అసలు పోరు ఆ దిగ్గజాల మధ్యే!
లోక్సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి.
కన్నడనాట రాజకీయ కోలాటం
లోక్సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి. భాజపా, కాంగ్రెస్, జనతాదళ్కు చెందిన నలుగురు సీనియర్ నేతలు వచ్చే లోక్సభ ఎన్నికల సమయానికి వయసు రీత్యా కీలక పాత్ర పోషించే అవకాశాలు దాదాపు లేవు. వీరిలో కొందరు మరో ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని ప్రకటించగా, కొందరు ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీనియర్లు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయా పార్టీల ఎన్నికల వ్యూహాలకు వీరే రూపకర్తలు. పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధివిధానాలన్నీ వీరి కనసన్నల్లోనే రూపుదాల్చుతున్నాయి. జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలకు వీరే బాధ్యులు కానున్నారు.
ఈనాడు, బెంగళూరు
పొత్తుల పెద్దన్న
సరిగ్గా ఏడాది కిందట నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కనీసం 25 స్థానాలైనా గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఆశించిన దళ్కు నిరాశే మిగిలింది. ఈ ఫలితాల తర్వాత ఏకైక ప్రాంతీయ పార్టీ పని అయిపోయిందనే అందరూ భావించారు. కానీ ఏడాది తర్వాత నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల సమయంలోనూ జేడీఎస్ కార్యాలయం కళకళలాడుతోందంటే అందుకు కారణం ఆ పార్టీ అధినేత హెచ్.డి.దేవేగౌడ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పతనావస్థలో ఉన్న పార్టీని నిలబెట్టేందుకు జాతీయ పార్టీతో పొత్తు అనివార్యమని భావించి తానే స్వయంగా రంగంలో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో నేరుగా మంతనాలు జరిపారు. అందులో భాగంగా బెంగళూరు నుంచి దిల్లీలోని భాజపా కార్యాలయానికి దేవేగౌడ వేసిన మైత్రి మార్గంలో కుమారుడు కుమారస్వామి, మనవళ్లు నిఖిల్ గౌడ స్వేచ్ఛగా వెళ్లి వస్తూ పొత్తు కార్యాన్ని విజయవంతం చేసుకున్నారు. జీవితమంతా మతతత్వ పార్టీ భాజపాను విమర్శిస్తూ వచ్చిన దేవేగౌడ రాజకీయ చరమాంకంలో పార్టీని బతికించుకునేందుకు తన భావజాలాన్ని పక్కనబెట్టారు. ప్రస్తుతం 91 ఏళ్లున్న హెచ్.డి.దేవేగౌడ వచ్చే ఎన్నికల సమయానికి ఇంత చురుకుగా పని చేయటం కుదరని పని.
అప్ప.. చెప్పినట్లే
2023 అసెంబ్లీ ఎన్నికలో భాజపా కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో 35 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ అంతటి వైఫల్యానికి కారణాలను వెతికిన భాజపా అధిష్ఠానానికి ‘యడియూరప్ప’ క్రియాశీలంగా లేకపోవడం ఓ కారణంగా కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ కారణం వల్లనే భాజపా ఓటమి చెందినట్లు భావించిన అధిష్ఠానం ఈ ఎన్నికల సమయానికి యడియూరప్పకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఆయన కుమారుడు బి.వై.విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడంతో యడియూరప్ప ఉత్సాహం రెట్టింపైంది. జేడీఎస్తో పొత్తు విషయంలోనూ యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం భాజపా పోటీలో దింపిన 25 మంది అభ్యర్థుల్లో 20 మంది అభ్యర్థులు యడియూరప్ప సూచించిన వారే కావడం గమనార్హం. తనను పదేపదే విమర్శించే వారికి టికెట్లు రాకుండా చేయడంలో యడియూరప్ప వెనుకాడలేదు. డి.వి.సదానందగౌడ, కేఎస్.ఈశ్వరప్ప (ఈయన కుమారుడికి టికెట్ ఇవ్వలేదు), ప్రతాప్ సింహ, బసవనగౌడ యత్నాళ్.. వీరంతా యడియూరప్ప వ్యూహానికి బలైనవారే. తన కుమారుడు రాఘవేంద్ర, సన్నిహితురాలు శోభా కరంద్లాజె, హితుడు వి.సోమణ్ణ తదితరులకు తీవ్ర వ్యతిరేకతల మధ్యలోనూ టికెట్ దక్కేలా చేసుకున్నారు. నేడు రాష్ట్ర వ్యవహారాల్లో అధిష్ఠానం విశ్వసించే ఏకైక నేత యడియూరప్ప మాత్రమే. 81ఏళ్ల వయసులోనూ యడియూరప్ప పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.
నాయకత్వానికి పరీక్ష
ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న 77 ఏళ్ల సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. వయసు రీత్యా అప్పటికి 82 ఏళ్లలో చురుకుగా ఉండలేనని ఆయన భావన. తన రాజకీయ ప్రయాణంలో దాదాపు చివరి ఎన్నికలుగా భావించే ఈ లోక్సభ ఎన్నికలు సిద్ధరామయ్య నాయకత్వానికి పరీక్ష కానున్నాయి. విధానసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డీకే శివకుమార్ నుంచి సీఎం కుర్చీకి పోటీ ఎదుర్కొన్న సిద్ధరామయ్యకు ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 2019 ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 20 స్థానాల లక్ష్యంతో బరిలో దిగింది. ఇందులో కనీసం సగం స్థానాలు గెలిస్తేనే సిద్ధరామయ్య సీఎంగా కొనసాగగలరు. లేదంటే బాధ్యత వహిస్తూ అధికార పంపిణీకి సిద్ధం కావాలి. ఈ సున్నిత సూత్రాన్ని అంచనా వేసిన సిద్ధరామయ్య అభ్యర్థుల ఎంపికలో తన నిర్ణయానికి పెద్ద పీట వేయించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆరుగురు మంత్రుల పిల్లలకు టికెట్ దక్కాయంటే అది సిద్ధరామయ్య ప్రయత్న ఫలితమే. అహింద (బడుగు, బలహీన, మైనారిటీ) ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్కు దక్కేలా చేసేందుకు సిద్ధరామయ్య జిల్లా స్థాయిలో ఆ వర్గాల నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 28 స్థానాల్లో 20 జిల్లాలకు బాధ్యత వహించే మంత్రులంతా సిద్ధరామయ్య ఆప్తులుగా ఉన్నవారే.
ఖర్గే పోరు
జాతీయ నాయకుల కరిష్మా భాజపాకు ఉన్నంత స్థాయిలో కాంగ్రెస్కు లేదు. కర్ణాటకలో ఆ లోటును తీర్చగలిగే నేత మల్లికార్జున ఖర్గే ఒక్కరే. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న 82 ఏళ్ల వృద్ధ నేతకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. తన రాజకీయ జీవితంలో తొలి అపజయాన్ని అందించిన 2019 ఎన్నికలు ఆయనకు కొత్త పదవులు అందేలా చేశాయి. 2020 జూన్ 12న రాజ్యసభకు నామినేట్ అయిన ఖర్గే మరో నాలుగు నెలలకు ఏఐసీసీ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుత హోదా కారణంగా ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించడం ఖర్గేకు ఎంతో కీలకం. కర్ణాటక అంతటా కాకపోయినా ఉత్తర కర్ణాటకలో ఖర్గే ప్రభావం ప్రధాని మోదీతో పోటీ పడుతుంది. ఆ కారణంగానే ఈ ఎన్నికల్లో మోదీ తన తొలి కర్ణాటక ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచే ప్రారంభించడం గమనార్హం. 2019 వరకు తాను ప్రాతినిథ్యం వహించిన కలబురగి స్థానానికి అల్లుడు రాథాకృష్ణ దొడ్డమనిని పోటీలో దింపిన ఆయన ఈ ప్రాంతంలోని 14 స్థానాల్లో 12 మంది అభ్యర్థులను తన వ్యూహం ప్రకారం నిలబెట్టారు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 20 స్థానాల్లో గెలిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు