వరుణ్‌ భవిత ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం: మేనకాగాంధీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీకి భాజపా ఈసారి టికెట్టు నిరాకరించడంపై ఆయన తల్లి, సుల్తాన్‌పుర్‌ ఎంపీ మేనకాగాంధీ తొలిసారి స్పందించారు.

Published : 03 Apr 2024 04:26 IST

సుల్తాన్‌పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీకి భాజపా ఈసారి టికెట్టు నిరాకరించడంపై ఆయన తల్లి, సుల్తాన్‌పుర్‌ ఎంపీ మేనకాగాంధీ తొలిసారి స్పందించారు. వరుణ్‌ రాజకీయ భవిష్యత్తు ఏమిటని మీడియా ప్రశ్నించగా..‘‘ఆ విషయం వరుణ్‌గాంధీనే అడగండి. లోక్‌సభ ఎన్నికల తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా సమయం ఉంది’’ అని తెలిపారు. భాజపా ఎంపీగా ఉంటూ పదే పదే పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంగా వరుణ్‌గాంధీకి పీలీభీత్‌ టికెట్టును కమలదళం ఈసారి నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ మేనకాగాంధీ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. భాజపా తనకు మళ్లీ సుల్తాన్‌పుర్‌ (యూపీ) టికెట్టు కేటాయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకాగాంధీ సోమవారం సుల్తాన్‌పుర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను భాజపాలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. మళ్లీ టికెట్టు ప్రకటించాక మేనక సుల్తాన్‌పుర్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని