ఫైర్బ్రాండ్ వర్సెస్ రాజమాత
పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో ఆసక్తికర పోరు నెలకొంది. తృణమూల్ నేత, ఫైర్బ్రాండ్, మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహువా మొయిత్రా ఒకవైపు, స్థానిక రాజ కుటుంబానికి చెందిన రాజమాతగా పిలిచే అమృతా రాయ్ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఆసక్తికరంగా పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్ పోరు
పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో ఆసక్తికర పోరు నెలకొంది. తృణమూల్ నేత, ఫైర్బ్రాండ్, మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహువా మొయిత్రా ఒకవైపు, స్థానిక రాజ కుటుంబానికి చెందిన రాజమాతగా పిలిచే అమృతా రాయ్ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది.
మహువా మొయిత్రా
కృష్ణానగర్లో గత ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత అనర్హతకు గురైన 49ఏళ్ల మహువా మొయిత్రాకే తృణమూల్ మళ్లీ టికెట్ ఇచ్చింది. ఆవేశపూరిత ప్రసంగాలతో, మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఆమె ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేయడంద్వారా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే లోక్సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్న ఆరోపణలతో ఆమెపై అనర్హత వేటు పడింది. తన ఎంపీ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చిన వ్యవహారంలోనూ వివాదాస్పదమయ్యారు.
అమృతా రాయ్
కృష్ణానగర్ రాజ కుటుంబానికి చెందిన రాజమాత అమృతా రాయ్కు భాజపా టికెటిచ్చింది. మహారాజు కృష్ణమచంద్ర రాయ్ను పెళ్లాడిన ఆమె ‘రాణి మా’గా రాజమాతగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి భాజపా టికెట్ ఇచ్చింది.
ఇద్దరూ ఇద్దరే..
- ఆధునిక కాలానికి చెందిన మధ్య తరగతి మహిళకు, సంప్రదాయ సంపన్న వర్గానికి చెందిన మహిళకు మధ్య ఈ పోరు సాగుతోంది.
- గత ఎన్నికల్లో మొయిత్రాకు 60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది.
- ప్లాసీ యుద్ధంలో సిరాజ్-ఉద్-దౌలా పోరాడుతుంటే రాజ వంశం.. బ్రిటీషర్లకు మద్దతుగా నిలిచిందని తృణమూల్ విమర్శలు చేస్తోంది. రాయ్ వంశం దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తోంది.
- అయితే మొఘల్ రాజులకు వ్యతిరేకంగా కృష్ణమచంద్ర రాజ కుటుంబం పోరాడిందని భాజపా అంటోంది. సిరాజ్-ఉద్-దౌలా హయాంలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తోంది.
- జేపీ మోర్గాన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉన్న మొయిత్రా ఆ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు.
- గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఆమె 2019లో కృష్ణానగర్ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు.
- అమృతా రాయ్ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్.
ఇదీ కృష్ణానగర్
- కృష్ణానగర్లో 17 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలోని 87శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
- నియోజకవర్గంలో 55శాతం హిందువులు, 35శాతం ముస్లింలున్నారు.
- ఎస్సీలు 22.57శాతం, ఎస్టీలు 1.69శాతం ఉన్నారు.
- బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మతువా జనాభా కూడా గుర్తించదగిన స్థాయిలోనే ఉంటుంది. సీఏఏ వల్ల వీరికి అధికంగా లబ్ధి కలగనుంది.
- 1967లో ఏర్పడిన కృష్ణానగర్లో 2004 వరకూ సీపీఎంకు తిరుగులేదు. 1999లో మాత్రం ఇక్కడ భాజపా గెలిచింది. 2009 నుంచి తృణమూల్ వరుసగా 3 సార్లు గెలిచింది.
- 2019 ఎన్నికల్లో భాజపాకు 40శాతం ఓట్లు వచ్చాయి. లెఫ్ట్కు 8.8శాతం, కాంగ్రెస్కు 2.8శాతం ఓట్లు దక్కాయి.
కృష్ణానగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
విశాఖలో జరిగింది చిన్న సంఘటనే
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. -
తెదేపాకు ఓటేయాలన్నందుకు.. దంపతులపై దాడి
తెదేపాకు ఓటేయాలని చెప్పినందుకు కర్నూలు జిల్లా కోడుమూరు ఇంద్రజిత్గుప్తా నగర్కు చెందిన దంపతులపై గురువారం రాత్రి దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 5 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..