కాంగ్రెస్, ఆప్ కలయికతో మేలెంత?
గుజరాత్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కలయిక లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్స్వీప్ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్లో భాజపాను అడ్డుకుని ‘ఇండియా’ నెగ్గుకొచ్చేనా..
అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటివి కలిపినా భాజపాకే ఎక్కువ ఓట్లు
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కలయిక లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్స్వీప్ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కంటే భాజపాకే అధికంగా ఓట్లు వచ్చాయి. దీంతో గుజరాత్లో మళ్లీ క్లీన్స్వీప్ చేస్తామనే ధీమాను భాజపా వ్యక్తం చేస్తోంది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ‘ఇండియా’ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 26 సీట్లనూ భాజపా గెలుచుకుంది.
ఎన్నో మార్పులొచ్చాయంటున్న కూటమి
ప్రస్తుతం గుజరాత్లో ఎన్నో మార్పులొచ్చాయని ఇండియా కూటమి అంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెబుతోంది. ఓటర్ల సెంటిమెంటులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటోంది. గతం కంటే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించగలమనే ధీమాను వ్యక్తం చేస్తోంది.
- గత రెండు లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లను గెలుచుకున్న భాజపాపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఇండియా కూటమి భావిస్తోంది.
- ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామి అని, గుజరాత్లో తమదే పెద్దన్న పాత్రని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి తెలిపారు. ప్రతిపక్షాల్లో చీలికను కూటమి నిలువరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- గుజరాత్లో కాంగ్రెస్ 24 సీట్లలో, ఆప్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
- భావ్నగర్, భరూచ్ సీట్లలో ఆప్ గెలుపునకు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది.
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల విభజనతో భాజపా లాభపడిందనేది కాంగ్రెస్, ఆప్ల భావనగా ఉంది.
- ప్రస్తుతం ముఖాముఖి పోటీ తమకు లాభిస్తుందనేది ఆప్ వాదనగా ఉంది.
గతంలో కాషాయదళానిదే ఆధిపత్యం
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 52.50శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్, ఆప్లకు కలిపి 40.2 శాతం ఓట్లు వచ్చాయి.
- 182 అసెంబ్లీ సీట్లలో భాజపా 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్కు 17, ఆప్నకు 5 సీట్లు దక్కాయి.
- కాంగ్రెస్, ఆప్ల కలయిక స్వల్ప ప్రభావమే చూపనుందని, తమ విజయాన్ని అడ్డుకునేంతగా లేదని గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. తాము ఒక్కో నియోజకవర్గంలో 5లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- భరూచ్ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి మన్సుఖ్ వాసవ ఏడోసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- భరూచ్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 భాజపా గెలుచుకుంది.
ఎమ్మెల్యేలే ఆప్ అభ్యర్థులు
2022లో ఆప్ గెలిచిన 5 అసెంబ్లీ సీట్లలో రెండు భరూచ్, భావ్నగర్లలో ఉన్నాయి. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే ఇప్పుడు లోక్సభ బరిలో నిలిచారు. భరూచ్లో గిరిజన ప్రాబల్యం అధికం. 1989 వరకూ ఇది కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాతి నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది.
రూచ్లో చైతార్ వాసవ బరిలో నిలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో దేదియాపడ నుంచి గెలిచారు.
ఇదీ లెక్క
- గత అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్లో భాజపాకు 6.16 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఆప్లకు కలిపితే 4.74లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాజపాకు 51శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 26శాతం, ఆప్ 13శాతం ఓట్లు సాధించాయి. రెండు కలిపినా భాజపా కంటే 12శాతం తక్కువే. భరూచ్లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ డిపాజిట్లు కోల్పోయింది.
- భావ్నగర్లో భాజపాకు 6.14 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఆప్ కలిసి 4.91 లక్షల ఓట్లు సాధించాయి.
- 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 128 మంది ఆప్ అభ్యర్థులు, 41 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా