చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు జగన్కే ఎందుకు?
చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు సీఎం జగన్ ఒక్కరికే ఉన్నాయా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఇది న్యాయస్థానాల్ని మేనేజ్ చేయడం కాదా?
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు సీఎం జగన్ ఒక్కరికే ఉన్నాయా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. 12 ఏళ్లుగా కోర్టు విచారణకు హాజరుకాకపోవడం న్యాయస్థానాల్ని మేనేజ్ చేయడం కాదా అని విమర్శించారు. ఎదుటివారిని దొంగలు, ఆర్థిక నేరగాళ్లు, విద్రోహశక్తులని విమర్శించే జగన్.. ఈ లక్షణాలన్నీ తనవేనని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘హెటిరో, అరబిందో కంపెనీలకు తెలంగాణలోని జడ్చర్లలో ఎకరం రూ.7 లక్షల చొప్పున 250 ఎకరాల్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. ప్రతిగా వారు రూ.29.5 కోట్లను జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. విశాఖలో రాంకీకి భూముల కేటాయింపుతో జగతి పబ్లికేషన్స్కు రూ.10 కోట్లు అందాయి. ఇలా జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ 11, ఈడీ 5 ఛార్జిషీట్లు వేసింది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిన వారిని శిక్షించకపోతే మొత్తం వ్యవస్థే నాశనమైపోతుందని జగన్ కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తుచేశారు.
పెగాసెస్తో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు
పెగాసెస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) ముకేశ్కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్వేర్తో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ రామాంజనేయులు ట్యాపింగ్కు పాల్పడుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అనర్హత వేటు వేయడానికి అన్ని అర్హతలున్నా వీరిద్దరిపై ఈసీ చర్యలు తీసుకోలేదు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్లు ఏం మాట్లాతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో వినే పనిలోనే వీరున్నారు. డీజీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెగాసెస్ వాడటం లేదని బహిరంగ ప్రకటన చేయాలి. ఇలాగే తెలంగాణలో ట్యాపింగ్కు పాల్పడిన అధికారులు కటకటాల పాలయ్యారు’ అని హెచ్చరించారు. ‘వైకాపాకు అనుకూలంగా వ్యవహరించిన పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మోదీ సభకు అన్ని విధాల ఆటంకం కల్గించిన ఐజీ పాలరాజును పక్కన పెట్టింది. చట్టాన్ని దాటి వ్యవహరించే అధికారులకు ఇదే గతి పడుతుంది’ అని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెదేపా బ్రాహ్మణ సాధికార సాధన కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నియామకం నిబంధనల ఉల్లంఘనే
విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మల్లికార్జునను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన సహాధ్యాయి అని, గతంలో సీఎం జగన్కు సంబంధించిన కేసుల్ని ఆయనే చూసేవారని తెలిపారు. మల్లికార్జున నియామకంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వర్ల రామయ్య లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్