గ్యారంటీలపై విస్తృత ప్రచారం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు.
జాతీయ మ్యానిఫెస్టో అంశాలూ ప్రజలకు చెప్పండి
పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం
సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష
ఈనాడు-హైదరాబాద్, రంగంపేట-న్యూస్టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ హామీలపైనా ఇంటింటికీ విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. సీఎం ఆదివారం తన నివాసంలో సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమీక్షలు జరిపారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం సునాయాసమేనని ధీమా వ్యక్తం చేశారు. భారాసకు ప్రజల్లో బలం లేదని.. ఆ పార్టీకి ఓటు వేస్తే వృథాయే అన్న నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో చురుగ్గా పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించాలని, వారితో ఇంటింటి ప్రచారం చేయించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు ఆధిక్యంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకూ పార్టీ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కిషన్రెడ్డిపై వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవాలి..
కిషన్రెడ్డి.. తాను సిటింగ్ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గానికి గాని, రాష్ట్రానికి గాని ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్రెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని సానుకూలంగా మలచుకునేలా పెద్దఎత్తున ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విజయారెడ్డి, భారాస తరఫున దానం నాగేందర్ పోటీపడగా.. దానం నెగ్గిన విషయం తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ను కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఇరువురు నేతలూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ను గెలిపించాలని సీఎం సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు రావాలి..
వరంగల్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు రేవంత్రెడ్డి సూచించారు. ఆమె గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్, ఇతర పార్టీల పరిస్థితులపై రేవంత్ సమీక్షించారు. ‘వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు వెంటనే నిర్వహించాలి. తర్వాత మండలస్థాయి ప్రచార కమిటీల సమావేశాలు పెట్టాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నేతలతో కలసి సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి’ అని రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం పోటీపడిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్ తదితరులను సమావేశానికి సీఎం పిలిపించి మాట్లాడారు. టికెట్ రాలేదని నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో మంచి అవకాశాలు కల్పిస్తామని, లోక్సభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. వరంగల్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి (పరకాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), నాయిని రాజేందర్రెడ్డి (వరంగల్ పశ్చిమ), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కేఆర్ నాగరాజు (వర్ధన్నపేట), ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర ముఖ్యనేతలు, సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశంలో అభ్యర్థి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నేతలు అజారుద్దీన్, రోహిన్రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ఖాన్, కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం