గ్యారంటీలపై విస్తృత ప్రచారం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు.
జాతీయ మ్యానిఫెస్టో అంశాలూ ప్రజలకు చెప్పండి
పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం
సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష
ఈనాడు-హైదరాబాద్, రంగంపేట-న్యూస్టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ హామీలపైనా ఇంటింటికీ విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. సీఎం ఆదివారం తన నివాసంలో సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమీక్షలు జరిపారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం సునాయాసమేనని ధీమా వ్యక్తం చేశారు. భారాసకు ప్రజల్లో బలం లేదని.. ఆ పార్టీకి ఓటు వేస్తే వృథాయే అన్న నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో చురుగ్గా పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించాలని, వారితో ఇంటింటి ప్రచారం చేయించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు ఆధిక్యంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకూ పార్టీ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కిషన్రెడ్డిపై వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవాలి..
కిషన్రెడ్డి.. తాను సిటింగ్ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గానికి గాని, రాష్ట్రానికి గాని ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్రెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని సానుకూలంగా మలచుకునేలా పెద్దఎత్తున ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విజయారెడ్డి, భారాస తరఫున దానం నాగేందర్ పోటీపడగా.. దానం నెగ్గిన విషయం తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ను కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఇరువురు నేతలూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ను గెలిపించాలని సీఎం సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు రావాలి..
వరంగల్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు రేవంత్రెడ్డి సూచించారు. ఆమె గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్, ఇతర పార్టీల పరిస్థితులపై రేవంత్ సమీక్షించారు. ‘వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు వెంటనే నిర్వహించాలి. తర్వాత మండలస్థాయి ప్రచార కమిటీల సమావేశాలు పెట్టాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నేతలతో కలసి సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి’ అని రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం పోటీపడిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్ తదితరులను సమావేశానికి సీఎం పిలిపించి మాట్లాడారు. టికెట్ రాలేదని నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో మంచి అవకాశాలు కల్పిస్తామని, లోక్సభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. వరంగల్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి (పరకాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), నాయిని రాజేందర్రెడ్డి (వరంగల్ పశ్చిమ), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కేఆర్ నాగరాజు (వర్ధన్నపేట), ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర ముఖ్యనేతలు, సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశంలో అభ్యర్థి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నేతలు అజారుద్దీన్, రోహిన్రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ఖాన్, కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?