బెంగాల్లో ‘జూట్’ తంత్రం
పశ్చిమ బెంగాల్లో జూట్ పరిశ్రమకు ఎనలేని ప్రాధాన్యముంది. ఇక్కడి పరిశ్రమల్లో 2.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.
కార్మికులు, రైతులను ఆకట్టుకునేందుకు తృణమూల్, భాజపా యత్నం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జూట్ పరిశ్రమకు ఎనలేని ప్రాధాన్యముంది. ఇక్కడి పరిశ్రమల్లో 2.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ముడి సరకు ఉత్పత్తిపై 40లక్షల మంది రైతులు ఆధారపడ్డారు. హుగ్లీ, ఉత్తర 24 పరగణాలు, హావ్డా జిల్లాల్లోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. జూట్ కార్మికులు, రైతులను ఆకట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే మొగ్గు తృణమూల్వైపే ఉన్నట్లు తెలుస్తోంది. తాము మమతకే మద్దతు తెలుపుతామని కార్మికుల్లో ఎక్కువ మంది చెబుతున్నారు. 2019లో జూట్ మిల్లులున్న ప్రాంతాలైన బౌరక్పుర్, హుగ్లీల్లో భాజపా గెలిచింది. జూట్ సాగు చేసే ప్రాంతాల్లో తృణమూల్ ఆధిక్యం సాధించింది.
సమస్యలు
- ప్రస్తుతం జూట్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. దేశవ్యాప్త డిమాండ్ అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తిని అవి ఇప్పటికే 10శాతం నుంచి 15శాతం తగ్గించాయి. ఇది 20శాతం నుంచి 25శాతానికీ తగ్గనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమలు వారంలో నాలుగైదు రోజులే పని చేస్తున్నాయి.
- రబీ సీజనులో 3.5లక్షల బేళ్ల జూట్ బ్యాగుల సేకరణను ప్రభుత్వం తగ్గించింది.
- ప్రభుత్వం నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని జూట్ మిల్లులు మూతపడుతున్నాయి. హుగ్లీలోని శ్యాంనుగ్గుర్ జూట్ ఫ్యాక్టరీ ఇటీవలే పనులను ఆపేసింది. వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
- ఉపాధి కోల్పోయిన కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. మళ్లీ వ్యవసాయం బాట పడుతున్నారు.
భాజపా
- జూట్ ముడి సరకుకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెంచింది. దీంతోపాటు జూట్ పరిశ్రమ నుంచి నిరసనల నేపథ్యంలో ఆహార పదార్థాలకు 100శాతం జూట్ బ్యాగులను వాడాలన్న నిబంధనను సరళీకరిస్తామన్న ప్రతిపాదన నుంచి వెనక్కితగ్గింది.
- సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఐదేళ్ల పునరుద్ధరణ రోడ్డు మ్యాప్ను రూపొందించింది. అయితే ఇప్పటికే మిల్లుల్లో సంక్షోభం, కార్మికుల ఉద్వాసనతో భాజపాకు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి.
- అయితే బౌరక్పుర్ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి అర్జున్ సింగ్ మాత్రం మిల్లుల యజమానులదే తప్పని అంటున్నారు. వారు స్థానికంగా కాకుండా బంగ్లాదేశ్ నుంచి ముడి సరకును తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో గెలిచిన ఆయన తృణమూల్లోకి వెళ్లారు. మళ్లీ నెల కిందట భాజపాలోకి వచ్చి పోటీ చేస్తున్నారు.
- చాలా మంది జూట్ మిల్లుల కార్మికులు భాజపాకే మద్దతిస్తున్నారని భారతీయ మజ్దూర్ సంఘ్ నేత బినోద్ సింగ్ తెలిపారు. తమ సమస్యలను ఎన్డీయే ప్రభుత్వమే పరిష్కరిస్తుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. కేంద్రం 5.58లక్షల బేళ్ల జూట్ సంచులకు ఆర్డర్ ఇచ్చిందని, మిల్లులు కావాలనే ఉత్పత్తిని తగ్గించి 4.85 లక్షల బేళ్లనే ఇస్తామని అంటున్నాయని ఆరోపించారు.
తృణమూల్
- బెంగాల్ ప్రభుత్వం గత జనవరిలో జూట్ మిల్లుల్లో వేతన సవరణను పూర్తి చేసింది. వారి వేతనాలు 30శాతం వరకూ పెరిగాయి.
- జూట్ ఉత్పత్తి చేసే రైతులకు పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు