కొబ్బరి నేలను కొట్టేదెలా?
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కేరళ జననాడిని పట్టలేకపోతున్న భాజపా
ఆర్ఎస్ఎస్కు గట్టి పట్టున్నా దక్కని ప్రాభవం
పాగాకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాషాయదళం
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా ఆ రాష్ట్రం ఓటరు నాడి పార్టీకి అంతు చిక్కడం లేదు. విజయం దక్కడం లేదు. ఈసారీ భాజపా అంతే గట్టిగా పోరాటానికి సిద్ధమైంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దిగింది. దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళలో జరగనున్న ముక్కోణ పోటీపై ఆసక్తి నెలకొంది.
ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం ఎక్కువే..
దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కేరళలోని యువ కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్లో చేరారు. 1977 నుంచి 1982 వరకు వారి వలసలు కొనసాగాయి. వారంతా సంస్థ అభివృద్ధికి తోడ్పడ్డారు. దీంతో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య ఈ రాష్ట్రంలో అధికంగా ఉంది. ఇక్కడ 5,142 మంది శాఖలు ఉన్నాయి. ఇది హిందుత్వ ప్రాబల్య రాష్ట్రాలుగా చెప్పుకొనే ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఉన్నవాటి కంటే చాలా ఎక్కువ. సంస్థ బాగా విస్తరించడంతో ఇటీవలే రెండు ప్రాంతాలుగా కేరళను ఆర్ఎస్ఎస్ విభజించింది.
సంఘ్ ఆధిపత్యమున్నా కేరళలో భాజపా కాలుమోపలేకపోతోంది. ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతోంది. ఆర్ఎస్ఎస్తోపాటు ఎదగలేకపోతోంది.
మొదటిదీ.. చివరిదీ..
స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లోనే కేరళలో కమ్యూనిస్టులు సత్తా చాటారు. 1957లోనే ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికమో ఏమోగానీ ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చివరి రాష్ట్రమూ కేరళే అయింది. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్నారు.
క్రిస్టియన్లపై భాజపా గురి
- కేరళలో ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి 46శాతం ఉన్నారు. ఇది భాజపాకు పెద్ద మైనస్. క్రిస్టియన్ల ఓట్లను సాధించేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీని పార్టీలో చేర్చుకుంది.
- కేరళ జనపక్షం పార్టీ (సెక్యులర్) అధినేత పీసీ జార్జి తన పార్టీని భాజపాలో విలీనం చేశారు.
- కేరళ జనాభాలో హిందువులైన ఎజావాలు 25శాతం, నాయర్లు 12.5 శాతం ఉంటారు. నాయర్లు మూకుమ్మడిగా ఏ ఒక్క పార్టీకీ ఓటు వేయరు. ఎజావాలు సంప్రదాయంగా లెఫ్ట్నకు మద్దతిస్తుంటారు.
- రాష్ట్రంలోని 54శాతం మంది హిందువుల్లో సగం మంది లెఫ్ట్ మద్దతుదారులే. బ్రాహ్మణ వర్గానికి చెందిన నంబూద్రీలూ కమ్యూనిస్టులకు మద్దతు పలుకుతారు.
- ఎజావాల ఓట్లను సాధించేందుకు భారతీయ ధర్మ జనసేనతో భాజపా పొత్తు పెట్టుకుంది.
పెరుగుతున్న ఓట్ల శాతం
కేరళలో భాజపా ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. మొత్తం 25,000 పోలింగ్ బూత్లలో 22,000 చోట్ల తమ ఉనికి ఉందని పార్టీ నేతలు తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 16.5శాతం ఓట్లు సాధించామని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏడెనిమిది నియోజకవర్గాల్లో 30శాతానికిపైగా ఓట్లు సాధించామని వెల్లడించారు. త్వరలో ఇవి సీట్లుగా మారనున్నాయని వివరించారు.
- ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు 1,000 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇది తమిళనాడు కంటే అధికం.
- ఈసారి రాష్ట్రంలోని యువత తమకు మద్దతు పలకనున్నారని భాజపా నేతలు అంటున్నారు. అదే జరిగితే ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్లోకి కమ్యూనిస్టులు వచ్చినట్లుగా మార్పు తథ్యమని చెబుతున్నారు.
విభజన ఉన్నా ఓటింగ్లో కనిపించదు
కేరళ సమాజంలో మతపరమైన విభజన ఉన్నా ఓటింగ్ సమయంలో పెద్దగా కనిపించదని లెఫ్ట్ నేతలు పేర్కొంటున్నారు. బహుశా చదువుకున్నవారు, రాజకీయంగా చైతన్యం కలవారు కావడమే ఇందుకు కారణమని వారు వివరిస్తున్నారు. ప్రగతిశీల కేరళ ఎన్నటికీ విభజన రాజకీయాలను అంగీకరించదని అంటున్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఎదుగుదల కూడా ఫేక్ అని వారంటున్నారు.
‘ఈసారి సత్తాచాటుతాం’
భౌగోళిక పరిస్థితులు, ఓట్ల బదిలీల్లో లెఫ్ట్, కాంగ్రెస్ వ్యూహాలు తమకు ప్రతికూలంగా పని చేస్తున్నాయని కేరళ భాజపా నేత ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చిందని, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాగా వేస్తామని తెలిపారు.
భాజపా ఎందుకు ఎదగడం లేదంటే..
కేరళలో భాజపా ఎదగకపోవడానికి ఆశ్చర్యకరమైన కారణాలున్నాయని సంఘ్ నేత ఒకరు తెలిపారు. మొత్తం నాలుగు అడ్డంకులు ఆ పార్టీని ఎదగనీయడం లేదని వివరించారు. అవి
- భౌగోళిక పరిస్థితులు
- లెఫ్ట్, కాంగ్రెస్ ఫ్రంట్ల మధ్య ఓట్ల బదిలీ
- లెఫ్టిస్ట్ ప్రచారం
- స్థానిక భాజపా నేతల హత్యలు
- 1960ల చివరి నుంచి ఇప్పటిదాకా 300 మంది నేతలను భాజపా కోల్పోయింది. 1980లలో వందల మందిని పోగొట్టుకుంది. ఈ ఘటనలు జరగకుండా ఉండి ఉంటే కర్ణాటకలో మాదిరిగా అధికారం చేపట్టేవాళ్లమని కేరళ భాజపా ఐటీ సెల్ హెడ్ జైశంకర్ పేర్కొన్నారు. కేరళలో భాజపా నేతల హత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయని ఆయన తెలిపారు.
- కేరళలోని భాజపా, సంఘ్, ఏబీవీపీ నేతలపై వందల కేసులు పెడుతున్నారని, వారిని పోలీసులు కొడుతున్నారని జైశంకర్ వివరించారు. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ నేతలతో డీల్ చేయాల్సి వస్తోందని ఆయన వెల్లడించారు.
- కేరళలో భాజపాకు జనాకర్షక నేతలు లేకపోవడమూ పెద్ద మైనస్సే. తమిళనాడులో ఉన్న అన్నామలై లాంటి నేత కేరళలో లేరు.
- సంఘ్, భాజపాలు స్వేచ్ఛా వ్యతిరేక పార్టీలని కమ్యూనిస్టులు విపరీతంగా ప్రచారం చేసి దెబ్బతీశారు. దీనివల్ల ఇక్కడి ప్రజలు భాజపాతో మమేకం కాలేకపోయారు.
- భాజపాకు ఓటేస్తే వృథా అవుతుందని ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రచారమూ నష్టం కలగజేస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్