ఖమ్మంపై పీటముడి!
ఖమ్మం లోక్సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
రాహుల్తో చర్చించాకే ఖరారయ్యే అవకాశం
అక్కడి అభ్యర్థిని బట్టి.. కరీంనగర్పై నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ఖమ్మం లోక్సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కొందరు, ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాకుండా వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఐదారు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంతో ఆయనతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల విషయమై దాదాపు నిర్ణయానికి వచ్చినా.. ఖమ్మం అభ్యర్థి ఎంపిక ప్రభావం కరీంనగర్ అభ్యర్థిపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు పార్టీ జిల్లా అధ్యక్షుడు షమీర్ ఉల్లా పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కరీంనగర్ స్థానానికి పలువురు పోటీ పడినా మొదటి నుంచీ రేసులో ఉన్న ప్రవీణ్రెడ్డి, వెలిచాల రాజేందర్రావుల పేర్లే తుది పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ సీటును పొన్నం ప్రభాకర్కు ఇచ్చినప్పుడు ప్రవీణ్రెడ్డికి ఎంపీగా పోటీకి అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆయన పేరునే ఖరారు చేసినా, ఖమ్మం అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని కరీంనగర్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ముఖ్యుల కుటుంబానికా? ఇతరులకా?
ఖమ్మం లోక్సభ సీటుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్తో పాటు పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ తదితరులు పోటీపడ్డారు. ప్రభుత్వంలోని ముఖ్యుల కుటుంబ సభ్యులను మినహాయిస్తే బాగుంటుందనే చర్చ నేపథ్యంలో మాజీ ఎంపీ సురేందర్రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొదటి నుంచీ కాంగ్రెస్లో ఉండి రాజకీయంగా గుర్తింపు పొందిన కుటుంబం కావడంతో ఈయన పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు రాష్ట్రంలోని ముఖ్యనేత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంగులేటికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గురించి సోమవారం నాటి సీఈసీ సమావేశంలో కమిటీ ఛైర్మన్ హరీష్ చౌధరి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పొంగులేటి పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీట్లు ఇవ్వలేకపోయామని, ఆయన రావడం వల్లే మరికొందరు కూడా పార్టీలో చేరారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. నందిని, ప్రసాదరెడ్డిల అభ్యర్థిత్వాల విషయమై కూలంకషంగా చర్చించినా.. రాహుల్గాంధీతో చర్చించిన తర్వాత ఖరారు చేయాలని నిర్ణయించారు. ముఖ్యనేతల కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వారికి ఇవ్వాలనుకుంటే రఘురామిరెడ్డి పేరే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని, మరో సామాజికవర్గానికి సీటు కేటాయించే అవకాశమూ లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
ఆ రెండింటితో పాటే హైదరాబాద్ అభ్యర్థి ప్రకటన
కరీంనగర్ లోక్సభకు ప్రవీణ్రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినా ఖమ్మం పీటముడి వీడే వరకు ప్రకటించే అవకాశం లేదని తెలిసింది. ఖమ్మంలో ప్రసాద్రెడ్డి లేదా రఘురామిరెడ్డికి ఇస్తే కరీంనగర్ అభ్యర్థి ఎంపికపై మళ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ అభ్యర్థిని కూడా ఆ రెండు స్థానాలతో పాటే ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ నెల ఆరున తుక్కుగూడ బహిరంగసభలో పాల్గొనడానికి రాహుల్గాంధీ రానున్నందున ఆ రోజు ఖమ్మం అభ్యర్థిత్వంపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్