గాంధీల్లేని పీలీభీత్.. 3 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి
మూడు దశాబ్దాలకుపైగా గాంధీలు ప్రాతినిధ్యం వహించిన పీలీభీత్ ఈసారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది.
పీలీభీత్: మూడు దశాబ్దాలకుపైగా గాంధీలు ప్రాతినిధ్యం వహించిన పీలీభీత్ ఈసారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. ఉత్తర్ ప్రదేశ్లోని ఈ నియోజకవర్గానికి 30ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. భాజపాపై విమర్శలు చేసిన సిటింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి భాజపా టికెట్ ఇవ్వలేదు.
స్థానికేతరుడికి టికెట్
తొలి విడతలోనే పీలీభీత్లో పోలింగ్ జరగనుంది. ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాదను భాజపా బరిలోకి దింపింది. కాంగ్రెస్ నేత అయిన జితిన్ ప్రసాద 2004, 2009 ఎన్నికల్లో షాజహాన్పుర్, ధరువాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2021లో ఆయన భాజపాలో చేరారు. రాష్ట్ర మంత్రి అయ్యారు. అయితే ఆయన పీలీభీత్కు పూర్తిగా కొత్త, స్థానికేతరుడు.
నేపాల్ సరిహద్దులో..
నేపాల్ సరిహద్దులోని తేరాయ్ బెల్ట్లో పీలీభీత్ నియోజకవర్గం ఉంది. 18 లక్షల మంది ఓటర్లున్నారు. ముస్లింలు, లోధీల తర్వాత కుర్మీలు అత్యధికంగా ఉంటారు. మౌర్యులు, పాసీలు, జాటవ్లు కీలకంగానే ఉంటారు. బెంగాలీలు, బ్రాహ్మణులు, సిక్కులూ ఇక్కడ బాగానే ఉన్నారు. పీలీభీత్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. బహెరి, పీలీభీత్, బార్ఖెరా, పురాన్పుర్, బిలాస్పుర్ దీని పరిధిలోకి వస్తాయి. ఇందులో నాలుగు సీట్లను భాజపా, ఒకటి సమాజ్వాదీ గెలుచుకున్నాయి.
1989 నుంచి..
పీలీభీత్లో తొలిసారిగా జనతాదళ్ నుంచి మేనకా గాంధీ ఎన్నికయ్యారు. 1991లో ఓడిపోయారు. 1996లో మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి గాంధీలే వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998, 1999లో స్వతంత్ర అభ్యర్థిగా మేనకా గాంధీ పోటీ చేసి గెలిచారు. 2004, 2014లో భాజపా అభ్యర్థిగా విజయం సాధించారు. 2009, 2019లో పీలీభీత్ నుంచి వరుణ్ గాంధీ ఎన్నికయ్యారు. 2019లో తాను గెలిచిన సుల్తాన్పుర్లో మరోసారి మేనకా గాంధీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వరుణ్తో అనుబంధం
స్థానికులు మాత్రం వరుణ్ గాంధీతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జితిన్ ప్రసాద ప్రభావం ఇక్కడ పెద్దగా లేదు. ఆయనను స్థానికేతరుడిగా చూస్తున్నారు’ అని రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపల్ ఒకరు తెలిపారు. వరుణ్ గాంధీకి పీలీభీత్లో ఎప్పటి నుంచో సంబంధాలున్నాయని, అది గాఢానుబంధమని, తనకు టికెట్ నిరాకరించిన తర్వాత ఆయన రాసిన లేఖద్వారా ఇదే విషయం వెల్లడైందని స్థానిక గ్రామ పెద్ద ఒకరు వెల్లడించారు. టికెట్ ఇవ్వకపోయినా పీలీభీత్ ప్రజలతో తన బంధం కొనసాగుతుందని లేఖలో వరుణ్ పేర్కొన్నారు. పార్టీ మద్దతు తనకే ఉందని జితిన్ ప్రసాద చెబుతున్నా అధిష్ఠానం నిర్ణయంపై స్థానిక నాయకత్వం అసంతృప్తిగానే ఉంది.
- టికెట్ నిరాకరించిన తర్వాత వరుణ్ గాంధీ పీలీభీత్కు రాలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. మంగళవారం జరిగే ప్రధాని సభలోనూ పాల్గొనేది అనుమానమే.
- సమాజ్వాదీ పార్టీ ఇక్కడ భగవత్ శరణ్ గంగ్వార్ను బరిలోకి దింపింది. ఆయనకు కుర్మీల్లో పట్టు ఉంది.బీఎస్పీ తరఫున అనీస్ అహ్మద్ పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!