సంక్షిప్తవార్తలు(15)
త్వరలో తాను భాజపాలో చేరనున్నట్లు కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలత అంబరీశ్ (స్వతంత్ర) ప్రకటించారు.
భాజపాలోకి సుమలత
ఈనాడు, బెంగళూరు: త్వరలో తాను భాజపాలో చేరనున్నట్లు కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలత అంబరీశ్ (స్వతంత్ర) ప్రకటించారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమె ఏడాది కిందటే భాజపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ఆ పార్టీ నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నించారు. భాజపా, జేడీఎస్ పొత్తు నేపథ్యంలో మండ్య స్థానాన్ని దళ్కు కేటాయించడంతో కంగుతిన్న సుమలత ప్రధాని ఫోనుతో మెత్తబడ్డారు. బుధవారం మండ్యలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏ అభ్యర్థి కుమారస్వామికి మద్దతిచ్చేందుకు నిర్ణయించినట్లు సుమలత ప్రకటించారు.
కమల దళంలోకి బాక్సర్ విజేందర్ సింగ్
దిల్లీ: లోక్సభ ఎన్నికల తరుణంలో ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్కు షాకిచ్చారు. ఆయన హస్తం పార్టీని వీడి భాజపా గూటికి చేరారు. దిల్లీలో బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బాక్సింగ్లో భారత్ తరఫున తొలి ఒలింపిక్ పతకం సాధించిన విజేందర్.. 2019లో కాంగ్రెస్లో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రమేశ్ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు.
లోక్సభ ఎన్నికలకు ఫరూఖ్ అబ్దుల్లా దూరం
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు, శ్రీనగర్ సిట్టింగ్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా అనారోగ్యం కారణంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమంలో ఫరూఖ్ కుమారుడు, ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ మేరకు ప్రకటించారు.
హామీలపై ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారు: బక్క జడ్సన్
ఖైరతాబాద్, న్యూస్టుడే: అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించిన పలు హామీల గురించి ప్రశ్నించినందుకే తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారని బక్క జడ్సన్ ఆరోపించారు. విధివిధానాలు సరిగాలేకుండా తనను పార్టీ నుంచి చిన్నారెడ్డి తప్పించారని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూలాలను, సిద్ధాంతాలను చెరిపేస్తున్నారని, లౌకిక భావాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. తనను కక్షతోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. ఇకపై తెలంగాణ వనరుల రక్షణ సమితి పేరుతో తన కార్యాచరణను కొనసాగిస్తానని ప్రకటించారు.
జమ్ములో పీడీపీ, ఎన్సీలు విడివిడిగా పోటీ
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్లో విపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వామ్య పార్టీలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)లు లోక్సభ ఎన్నికల్లో 3 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయనున్నాయి. తమను సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారని, కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాలకు పోటీచేయడం తప్ప తమ దగ్గర ఇంకో మార్గం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరం: కోదండరెడ్డి
హైదరాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని..ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు కాంగ్రెస్సే కారణమని ఎండిన పంటలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నకిలీ విత్తనాల కుంభకోణం జరిగి వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నాలుగు నెలల్లో 63 మంది రైతు ఆత్మహత్యలు జరిగాయి. అందులో వేర్వేరు కారణాలతో చనిపోయినవారు సగం మంది ఉన్నారు. రైతుల మీద ప్రేముంటే ఖమ్మంలో రైతులకు భేడీలు ఎందుకు వేయించారు?’’ అని కోదండరెడ్డి మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: లక్ష్మణ్
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్, భారాసలు డ్రామాలు ఆడుతున్నాయని దీనిపై ప్రజలకు నమ్మకం లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ ఫోన్ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించకుంటే గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సీబీఐ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటికి వస్తారన్నారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు భాజపా గెలుస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్లో సంజయ్ నిరుపమ్పై ఆరేళ్ల బహిష్కరణ వేటు
దిల్లీ: మహారాష్ట్రలో తమ పార్టీ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్పై కాంగ్రెస్ కొరడా ఝళిపించింది. ఆరేళ్లపాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించడం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేయడమే ఇందుకు కారణమని బుధవారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. సంజయ్ని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించినట్లు వెల్లడించింది. మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ)లో భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన (యూబీటీ)ను లక్ష్యంగా చేసుకొని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడం గమనార్హం.
5 నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
ఈనాడు, అమరావతి: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 5 (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైయస్ఆర్ జిల్లా కాసినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర చేపడతారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించారు.
వైకాపాకు శవ రాజకీయాలు అలవాటే: బుద్ధా వెంకన్న
తాడేపల్లి, న్యూస్టుడే: ఎన్నికల ముందు శవ రాజకీయాలు వైకాపాకు అలవాటేనని తెదేపా నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పెనమలూరులో వృద్ధురాలు మృతి నేపథ్యంలో చంద్రబాబు ఇంటి ముట్టడికి మంత్రి జోగి రమేష్ పిలుపునివ్వడంతో బుద్ధా వెంకన్న, మంగళగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ‘తలా తోక లేకుండా జోగి రమేశ్ మాట్లాడితే పరిగెత్తించి కొడతాం. చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి యత్నించి మంత్రి పదవి పొందారు. మళ్లీ అలాంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇలాంటివి సాగనివ్వం. పింఛన్లు వైకాపానే ఆపి, ఆ నెపాన్ని చంద్రబాబుపై వేస్తున్నారు’ అని మండిపడ్డారు.
వాలంటీర్లు రాజీనామా చేయాలని వైకాపా పెద్దల ఒత్తిళ్లు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: వాలంటీరు బాధ్యతల నుంచి ఇప్పుడు తప్పుకుంటే మూడు నెలల వేతనం రూ.15వేలు, ఎన్నికల్లో పనిచేసేందుకు మరో రూ.15 వేలు కలిపి రూ.30వేలు ఇస్తామని.. దీనికి అంగీకరించకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని వైకాపా పెద్దలు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో ఇప్పటికే వారితో రెండుమూడు చోట్ల సమావేశాలు నిర్వహించారు. మొదట్లో రాజీనామాలు చేయడానికి వారు నిరాకరించారు. ప్రలోభాలు ఎర చూపి, తొలగిస్తామని భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం 185 మంది వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి: సీపీఎం
ఈనాడు, అమరావతి: వృద్ధులకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయించకుండా.. వారిని గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు రప్పించే ప్రభుత్వ అసమర్థ చర్యను సీపీఎం తీవ్రంగా ఖండించింది. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలోని నెరబైలు సచివాలయం వద్ద షేక్ అసమ్ నన్నే సాహెబ్ అనే వృద్ధుడు మరణించడంపై విచారం వ్యక్తం చేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారంగా చెల్లించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం కార్యకర్తలు పింఛన్దారులకు మద్దతుగా నిలిచి, ఇళ్ల వద్దే సకాలంలో పింఛన్లు ఇవ్వాలని కోరుతూ ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మూడో తేదీ వచ్చినా పింఛన్లు పంపిణీ చేయకుండా వృద్ధులు, వికలాంగులు, మహిళల్ని ఎండలో తిప్పడం భావ్యం కాదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సచివాలయాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ సమరంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు సమిధలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈసీ ఆదేశాలు బేఖాతరు
వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మండుటెండలో బుధవారం సచివాలయాలకు వచ్చినా పింఛన్ సొమ్ము జమ కాలేదంటూ పలువురు సిబ్బంది వృద్ధులను వెనక్కు పంపడమేంటి? సకాలంలో పింఛన్ ఇవ్వకపోవడం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేయడమే. పింఛన్ సొమ్ము సచివాలయాల ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. లబ్ధిదారులందరినీ సచివాలయాలకు వచ్చి పింఛన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గం’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం లేఖ రాశారు.
అప్పులతో ఆర్థిక సంవత్సరానికి స్వాగతమా?
జగన్ సర్కారు తీరుపై సీపీఐ విమర్శ
ఈనాడు, అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే జగన్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణం తీసుకుని, అప్పులతో ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘జగన్ సర్కారు రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కూడా అప్పులు వెతుకుతున్న దుస్థితి నెలకొంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. వారిని విస్మరించి అస్మదీయులకు చెల్లించింది. ఎన్నికల కోడ్ తరువాత చేసిన రూ.14,500 కోట్ల చెల్లింపులపై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
దళితుడి శిరోముండనం కేసులో వాదనలు పూర్తి
విశాఖ లీగల్, న్యూస్టుడే: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళితుడి శిరోముండనం కేసులో తుది వాదనలు బుధవారంతో ముగిశాయి. ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర నిందితులు విశాఖ జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున కె.వి. రామమూర్తి వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు ఇవ్వడానికి గాను న్యాయమూర్తి లాలం శ్రీధర్ ఈ కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. 1996 డిసెంబరు 29న శిరోముండనం ఘటన జరగ్గా, బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు తోట త్రిమూర్తులుపై 1997 జనవరి 4న కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు 28ఏళ్ల తర్వాత తీర్పు వెలువడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం