ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
అడ్డగోలుగా మాట్లాడితే సీఎంనూ వదిలిపెట్టను
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కేకే మహేందర్రెడ్డిలకు లీగల్ నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటి పనిచేయాల్సిన అవసరం నాకేంటి? ఇలాగే అడ్డగోలు ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి సహా ఎవర్నీ వదిలిపెట్టను. న్యాయపరంగా ఎదుర్కొంటాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే.. మారింది ప్రభుత్వమే తప్ప అధికారులు కాదు. ఆనాడు కీలక పోస్టుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు శివధర్రెడ్డి, మహేందర్రెడ్డి, రవి గుప్తా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టుల్లో ఉన్నారు. అప్పుడు ట్యాపింగ్ జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఈ అధికారులు ఎవరూ బాధ్యులు కారా? చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్లో ఉందని.. అప్పట్లోనే ప్రజలతో పంచుకున్నాను. ఎవరి ఫోన్లు ట్రాప్ అయ్యాయి.. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి. ఫోన్ ట్యాపింగ్పై కాదు.. తాగు, సాగునీటిపై దృష్టి పెట్టండి’’ అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో భారాస ఎమ్మెల్యేలు గోపీనాథ్, తలసాని శ్రీనివాస్యాదవ్, వివేకానంద, పార్టీ నాయకుడు కార్తీక్రెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నిర్వహించే తెలివి లేదు
‘‘కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది. మహిళలు రోడ్లపై ఖాళీ బిందెలతో తల్లడిల్లుతోంటే.. రేవంత్రెడ్డి లంకెబిందెల గురించి మాట్లాడుతున్నారు. దిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. గతంలో మేము ప్రజల అవసరాలు ఎలా తీర్చాలని ఆలోచిస్తే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం చేరికలపై దృష్టి పెట్టింది. మా ప్రభుత్వ హయాంలో మంచినీటి సదుపాయం పొందడాన్ని మానవ హక్కుగా గుర్తించి.. రూ.38 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం. కనీసం దాని నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. గతంలో కంటే 14 శాతం అధికంగా వర్షం కురిసినా.. తాగునీటి కొరత ఎందుకు వచ్చింది? ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయి. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి రాష్ట్ర ప్రజలకు తాగునీరు తీసుకోవాలంటే దిల్లీని యాచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా ప్రభుత్వం డిజైన్ చేసిన సుంకిశాల ప్రాజెక్టు 75 శాతం పూర్తయింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో పూర్తి కాలేదు. కేసీఆర్పై రాజకీయ కక్షతో.. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే.. మళ్లీ పంప్హౌస్లు ఎట్లా ప్రారంభమయ్యాయి? ఈ మూణ్నెల్లలో మేడిగడ్డకు మరమ్మతులు చేసి, పంపులు ఆన్ చేసి ఉంటే.. ఒక్క ఎకరం పంట కూడా ఎండకపోయేది. రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్రెడ్డికి నేరుగా పంపిస్తాం. వెంటనే రైతు రుణమాఫీ చేయాలి. ఓ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు ఇచ్చాం. ఆదివారం వరకు గడువు ఇచ్చాం. ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ కేటీఆర్ పేర్కొన్నారు.
వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావించారని, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారని పేర్కొంటూ.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డిలకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు తన పేరును పదే పదే కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నందున చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి