కొబ్బరి నేలను కొట్టేదెలా?
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కేరళ జననాడిని పట్టలేకపోతున్న భాజపా
ఆర్ఎస్ఎస్కు గట్టి పట్టున్నా దక్కని ప్రాభవం
పాగాకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాషాయదళం
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా ఆ రాష్ట్రం ఓటరు నాడి పార్టీకి అంతు చిక్కడం లేదు. విజయం దక్కడం లేదు. ఈసారీ భాజపా అంతే గట్టిగా పోరాటానికి సిద్ధమైంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దిగింది. దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళలో జరగనున్న ముక్కోణ పోటీపై ఆసక్తి నెలకొంది.
ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం ఎక్కువే..
దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కేరళలోని యువ కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్లో చేరారు. 1977 నుంచి 1982 వరకు వారి వలసలు కొనసాగాయి. వారంతా సంస్థ అభివృద్ధికి తోడ్పడ్డారు. దీంతో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య ఈ రాష్ట్రంలో అధికంగా ఉంది. ఇక్కడ 5,142 మంది శాఖలు ఉన్నాయి. ఇది హిందుత్వ ప్రాబల్య రాష్ట్రాలుగా చెప్పుకొనే ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఉన్నవాటి కంటే చాలా ఎక్కువ. సంస్థ బాగా విస్తరించడంతో ఇటీవలే రెండు ప్రాంతాలుగా కేరళను ఆర్ఎస్ఎస్ విభజించింది.
సంఘ్ ఆధిపత్యమున్నా కేరళలో భాజపా కాలుమోపలేకపోతోంది. ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతోంది. ఆర్ఎస్ఎస్తోపాటు ఎదగలేకపోతోంది.
మొదటిదీ.. చివరిదీ..
స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లోనే కేరళలో కమ్యూనిస్టులు సత్తా చాటారు. 1957లోనే ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికమో ఏమోగానీ ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చివరి రాష్ట్రమూ కేరళే అయింది. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్నారు.
క్రిస్టియన్లపై భాజపా గురి
- కేరళలో ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి 46శాతం ఉన్నారు. ఇది భాజపాకు పెద్ద మైనస్. క్రిస్టియన్ల ఓట్లను సాధించేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీని పార్టీలో చేర్చుకుంది.
- కేరళ జనపక్షం పార్టీ (సెక్యులర్) అధినేత పీసీ జార్జి తన పార్టీని భాజపాలో విలీనం చేశారు.
- కేరళ జనాభాలో హిందువులైన ఎజావాలు 25శాతం, నాయర్లు 12.5 శాతం ఉంటారు. నాయర్లు మూకుమ్మడిగా ఏ ఒక్క పార్టీకీ ఓటు వేయరు. ఎజావాలు సంప్రదాయంగా లెఫ్ట్నకు మద్దతిస్తుంటారు.
- రాష్ట్రంలోని 54శాతం మంది హిందువుల్లో సగం మంది లెఫ్ట్ మద్దతుదారులే. బ్రాహ్మణ వర్గానికి చెందిన నంబూద్రీలూ కమ్యూనిస్టులకు మద్దతు పలుకుతారు.
- ఎజావాల ఓట్లను సాధించేందుకు భారతీయ ధర్మ జనసేనతో భాజపా పొత్తు పెట్టుకుంది.
పెరుగుతున్న ఓట్ల శాతం
కేరళలో భాజపా ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. మొత్తం 25,000 పోలింగ్ బూత్లలో 22,000 చోట్ల తమ ఉనికి ఉందని పార్టీ నేతలు తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 16.5శాతం ఓట్లు సాధించామని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏడెనిమిది నియోజకవర్గాల్లో 30శాతానికిపైగా ఓట్లు సాధించామని వెల్లడించారు. త్వరలో ఇవి సీట్లుగా మారనున్నాయని వివరించారు.
- ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు 1,000 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇది తమిళనాడు కంటే అధికం.
- ఈసారి రాష్ట్రంలోని యువత తమకు మద్దతు పలకనున్నారని భాజపా నేతలు అంటున్నారు. అదే జరిగితే ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్లోకి కమ్యూనిస్టులు వచ్చినట్లుగా మార్పు తథ్యమని చెబుతున్నారు.
విభజన ఉన్నా ఓటింగ్లో కనిపించదు
కేరళ సమాజంలో మతపరమైన విభజన ఉన్నా ఓటింగ్ సమయంలో పెద్దగా కనిపించదని లెఫ్ట్ నేతలు పేర్కొంటున్నారు. బహుశా చదువుకున్నవారు, రాజకీయంగా చైతన్యం కలవారు కావడమే ఇందుకు కారణమని వారు వివరిస్తున్నారు. ప్రగతిశీల కేరళ ఎన్నటికీ విభజన రాజకీయాలను అంగీకరించదని అంటున్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఎదుగుదల కూడా ఫేక్ అని వారంటున్నారు.
‘ఈసారి సత్తాచాటుతాం’
భౌగోళిక పరిస్థితులు, ఓట్ల బదిలీల్లో లెఫ్ట్, కాంగ్రెస్ వ్యూహాలు తమకు ప్రతికూలంగా పని చేస్తున్నాయని కేరళ భాజపా నేత ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చిందని, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాగా వేస్తామని తెలిపారు.
భాజపా ఎందుకు ఎదగడం లేదంటే..
కేరళలో భాజపా ఎదగకపోవడానికి ఆశ్చర్యకరమైన కారణాలున్నాయని సంఘ్ నేత ఒకరు తెలిపారు. మొత్తం నాలుగు అడ్డంకులు ఆ పార్టీని ఎదగనీయడం లేదని వివరించారు. అవి
- భౌగోళిక పరిస్థితులు
- లెఫ్ట్, కాంగ్రెస్ ఫ్రంట్ల మధ్య ఓట్ల బదిలీ
- లెఫ్టిస్ట్ ప్రచారం
- స్థానిక భాజపా నేతల హత్యలు
- 1960ల చివరి నుంచి ఇప్పటిదాకా 300 మంది నేతలను భాజపా కోల్పోయింది. 1980లలో వందల మందిని పోగొట్టుకుంది. ఈ ఘటనలు జరగకుండా ఉండి ఉంటే కర్ణాటకలో మాదిరిగా అధికారం చేపట్టేవాళ్లమని కేరళ భాజపా ఐటీ సెల్ హెడ్ జైశంకర్ పేర్కొన్నారు. కేరళలో భాజపా నేతల హత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయని ఆయన తెలిపారు.
- కేరళలోని భాజపా, సంఘ్, ఏబీవీపీ నేతలపై వందల కేసులు పెడుతున్నారని, వారిని పోలీసులు కొడుతున్నారని జైశంకర్ వివరించారు. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ నేతలతో డీల్ చేయాల్సి వస్తోందని ఆయన వెల్లడించారు.
- కేరళలో భాజపాకు జనాకర్షక నేతలు లేకపోవడమూ పెద్ద మైనస్సే. తమిళనాడులో ఉన్న అన్నామలై లాంటి నేత కేరళలో లేరు.
- సంఘ్, భాజపాలు స్వేచ్ఛా వ్యతిరేక పార్టీలని కమ్యూనిస్టులు విపరీతంగా ప్రచారం చేసి దెబ్బతీశారు. దీనివల్ల ఇక్కడి ప్రజలు భాజపాతో మమేకం కాలేకపోయారు.
- భాజపాకు ఓటేస్తే వృథా అవుతుందని ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రచారమూ నష్టం కలగజేస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi: రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న విశ్వాసం ఫలితమే తనకు ‘బ్రాండ్ మోదీ’ అనే గుర్తింపునిచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. తానో కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. -
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేడీ ప్రభుత్వ విధానాలను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసందర్భంగా పూరీ ఆలయ భాండాగారం ప్రస్తావన తెచ్చారు. -
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ