కేసీఆర్ పాపం.. తెలంగాణకు శాపం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
విద్యుత్ సంస్థలపై రూ.లక్ష కోట్ల భారం
ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్నే ఆడిపోసుకుంటున్నారు
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఈనాడు, దిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆయన తన పదేళ్ల పాలనలో చేసిన తప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేనంత భారం పడిందని, రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా అప్పుల భారంలో చిక్కుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్ గొప్పగా కట్టినట్లు చెప్పుకొనే కాళేశ్వరం, భద్రాద్రి సబ్క్రిటికల్ విద్యుత్ కేంద్రం, యాదాద్రి విద్యుత్ కేంద్రాలు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలుగా మారాయని అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆయన కట్టుకథలు చెప్పే ప్రయత్నంచేశారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పట్టించుకోకపోవడంతో తడిసి మోపెడైన ‘యాదాద్రి’ ఖర్చు
‘‘యాదాద్రి పవర్ ప్రాజెక్టును బొగ్గు దొరికే స్థలానికి 360 కిలోమీటర్ల దూరాన ఏర్పాటుచేశారు. దానివల్ల బొగ్గు రవాణా ఖర్చు విపరీతంగా పెరిగింది. ఎవరో సవాల్ చేయడంతో 2022 సెప్టెంబరు 30న ఎన్జీటీ దాని పర్యావరణ అనుమతులను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఏడాది పాటు అధికారంలోనే కొనసాగిన కేసీఆర్ అనుమతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. దానివల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి ఖర్చు తడిసి మోపెడైంది. మేము ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి ఆ నివేదికను మరోసారి పర్యావరణ అనుమతుల కోసం పంపాం. పర్యావరణశాఖ ఈ నెల 5న పరిశీలన చేపట్టనుంది.
ఎన్టీపీసీతో నాడు పీపీఏ ఎందుకు కుదుర్చుకోలేదు?
విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంలో ఇంకా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. పదేళ్లు పాలన చేసిన వ్యక్తి ఎన్టీపీసీతో పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) చేసుకొని ఆ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని వెనుక ఉన్న కుట్ర ఏంటో ప్రజలకు తెలియాలి. ఆయన ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకొని ఉంటే కాలం చెల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పెట్టే పరిస్థితి ఉండేదికాదు. ఎన్టీపీసీ ఉండగా ఇదెందుకు అని ఎవరైనా అడుగుతారేమోనన్న అనుమానంతో దానితో ఒప్పందం చేసుకోకుండా పక్కనపడేశారు. ఇప్పుడు ఎన్టీపీసీ ఉత్పత్తి ప్రారంభించడానికి మరో ఐదేళ్లు పడుతుంది. ఇప్పుడున్న ధరల ప్రకారం లెక్కేస్తే కరెంట్ యూనిట్ ధర రూ.8 నుంచి రూ.9 వరకు ఉంటుంది. ఇదే సమయంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సోలార్ విద్యుత్ను రాబోయే 25 ఏళ్ల కాలానికి యూనిట్ రూ.5.59కే ఇవ్వడానికి ముందుకొచ్చింది. చౌకగా దొరికే ఈ విద్యుత్ను ప్రజలకు ఇవ్వాలా? లేదంటే రూ.8-9 భారం పడే ఎన్టీపీసీ విద్యుత్ను ఇవ్వాలా అన్నదానికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ.1,10,690 కోట్ల బాకీలు పెట్టి విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిన ఆయన ఇప్పుడు ఎన్టీపీసీతో పీపీఏలు ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది.
గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ విద్యుత్ అందించాం
మేం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కేసీఆర్ హయాంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ కరెంటు ఇచ్చాం. మార్చిలో 15,623 మెగావాట్ల పీక్ డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాచేశాం. గతంలో ఎన్నడూ ఇంత డిమాండ్ రాలేదు. వాస్తవాలు ఇలా ఉన్నా కేసీఆర్ ఆడిపోసుకున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. ఆయన రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని ఆగం చేశారు. అయినా మేం పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కల్పించాం.
భారాసలో ఉన్న కొద్దిమందిని కాపాడుకొనేందుకు ఆపసోపాలు
అంతా తాను చెప్పినట్లే వింటారు, తాను గీసిన గీతను దాటరు అనుకున్న నాయకులు భారాసని వదిలి కాంగ్రెస్లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్న కొద్దిమందిని కాపాడుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు’’ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్