కాంగ్రెస్, ఆప్ కలయికతో మేలెంత?
గుజరాత్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కలయిక లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్స్వీప్ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్లో భాజపాను అడ్డుకుని ‘ఇండియా’ నెగ్గుకొచ్చేనా..
అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటివి కలిపినా భాజపాకే ఎక్కువ ఓట్లు
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కలయిక లోక్సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్స్వీప్ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కంటే భాజపాకే అధికంగా ఓట్లు వచ్చాయి. దీంతో గుజరాత్లో మళ్లీ క్లీన్స్వీప్ చేస్తామనే ధీమాను భాజపా వ్యక్తం చేస్తోంది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ‘ఇండియా’ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 26 సీట్లనూ భాజపా గెలుచుకుంది.
ఎన్నో మార్పులొచ్చాయంటున్న కూటమి
ప్రస్తుతం గుజరాత్లో ఎన్నో మార్పులొచ్చాయని ఇండియా కూటమి అంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెబుతోంది. ఓటర్ల సెంటిమెంటులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటోంది. గతం కంటే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించగలమనే ధీమాను వ్యక్తం చేస్తోంది.
- గత రెండు లోక్సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లను గెలుచుకున్న భాజపాపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఇండియా కూటమి భావిస్తోంది.
- ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామి అని, గుజరాత్లో తమదే పెద్దన్న పాత్రని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి తెలిపారు. ప్రతిపక్షాల్లో చీలికను కూటమి నిలువరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- గుజరాత్లో కాంగ్రెస్ 24 సీట్లలో, ఆప్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
- భావ్నగర్, భరూచ్ సీట్లలో ఆప్ గెలుపునకు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది.
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల విభజనతో భాజపా లాభపడిందనేది కాంగ్రెస్, ఆప్ల భావనగా ఉంది.
- ప్రస్తుతం ముఖాముఖి పోటీ తమకు లాభిస్తుందనేది ఆప్ వాదనగా ఉంది.
గతంలో కాషాయదళానిదే ఆధిపత్యం
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 52.50శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్, ఆప్లకు కలిపి 40.2 శాతం ఓట్లు వచ్చాయి.
- 182 అసెంబ్లీ సీట్లలో భాజపా 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్కు 17, ఆప్నకు 5 సీట్లు దక్కాయి.
- కాంగ్రెస్, ఆప్ల కలయిక స్వల్ప ప్రభావమే చూపనుందని, తమ విజయాన్ని అడ్డుకునేంతగా లేదని గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. తాము ఒక్కో నియోజకవర్గంలో 5లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- భరూచ్ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి మన్సుఖ్ వాసవ ఏడోసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- భరూచ్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 భాజపా గెలుచుకుంది.
ఎమ్మెల్యేలే ఆప్ అభ్యర్థులు
2022లో ఆప్ గెలిచిన 5 అసెంబ్లీ సీట్లలో రెండు భరూచ్, భావ్నగర్లలో ఉన్నాయి. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే ఇప్పుడు లోక్సభ బరిలో నిలిచారు. భరూచ్లో గిరిజన ప్రాబల్యం అధికం. 1989 వరకూ ఇది కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాతి నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది.
రూచ్లో చైతార్ వాసవ బరిలో నిలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో దేదియాపడ నుంచి గెలిచారు.
ఇదీ లెక్క
- గత అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్లో భాజపాకు 6.16 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఆప్లకు కలిపితే 4.74లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాజపాకు 51శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 26శాతం, ఆప్ 13శాతం ఓట్లు సాధించాయి. రెండు కలిపినా భాజపా కంటే 12శాతం తక్కువే. భరూచ్లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ డిపాజిట్లు కోల్పోయింది.
- భావ్నగర్లో భాజపాకు 6.14 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఆప్ కలిసి 4.91 లక్షల ఓట్లు సాధించాయి.
- 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 128 మంది ఆప్ అభ్యర్థులు, 41 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
విశాఖలో జరిగింది చిన్న సంఘటనే
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..