మమత X మోదీ
సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఉత్కంఠ రేపుతున్న బెంగాల్ బరి
కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రమే
కోల్కతా నుంచి నీరేంద్ర దేవ్
సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది. వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా తలపడుతుండటంతో బెంగాల్ ఎటు మొగ్గుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మోదీకి భద్రలోక్ల మద్దతు
బెంగాల్లో ఉన్నత స్థాయి వర్గంగా గుర్తింపు పొందిన భద్రలోక్లు మోదీకి గట్టి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనను వారు దేశంలో బలమైన నేతగా గుర్తిస్తున్నారు. దీంతోపాటు హిందుత్వ ఎజెండా బలాన్నిస్తోంది.
ఫైటర్ మమత
మమతా బెనర్జీ భాజపాకు దీటుగా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అధికారం ఒక్కరి వద్దే కేంద్రీకృతం కావడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీశాఖల ద్వారా అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా దిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఏకంగా తృణమూల్ ధర్నాకు దిగింది. దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేసింది.
సందేశ్ఖాలీతో ఆందోళన
మమతను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది సందేశ్ఖాలీలో చోటుచేసుకున్న ఘటనే. అక్కడి మహిళలను ముస్లిం వర్గానికి చెందిన తృణమూల్ నేత షాజహాన్ షేక్ లైంగికంగా వేధించడం, దాడులు చేయడం భాజపాకు కలిసి వచ్చేలా చేసింది. దీనివల్ల హిందువుల ఓట్ల స్థిరీకరణ జరిగిందని భాజపా భావిస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో మమత సర్కారు జాప్యం చేయడంద్వారా ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేసిందన్న విమర్శలను ఎదుర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్, లెఫ్ట్, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) కూడా తృణమూల్పై విమర్శలు గుప్పించాయి. సందేశ్ఖాలీ ప్రాంతం వచ్చే బశీర్హాట్ నియోజకవర్గంలో వేధింపులకు ఎదురుతిరిగి షాజహాన్ షేక్పై కేసు పెట్టిన రేఖా పాత్రను భాజపా నిలిపి సవాలు విసిరింది.
ఎర్రకోటకు బీటలు
- ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట 2006 నుంచి బీటలు వారడం ప్రారంభమైంది. ఆ ఏడాదిలో 37శాతం ఉన్న ఓటు షేరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ హవాను ఎలా అడ్డుకోవాలో తెలియక లెఫ్ట్ సతమతమవుతోంది.
- 2004లో లెఫ్ట్కు లోక్సభలో 59 మంది సభ్యులున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే సీపీఎం 26 సీట్లలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో లెఫ్ట్ మొత్తం 35 సీట్లను గెలుచుకుంది. పార్టీ నేత సోమనాథ్ ఛటర్జీ స్పీకరుగా ఎన్నికయ్యారు. యూపీఏకు లెఫ్ట్ అప్పట్లో మద్దతిచ్చింది. మన్మోహన్ ప్రధాని అయ్యారు.
క్షేత్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాలు
- తృణమూల్ ప్రభుత్వంపై వ్యతిరేకతను భాజపా సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.
- మమత అవకాశ వాదంపట్ల ఉత్తర బెంగాల్, జల్పాయ్గురి, దార్జీలింగ్ ప్రాంతాల్లోని ప్రజలు విరక్తిగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె రాష్ట్ర విభజన కోరుతున్న గూర్ఖా జనముఖి మోర్చాతో జట్టు కట్టారు.
- శిలిగుడి, ఉత్తర బెంగాల్లోని మాల్దాల్లో జరిగిన మమత ర్యాలీలు విజయవంతం కాలేదు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్గానీ, భాజపాగానీ బలం పుంజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
- బీర్భుమ్ లాంటి జిల్లాల్లో భాజపాకు మద్దతు పెరుగుతోంది. మమత ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది.
- బీర్భుమ్, బోల్పుర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో భాజపా 5 లక్షలకుపైగా ఓట్లను సాధించింది.
ఈ ఎన్నికలు ముఖ్యమే
పలు సర్వేల్లో భాజపాదే పైచేయి అని వెల్లడి కావడం మమతకు కాస్త ఇబ్బందికరమే. అందునా ఆమెకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. 2019లో భాజపా 18 సీట్లను గెలుచుకుంది. కానీ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. ఈసారి భాజపా 22 నుంచి 25 సీట్లు గెలుచుకుంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు ఇబ్బందులు తప్పవు.
సీఏఏ
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని మార్చి 11న మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది. ఇందులో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీలు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. ముస్లింలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. బెంగాల్లో ఉన్న హిందూ వర్గానికి చెందిన మతువాలకు భారీ ఎత్తున పౌరసత్వం లభించనుంది. వారంతా తమకు మద్దతు పలుకుతారని భాజపా ఆశిస్తోంది. వారు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు.
ముఖ్యమైన నియోజకవర్గాలు
- డైమండ్ హార్బర్లో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు.
- అసన్సోల్లో బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా బరిలో ఉన్నారు.
- తమ్లుక్లో భాజపా తరఫున స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజీత్ బెనర్జీ తలపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్