ఇవ్వాలని అధికారులకు చెప్పారు. ఇప్పుడు పంటలకు నీరివ్వడం లేదని విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథ కోసం రూ.42 వేల కోట్ల అప్పులు తెచ్చి 99.9 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి నీరిస్తున్నామని అప్పటి భారాస ప్రభుత్వం తెలిపింది. అది నిజమే అయితే ఇప్పుడు తాగునీటి ఎద్దడి ఎందుకు ఉంటుంది?
నాడు ఎన్టీపీసీకి సహకరించలేదు
రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా 2,400 మెగావాట్ల ప్లాంటు నిర్మిస్తామని గత భారాస ప్రభుత్వాన్ని అడిగితే భూమి, నీరు ఇవ్వకుండా సతాయించిందని ఎన్టీపీసీ ఛైర్మన్ గురుదీప్ స్వయంగా పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. కేసీఆర్ సహకరించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల ప్లాంటు నిర్మించి రాష్ట్రానికి కరెంటు ఇచ్చేది. దాన్ని వదిలేసి కాలంచెల్లిన పరిజ్ఞానంతో భద్రాద్రి ప్లాంటును కేసీఆర్ నిర్మించారు. యాదాద్రి ప్లాంటు నిర్మాణ వ్యయం 3, 4 రెట్లు పెరిగింది. దీనివల్ల అక్కడ ఉత్పత్తయ్యే కరెంటు భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది. రాష్ట్రంలో ఈ యాసంగి వడ్లు కొనడానికి 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. ఏ వ్యాపారి అయినా మద్దతుధరకన్నా ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. పంటల బీమా పథకం అమల్లో లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం గతంలో పార్లమెంట్లో చెప్పింది. ఇప్పుడు పంటలు పాడయ్యాయని పరిహారం ఇవ్వలేదనడానికి కేసీఆర్ సిగ్గుపడాలి. కేసీఆర్ గత పదేళ్లలో వరదలు, వడగళ్లతో పంటలు దెబ్బతింటే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని రైతులు గమనించాలి’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!