గిరిజన ఓట్లపై ‘ఇండియా’ దృష్టి
గుజరాత్లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్-ఆప్ కూటమి దృష్టి సారించింది.
గుజరాత్లో విజయానికి ప్రయత్నం
భాజపాకూ గట్టిపట్టే
అహ్మదాబాద్: గుజరాత్లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్-ఆప్ కూటమి దృష్టి సారించింది. ఈ ఓటర్లను ఆకట్టుకోవడంద్వారా విజయానికి బాటలు వేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భాజపాకు గట్టి పట్టు ఉండటం గమనార్హం.
మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్ జరగనున్న గుజరాత్లోని దాహోద్, ఛోటా ఉదయ్పుర్, బార్దోలీ, వల్సాద్లు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. వీటితోపాటు భరూచ్లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ.
అసెంబ్లీ ఎన్నికల్లో చీలిక
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లగలిగింది. గిరిజన నియోజకవర్గమైన డేడియాపాడాలో విజయం సాధించింది. ఇది భరూచ్ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ కూడా ఈ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర వీటి మీదుగా సాగింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఈ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అప్పట్లో ఆప్, కాంగ్రెస్, భారతీయ ట్రైబల్ పార్టీల (బీటీపీ) మధ్య ఓట్లు చీలిపోవడంతో భాజపా విజయం సునాయాసమైంది.
సులభం కాదా?
తొలిసారిగా గిరిజన ప్రాంతంలో పాగా వేయాలనే పట్టుదలతో ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది. అయితే అదంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చైతర్ వసావా గట్టి పోటీ ఇచ్చే అవకాశమున్నా భాజపాను ఓడించేంతగా ఓట్లు సాధిస్తారా అనేది అనుమానమేనని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, వడోదరా వర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నల్లా నీరు, పక్కా ఇళ్లు, ఆర్ఎస్ఎస్ ప్రచారంతో భాజపాకు అనుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్కు సరైన గిరిజన నేత లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. 2014కు ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు గట్టి పట్టుండేది. ఆ తర్వాత చాలామంది గిరిజన నేతలు కాంగ్రెస్ నుంచి భాజపాకు మారారు. మోహన్సింగ్ రాఠవా ఛోటా ఉదయ్పుర్ నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరారు. తాజాగా మాజీ ఎంపీ నరన్ రాఠవా కూడా పార్టీ మారారు. బీటీపీ జాతీయ అధ్యక్షుడు మహేశ్ వసావా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. బీటీపీ ప్రతిపక్ష ఓట్లను చీల్చే అవకాశముందని ధోలాకియా చెబుతున్నారు.
అభ్యర్థులను మార్చిన భాజపా
బార్దోలీ, దాహోద్లలో సిటింగ్ ఎంపీలు ప్రభు వసావా, జస్వంత్సింగ్ భాభోర్లను కొనసాగించిన భాజపా.. ఛోటా ఉదయ్పుర్ సిటింగ్ ఎంపీ గీతాబెన్ రాఠవాను మార్చి జుశుభాయ్ రాఠవాకు టికెటిచ్చింది. వల్సాద్లోనూ కేసీ పటేల్ను మార్చి ధవల్ పటేలకు టికెటిచ్చింది.
కాంగ్రెస్ తరఫున..
వల్సాద్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అనంత్ పటేల్ పోటీ చేస్తున్నారు. బార్దోలీలో సహకార సంఘం నేత సిద్ధార్థ చౌధరిని పార్టీ బరిలోకి దింపింది. దాహోద్లో ప్రభా తావియాడ్ పోటీ చేస్తున్నారు. ఛోటా ఉదయ్పుర్లో సుఖ్రాం రాఠవా బరిలోకి దిగారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 59 స్థానాల్లో కాంగ్రెస్-ఆప్ ఓట్లు కలిస్తే భాజపా కంటే ఎక్కువ వచ్చాయని వల్సాద్ అభ్యర్థి అనంత్ పటేల్ చెబుతున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలోని పలు అంశాలు తమ విజయానికి దోహదం చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులు, జింక్ స్మెల్టర్ ప్రాజెక్టు కోసం తమ భూములను సేకరించడంపై గిరిజనులు ఆగ్రహంగా ఉన్నారని ఆయన అంటున్నారు.
రెండు చోట్ల ఆప్ పోటీ
పొత్తులో భాగంగా భరూచ్, భావ్నగర్ సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఇచ్చింది. భరూచ్ జనరల్ నియోజకవర్గమైనా భాజపా, ఆప్-కాంగ్రెస్ కూటములు గిరిజన అభ్యర్థులకే టికెట్లిచ్చాయి. భాజపా తరఫున సిటింగ్ ఎంపీ మన్సుఖ్ వసావానే బరిలోకి దిగారు. ఆప్ తరఫున డేడియాపాడా ఎమ్మెల్యే చైతర్ వసావా పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
విశాఖలో జరిగింది చిన్న సంఘటనే
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. -
తెదేపాకు ఓటేయాలన్నందుకు.. దంపతులపై దాడి
తెదేపాకు ఓటేయాలని చెప్పినందుకు కర్నూలు జిల్లా కోడుమూరు ఇంద్రజిత్గుప్తా నగర్కు చెందిన దంపతులపై గురువారం రాత్రి దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?