కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి.
భారాసకు ప్రతిష్ఠాత్మకంగా పార్లమెంటు పోరు
ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం
చేవెళ్లలో బహిరంగ సభతో కేసీఆర్ శంఖారావం
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర సీనియర్ నేతలతోనూ ప్రచారం హోరెత్తించాలని పార్టీ సంకల్పించింది.
నాలుగంచెల సమావేశాలు..
ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నెల 13 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస నిర్ణయించింది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా కూడా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం శాసనసభ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే చేవెళ్ల, మల్కాజిగిరిలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో ప్రకటించనుంది.
కేసీఆర్ సభలు, బస్సుయాత్రలు
పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం 15 లేదా 16 తేదీల్లో మెదక్లో నిర్వహించే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల గుండా సాగేలా బస్సు యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, కేటీఆర్, హరీశ్రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్, భాజపాల పాలనలోని లోపాలపై...
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఆది నుంచి ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై అనుసరించిన వైఖరి సరికాదన్న అంశాలను ప్రచారంలో ఎలుగెత్తి చాటాలని భారాస భావిస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించనుంది. ఇప్పటికే భారాస అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, యాదాద్రి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తమ పదేళ్ల పాలన తీరును పోల్చిచూసి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు విభజన హామీలను అమలు చేయకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులేవీ ఇవ్వకపోవడం వంటి అంశాలతో భాజపాను ఇరకాటంలో పెట్టాలని భారాస భావిస్తోంది. త్రిముఖ పోటీలో ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్, భాజపాల మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూ.. ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెశ్లాలని, అది పరోక్షంగా తమకు లాభిస్తుందని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ