సంక్షిప్త వార్తలు(6)
తెలంగాణ ప్రజా పార్టీ (టీపీపీ)కి చెందిన పలువురు ఆఫీస్ బేరర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జి.చిన్నారెడ్డి సోమవారం గాంధీభవన్లో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీపీపీకి చెందిన పలువురు కాంగ్రెస్లో చేరిక
హైదరాబాద్, న్యూస్టుడే: తెలంగాణ ప్రజా పార్టీ (టీపీపీ)కి చెందిన పలువురు ఆఫీస్ బేరర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జి.చిన్నారెడ్డి సోమవారం గాంధీభవన్లో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన వారిలో క్రిష్ణారావు, అబ్దుల్ సత్తార్ ఖాన్, శివరామిరెడ్డి, తదితరులున్నారు.
ఆర్ఎల్డీకి సిద్దిఖీ గుడ్బై
దిల్లీ: భాజపాతో జట్టు కట్టిన రాష్ట్రీయ లోక్దళ్కు (ఆర్ఎల్డీ) షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, కీలక నేత షాహిద్ సిద్దిఖీ రాజీనామా చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో భాజపాతో ఆర్ఎల్డీ పొత్తు పెట్టుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్న సమయంలో నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి పార్టీకి రాజీనామా చేశానని సిద్దిఖీ తెలిపారు. ఆదివారం రాజీనామాను అధ్యక్షుడు జయంత్ సింగ్కు పంపినట్లు వెల్లడించారు.
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబానికి అసదుద్దీన్ ఒవైసీ పరామర్శ
లఖ్నవూ: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ ఇటీవల గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం తెలిపారు. ఆయన ఆదివారం అర్ధరాత్రి గాజీపుర్లో ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ.. ‘చీకటి చివర్లో వెలుగు ఉంటుంది’ అని పేర్కొన్నారు. అప్నాదళ్(కమెరావాదీ) ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి విడిపోయి ఎంఐఎంతో కలిసి ‘పీడీఎం న్యాయ మోర్చా’ పేరిట ఉమ్మడి వేదికను ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ ఆదివారం లఖ్నవూలో పర్యటించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, ముస్లింలకు న్యాయం చేసేందుకు ఆ పార్టీలు దీన్ని ఏర్పాటు చేశాయి.
జగన్రెడ్డే అసలైన పెత్తందారు: లోకేశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: పేదోళ్ల పింఛన్ ఆపి.. పెద్దోళ్లకు కాంట్రాక్టు బిల్లులు కట్టబెట్టిన వ్యక్తే అసలైన పెత్తందారు సీఎం జగన్రెడ్డి అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘అవ్వా తాతలకు అన్యాయం. దివ్యాంగులకు దారుణ మోసం. వితంతువుల ఆసరాకు ఎసరు. రూ.వేల కోట్ల పింఛన్ల సొమ్ము సీఎం సొంత మనుషులకు ధారాదత్తం’ అంటూ ఎక్స్ వేదికగా సోమవారం లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ల పంపిణీలో వైకాపా అబద్ధాలు ప్రచారం చేస్తోంది
తెదేపా నేత కొల్లు రవీంద్ర ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: పింఛన్ల పంపిణీపై అవాస్తవాలే ఎజెండాగా పెట్టుకుని మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు వైకాపా నాయకులు పనికట్టుకుని రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వృద్ధులకు ప్రతినెలా 1నే అందాల్సిన పింఛన్ జాప్యం కావడానికి సీఎం జగన్రెడ్డే కారణమని సోమవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చే అవకాశమున్నా రాజకీయ ప్రయోజనాల కోసం వయోవృద్ధులను వేధిస్తున్నారని, త్వరలో వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం 25వేల పాఠశాలల్ని మూసేసింది
మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం జీవో-117 తెచ్చి 25వేల పాఠశాలలను మూసేసి, 50వేల ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసిందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ధ్వజమెత్తారు. 1.70లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేసిన చరిత్ర తెదేపాదైతే.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తానన్న హామీని తుంగలో తొక్కి ఒక్క పోస్టునూ భర్తీచేయని వ్యక్తి జగన్రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య లాంటి పథకాల్ని రద్దుచేసింది. విద్యాహక్కు చట్టానికి తిలోదకాలిస్తూ.. మాతృభాషలో బోధనను దూరం చేసింది’ అని రామకృష్ణ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.