అసలు పోరు ఆ దిగ్గజాల మధ్యే!
లోక్సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి.
కన్నడనాట రాజకీయ కోలాటం
లోక్సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి. భాజపా, కాంగ్రెస్, జనతాదళ్కు చెందిన నలుగురు సీనియర్ నేతలు వచ్చే లోక్సభ ఎన్నికల సమయానికి వయసు రీత్యా కీలక పాత్ర పోషించే అవకాశాలు దాదాపు లేవు. వీరిలో కొందరు మరో ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని ప్రకటించగా, కొందరు ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీనియర్లు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయా పార్టీల ఎన్నికల వ్యూహాలకు వీరే రూపకర్తలు. పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధివిధానాలన్నీ వీరి కనసన్నల్లోనే రూపుదాల్చుతున్నాయి. జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలకు వీరే బాధ్యులు కానున్నారు.
ఈనాడు, బెంగళూరు
పొత్తుల పెద్దన్న
సరిగ్గా ఏడాది కిందట నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కనీసం 25 స్థానాలైనా గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఆశించిన దళ్కు నిరాశే మిగిలింది. ఈ ఫలితాల తర్వాత ఏకైక ప్రాంతీయ పార్టీ పని అయిపోయిందనే అందరూ భావించారు. కానీ ఏడాది తర్వాత నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల సమయంలోనూ జేడీఎస్ కార్యాలయం కళకళలాడుతోందంటే అందుకు కారణం ఆ పార్టీ అధినేత హెచ్.డి.దేవేగౌడ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పతనావస్థలో ఉన్న పార్టీని నిలబెట్టేందుకు జాతీయ పార్టీతో పొత్తు అనివార్యమని భావించి తానే స్వయంగా రంగంలో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో నేరుగా మంతనాలు జరిపారు. అందులో భాగంగా బెంగళూరు నుంచి దిల్లీలోని భాజపా కార్యాలయానికి దేవేగౌడ వేసిన మైత్రి మార్గంలో కుమారుడు కుమారస్వామి, మనవళ్లు నిఖిల్ గౌడ స్వేచ్ఛగా వెళ్లి వస్తూ పొత్తు కార్యాన్ని విజయవంతం చేసుకున్నారు. జీవితమంతా మతతత్వ పార్టీ భాజపాను విమర్శిస్తూ వచ్చిన దేవేగౌడ రాజకీయ చరమాంకంలో పార్టీని బతికించుకునేందుకు తన భావజాలాన్ని పక్కనబెట్టారు. ప్రస్తుతం 91 ఏళ్లున్న హెచ్.డి.దేవేగౌడ వచ్చే ఎన్నికల సమయానికి ఇంత చురుకుగా పని చేయటం కుదరని పని.
అప్ప.. చెప్పినట్లే
2023 అసెంబ్లీ ఎన్నికలో భాజపా కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో 35 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ అంతటి వైఫల్యానికి కారణాలను వెతికిన భాజపా అధిష్ఠానానికి ‘యడియూరప్ప’ క్రియాశీలంగా లేకపోవడం ఓ కారణంగా కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ కారణం వల్లనే భాజపా ఓటమి చెందినట్లు భావించిన అధిష్ఠానం ఈ ఎన్నికల సమయానికి యడియూరప్పకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఆయన కుమారుడు బి.వై.విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడంతో యడియూరప్ప ఉత్సాహం రెట్టింపైంది. జేడీఎస్తో పొత్తు విషయంలోనూ యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం భాజపా పోటీలో దింపిన 25 మంది అభ్యర్థుల్లో 20 మంది అభ్యర్థులు యడియూరప్ప సూచించిన వారే కావడం గమనార్హం. తనను పదేపదే విమర్శించే వారికి టికెట్లు రాకుండా చేయడంలో యడియూరప్ప వెనుకాడలేదు. డి.వి.సదానందగౌడ, కేఎస్.ఈశ్వరప్ప (ఈయన కుమారుడికి టికెట్ ఇవ్వలేదు), ప్రతాప్ సింహ, బసవనగౌడ యత్నాళ్.. వీరంతా యడియూరప్ప వ్యూహానికి బలైనవారే. తన కుమారుడు రాఘవేంద్ర, సన్నిహితురాలు శోభా కరంద్లాజె, హితుడు వి.సోమణ్ణ తదితరులకు తీవ్ర వ్యతిరేకతల మధ్యలోనూ టికెట్ దక్కేలా చేసుకున్నారు. నేడు రాష్ట్ర వ్యవహారాల్లో అధిష్ఠానం విశ్వసించే ఏకైక నేత యడియూరప్ప మాత్రమే. 81ఏళ్ల వయసులోనూ యడియూరప్ప పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.
నాయకత్వానికి పరీక్ష
ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న 77 ఏళ్ల సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. వయసు రీత్యా అప్పటికి 82 ఏళ్లలో చురుకుగా ఉండలేనని ఆయన భావన. తన రాజకీయ ప్రయాణంలో దాదాపు చివరి ఎన్నికలుగా భావించే ఈ లోక్సభ ఎన్నికలు సిద్ధరామయ్య నాయకత్వానికి పరీక్ష కానున్నాయి. విధానసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డీకే శివకుమార్ నుంచి సీఎం కుర్చీకి పోటీ ఎదుర్కొన్న సిద్ధరామయ్యకు ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 2019 ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 20 స్థానాల లక్ష్యంతో బరిలో దిగింది. ఇందులో కనీసం సగం స్థానాలు గెలిస్తేనే సిద్ధరామయ్య సీఎంగా కొనసాగగలరు. లేదంటే బాధ్యత వహిస్తూ అధికార పంపిణీకి సిద్ధం కావాలి. ఈ సున్నిత సూత్రాన్ని అంచనా వేసిన సిద్ధరామయ్య అభ్యర్థుల ఎంపికలో తన నిర్ణయానికి పెద్ద పీట వేయించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆరుగురు మంత్రుల పిల్లలకు టికెట్ దక్కాయంటే అది సిద్ధరామయ్య ప్రయత్న ఫలితమే. అహింద (బడుగు, బలహీన, మైనారిటీ) ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్కు దక్కేలా చేసేందుకు సిద్ధరామయ్య జిల్లా స్థాయిలో ఆ వర్గాల నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 28 స్థానాల్లో 20 జిల్లాలకు బాధ్యత వహించే మంత్రులంతా సిద్ధరామయ్య ఆప్తులుగా ఉన్నవారే.
ఖర్గే పోరు
జాతీయ నాయకుల కరిష్మా భాజపాకు ఉన్నంత స్థాయిలో కాంగ్రెస్కు లేదు. కర్ణాటకలో ఆ లోటును తీర్చగలిగే నేత మల్లికార్జున ఖర్గే ఒక్కరే. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న 82 ఏళ్ల వృద్ధ నేతకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. తన రాజకీయ జీవితంలో తొలి అపజయాన్ని అందించిన 2019 ఎన్నికలు ఆయనకు కొత్త పదవులు అందేలా చేశాయి. 2020 జూన్ 12న రాజ్యసభకు నామినేట్ అయిన ఖర్గే మరో నాలుగు నెలలకు ఏఐసీసీ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుత హోదా కారణంగా ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించడం ఖర్గేకు ఎంతో కీలకం. కర్ణాటక అంతటా కాకపోయినా ఉత్తర కర్ణాటకలో ఖర్గే ప్రభావం ప్రధాని మోదీతో పోటీ పడుతుంది. ఆ కారణంగానే ఈ ఎన్నికల్లో మోదీ తన తొలి కర్ణాటక ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచే ప్రారంభించడం గమనార్హం. 2019 వరకు తాను ప్రాతినిథ్యం వహించిన కలబురగి స్థానానికి అల్లుడు రాథాకృష్ణ దొడ్డమనిని పోటీలో దింపిన ఆయన ఈ ప్రాంతంలోని 14 స్థానాల్లో 12 మంది అభ్యర్థులను తన వ్యూహం ప్రకారం నిలబెట్టారు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 20 స్థానాల్లో గెలిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం