మమత X మోదీ
సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఉత్కంఠ రేపుతున్న బెంగాల్ బరి
కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రమే
కోల్కతా నుంచి నీరేంద్ర దేవ్
సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కాంగ్రెస్, లెఫ్ట్ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది. వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా తలపడుతుండటంతో బెంగాల్ ఎటు మొగ్గుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మోదీకి భద్రలోక్ల మద్దతు
బెంగాల్లో ఉన్నత స్థాయి వర్గంగా గుర్తింపు పొందిన భద్రలోక్లు మోదీకి గట్టి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనను వారు దేశంలో బలమైన నేతగా గుర్తిస్తున్నారు. దీంతోపాటు హిందుత్వ ఎజెండా బలాన్నిస్తోంది.
ఫైటర్ మమత
మమతా బెనర్జీ భాజపాకు దీటుగా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అధికారం ఒక్కరి వద్దే కేంద్రీకృతం కావడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీశాఖల ద్వారా అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా దిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఏకంగా తృణమూల్ ధర్నాకు దిగింది. దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేసింది.
సందేశ్ఖాలీతో ఆందోళన
మమతను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది సందేశ్ఖాలీలో చోటుచేసుకున్న ఘటనే. అక్కడి మహిళలను ముస్లిం వర్గానికి చెందిన తృణమూల్ నేత షాజహాన్ షేక్ లైంగికంగా వేధించడం, దాడులు చేయడం భాజపాకు కలిసి వచ్చేలా చేసింది. దీనివల్ల హిందువుల ఓట్ల స్థిరీకరణ జరిగిందని భాజపా భావిస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో మమత సర్కారు జాప్యం చేయడంద్వారా ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేసిందన్న విమర్శలను ఎదుర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్, లెఫ్ట్, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) కూడా తృణమూల్పై విమర్శలు గుప్పించాయి. సందేశ్ఖాలీ ప్రాంతం వచ్చే బశీర్హాట్ నియోజకవర్గంలో వేధింపులకు ఎదురుతిరిగి షాజహాన్ షేక్పై కేసు పెట్టిన రేఖా పాత్రను భాజపా నిలిపి సవాలు విసిరింది.
ఎర్రకోటకు బీటలు
- ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట 2006 నుంచి బీటలు వారడం ప్రారంభమైంది. ఆ ఏడాదిలో 37శాతం ఉన్న ఓటు షేరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ హవాను ఎలా అడ్డుకోవాలో తెలియక లెఫ్ట్ సతమతమవుతోంది.
- 2004లో లెఫ్ట్కు లోక్సభలో 59 మంది సభ్యులున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే సీపీఎం 26 సీట్లలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో లెఫ్ట్ మొత్తం 35 సీట్లను గెలుచుకుంది. పార్టీ నేత సోమనాథ్ ఛటర్జీ స్పీకరుగా ఎన్నికయ్యారు. యూపీఏకు లెఫ్ట్ అప్పట్లో మద్దతిచ్చింది. మన్మోహన్ ప్రధాని అయ్యారు.
క్షేత్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాలు
- తృణమూల్ ప్రభుత్వంపై వ్యతిరేకతను భాజపా సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.
- మమత అవకాశ వాదంపట్ల ఉత్తర బెంగాల్, జల్పాయ్గురి, దార్జీలింగ్ ప్రాంతాల్లోని ప్రజలు విరక్తిగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె రాష్ట్ర విభజన కోరుతున్న గూర్ఖా జనముఖి మోర్చాతో జట్టు కట్టారు.
- శిలిగుడి, ఉత్తర బెంగాల్లోని మాల్దాల్లో జరిగిన మమత ర్యాలీలు విజయవంతం కాలేదు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్గానీ, భాజపాగానీ బలం పుంజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
- బీర్భుమ్ లాంటి జిల్లాల్లో భాజపాకు మద్దతు పెరుగుతోంది. మమత ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది.
- బీర్భుమ్, బోల్పుర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో భాజపా 5 లక్షలకుపైగా ఓట్లను సాధించింది.
ఈ ఎన్నికలు ముఖ్యమే
పలు సర్వేల్లో భాజపాదే పైచేయి అని వెల్లడి కావడం మమతకు కాస్త ఇబ్బందికరమే. అందునా ఆమెకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. 2019లో భాజపా 18 సీట్లను గెలుచుకుంది. కానీ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. ఈసారి భాజపా 22 నుంచి 25 సీట్లు గెలుచుకుంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు ఇబ్బందులు తప్పవు.
సీఏఏ
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని మార్చి 11న మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది. ఇందులో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీలు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. ముస్లింలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. బెంగాల్లో ఉన్న హిందూ వర్గానికి చెందిన మతువాలకు భారీ ఎత్తున పౌరసత్వం లభించనుంది. వారంతా తమకు మద్దతు పలుకుతారని భాజపా ఆశిస్తోంది. వారు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు.
ముఖ్యమైన నియోజకవర్గాలు
- డైమండ్ హార్బర్లో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు.
- అసన్సోల్లో బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా బరిలో ఉన్నారు.
- తమ్లుక్లో భాజపా తరఫున స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజీత్ బెనర్జీ తలపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. -
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు మాయం కావడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్ మండిపడ్డారు. -
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
సంపన్న కుటుంబంలో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవని రాహుల్, అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. -
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
బెంగళూరు రేవ్పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడ ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. -
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. -
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. -
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. -
పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి మృతి
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్