అమరావతి,అభివృద్ధిపై దిమ్మ తిరిగే ప్రశ్నలు.. జవాబు చెప్పలేక వైకాపా నేతల ఉక్కిరిబిక్కిరి
రాజధాని అమరావతి విధ్వంసంతో జరిగిన నష్టం, గత అయిదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం, అభివృద్ధి లేక ఉపాధి కరవై యువత వలస పోవడంపై ప్రజల నుంచి తూటాల్లా వస్తున్న ప్రశ్నలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రావట.. అమరావతి వాటికి అనుకూలం కాదట!
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అతి తెలివి సమాధానం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసంతో జరిగిన నష్టం, గత అయిదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం, అభివృద్ధి లేక ఉపాధి కరవై యువత వలస పోవడంపై ప్రజల నుంచి తూటాల్లా వస్తున్న ప్రశ్నలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాజధాని అంశం తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైకాపా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అపార్ట్మెంట్ల నివాసితులతో ఆత్మీయ సమావేశాల పేరుతో స్థానిక వైకాపా అభ్యర్థి లావణ్యతో పాటు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో తాజాగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అక్కడివారు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే ఆర్కే నీళ్లు నమిలారు. ఒకపక్క తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ అపార్ట్మెంట్వాసులతో ఆత్మీయ సమావేశాల్లో.. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని, ఈ ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా ఇక్కడికి తెచ్చిన ఐటీ పరిశ్రమల్ని వైకాపా ప్రభుత్వం తరిమికొట్టిందని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీల్ని తెస్తామని చెప్పారు.
చదరపు అడుగు ధర రూ.5,500 నుంచి రూ.3,500కి పడిపోయింది
‘మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నీ విశాఖకు వెళ్లిపోతాయి. ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుంది. భూముల విలువలు పడిపోతాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమ వాటాగా వచ్చిన ఫ్లాట్లను చ.అడుగు రూ.5,500కి అమ్ముకునేవాళ్లు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేశాక ధరలు పడిపోయాయి. ఇప్పుడు రూ.3,500కి కూడా కొనేవాళ్లు లేరు. మా ఇళ్లలో అభిమానంతో రాజశేఖర్రెడ్డి ఫొటోలు పెట్టుకున్నాం. లోపల బాధ ఉన్నా... వైకాపా జెండా పట్టుకుని, డబ్బులు ఖర్చుపెట్టుకుని తిరుగుతున్నాం. ప్రజల్లో చాలా బాధ ఉంది. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులపై పడుతుంది’ అని తాడేపల్లికి సమీపంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం ఉదయం లావణ్య, ఆర్కే తదితరులు నిర్వహించిన సమావేశంలో వైకాపా మద్దతుదారు ఒకరు కుండబద్దలు కొట్టారు.
నిర్మాణ వ్యయం ఎక్కువని పరిశ్రమలు రావడం లేదట!
‘ఈ అయిదేళ్లలో ఈ ప్రాంతానికి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఐటీ ఉద్యోగాల్లేకపోవడంతో మళ్లీ హైదరాబాద్కు వెళ్లిపోవాలనుకుంటున్నాను. మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి ఏం చేస్తారు? పరిశ్రమలు, పెట్టుబడులు తేవడానికి మీ దగ్గరున్న ప్రణాళికలేంటి?’ అని అదే సమావేశంలో ఒక యువతి ప్రశ్నించారు. అది తనకు తెలియదని ఆర్కే జవాబిచ్చారు. ‘మనం తీర ప్రాంతంలో, తుపానులు వచ్చే ప్రదేశంలో ఉన్నాం. ఇవన్నీ సారవంతమైన భూములు. ఇక్కడ పునాదులు లోతుగా వెయ్యాలి. నిర్మాణ వ్యయం ఎక్కువని పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు వస్తాయి. అందుకే రాయలసీమ, విశాఖల్లో వచ్చాయి. పైగా ఈ ప్రాంతంతో పోలిస్తే విశాఖ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు కనెక్టివిటీ ఎక్కువ. ఐటీ రంగంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందాక బెంగళూరు కూడా ఇబ్బంది పడుతోంది. అయినా ఐటీలో ఇప్పుడు ఉద్యోగాల్లేవు. మనది వ్యవసాయ జోన్. ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయేమోగానీ, పెద్ద పరిశ్రమలు రావు’ అని ఆర్కే చెప్పిన సమాధానంతో అక్కడున్నవారికి నోటమాట రాలేదు. తెదేపా ప్రభుత్వం చొరవతో అమరావతిలో 68 ఐటీ కంపెనీలు వచ్చాయి. హెచ్సీఎల్ వంటి ఐటీ దిగ్గజం విజయవాడకు వచ్చింది. మేధాటవర్స్, మంగళగిరి ప్రాంతంలో అనేక స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. పైకేర్ వంటి కంపెనీలు వందల్లో నియామకాలు చేపట్టాయి. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే.. మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేవి. అలాంటిది ఇక్కడికి ఐటీ కంపెనీలే రావని ఆర్కే చెప్పడంతో ఏమనాలో వారికి అర్థం కాలేదు. విజయవాడ కన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు విశాఖ ఏ విధంగా దగ్గర? విజయవాడ నుంచి విశాఖకు కనెక్టివిటీ లేకపోవడమేంటి? నిర్మాణం వ్యయం చుక్కలను తాకే ముంబయి, బెంగళూరులకే పరిశ్రమలు వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు రావని సమావేశానికి వచ్చినవారు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి