వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది
చిన్నాన్న వివేకాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను రంగంలోకి దిగుతున్నా.
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం
వివేకా హత్య కేసు నిందితుడికి జగనన్న అండ
నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశారు
చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ: వైఎస్ షర్మిల
చిన్నాన్న వివేకాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను రంగంలోకి దిగుతున్నా. రాజశేఖరరెడ్డి బిడ్డగా కడప ప్రజల ముందుకొస్తున్నా..చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలో దిగుతున్నా...
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు
ఈనాడు, కడప, న్యూస్టుడే, వేంపల్లె, పులివెందుల: ‘వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. అధికారాన్ని వాడుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. అవినాష్రెడ్డిని ఈ విషయంలో వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్సభ టికెట్ ఇవ్వడం ఎలాంటి సంకేతాలిస్తుంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన అవినాష్రెడ్డి పార్లమెంటు మెట్లు ఎక్కకూడదన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న బిడ్డగా కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మంగళవారం తల్లి విజయమ్మ, కుమార్తె అంజలిరెడ్డితో కలిసి ఆమె తన తండ్రి రాజశేఖరరెడ్డి ఘాట్ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే లోక్సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను వైయస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ తులసిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కడప లోక్సభ అభ్యర్థిగా రాజశేఖరరెడ్డి బిడ్డ పోటీ పడుతోందని, ఈ నిర్ణయం అంతా సులువైనది కాదని, ఇది తన కుటుంబాన్ని చీల్చడమే కాకుండా రాజన్న అభిమానులను గందరగోళంలో పడేస్తోందనే విషయం తెలుసునని వివరించారు. తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు.. నా బిడ్డ అన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎంతో తనకు ఎలాంటి పరిచయమూ లేదని ఎద్దేవా చేశారు. వివేకాను దారుణంగా హత్య చేస్తే గుండెపోటుగా చిత్రీకరించి సాక్షి ఛానల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేశారన్నారు. ఈ హత్యను రాజకీయం కోసం వాడుకున్నట్లుగా ఆలస్యంగా అర్థమైందన్నారు. వివేకాను హత్య చేసిన వారికే ఎంపీ సీటు ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసి కూడా అహంకారంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంపై ధ్వజమెత్తారు. సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న బిడ్డగా తాను ఏం చేయాలో ఆలోచించానని, హత్యా రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తనను ఎంపీగా వివేకా ఎందుకు చూడాలనుకున్నారో అప్పట్లో అర్థం కాలేదని, సంఘటన జరిగిన అనంతరం ఇప్పుడు అర్థమైందన్నారు. తన చిన్నాన్న వివేకాను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కంటతడి పెట్టారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని షర్మిల అన్నారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారని, ఎదిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారన్నారు. ఆయన బతికి ఉంటే రాహుల్గాంధీని ప్రధానిగా చేసి తన కలను సాకారం చేసుకునేవారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.