తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు.. లోక్సభ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు
భారత్లో ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లున్న దేశంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు భారీ కసరత్తు చేస్తోంది.
దిల్లీ: భారత్లో ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లున్న దేశంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలినాళ్లలో ఎన్నో సవాళ్లతోపాటు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 1957 (రెండో సాధారణ) ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఎన్నికల సంఘం పలు సందర్భాల్లో వెల్లడించింది.
- అప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన ఒక ఓటరు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయనని భీష్మించారు. ప్రచారంతో రాజకీయ పార్టీలు తనను ఎంతగానో వేధించాయని, అందుకే అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుకుమార్ సేన్కే తాను ఓటు వేస్తానని చెప్పడం విశేషం.
- ఓ ఓటరు.. బ్యాలెట్ బాక్సును ‘ఆరాధ్య వస్తువుగా’ భావించారు. ఓటు వేసే ముందు దానికి పూజలు చేశారు. మరికొన్ని చోట్ల ఓటర్లు వాటిని పూజించే వస్తువుగా భావించి, పూలను వదిలివెళ్లారు.
- అప్పటి మద్రాస్లో (చెన్నై) పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓ మహిళా ఓటరు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ‘ఈ రోజుల్లో కింగ్ మేకర్, మినిస్టర్ మేకర్ నీవే. పాత రోజుల్లో మాదిరిగా తక్కువ ధరకు బియ్యం అందించండి’ అని బ్యాలెట్ బాక్సును ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు.
- కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు తెరిచినప్పుడు విభిన్న వస్తువులు కనిపించాయట. తమ అభ్యర్థి విజయం సాధించాలని కొందరు, దుర్భాషలాడుతూ మరికొందరు చీటీలను బ్యాలెట్ బాక్సులో వేశారు. నాణేలు, కరెన్సీ నోట్లు, హాలీవుడ్ నటుల ఫొటోలూ వాటిలో వదిలేయడం గమనార్హం.
- పోలింగ్ కేంద్రాల్లోకి క్రూరమృగాలు వచ్చిన సందర్భాలున్నాయి. పోలింగ్కు ముందు రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని ఓ పోలింగ్ కేంద్రంలో పులి ప్రవేశించి కాసేపటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు పోలింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది తిరుగు ప్రయాణంలో వారి జీపునకు అతి సమీపంలోకి ఆ క్రూర మృగం మళ్లీ వచ్చి ఆగింది. కేవలం 10 అడుగుల దూరంలోనే అడ్డుగా నిలిచింది. కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
- మధ్యప్రదేశ్లోనూ ఓ పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన పులి.. అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి కాలు పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.
- కొత్త దిల్లీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. నామినేషన్లో తనను తాను దైవంతో పోల్చుకోవడం గమనార్హం. చివరకు రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని తిరస్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం