భాజపా మూడోసారా.. కాంగ్రెస్ ఖాతా తెరవడమా?
లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్పై కాషాయ జెండా మరోసారి రెపరెపలాడి భాజపా హ్యాట్రిక్ కొట్టనుందా.. కాంగ్రెస్ పార్టీ దానిని నిలువరించి ఖాతా తెరవనుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్లో కీలక పోరు
గత 2 ఎన్నికల్లో కమలం క్లీన్స్వీప్
జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ
లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్పై కాషాయ జెండా మరోసారి రెపరెపలాడి భాజపా హ్యాట్రిక్ కొట్టనుందా.. కాంగ్రెస్ పార్టీ దానిని నిలువరించి ఖాతా తెరవనుందా.. అనేది ఆసక్తికరంగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలనూ భాజపా గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. తొలిసారి గెలిచినప్పుడు రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు అశోక్ గహ్లోత్ సీఎంగా ఉన్నారు.
5 లక్షల మెజారిటీ లక్ష్యంగా..
రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 5 లక్షల మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో భాజపా ప్రచారానికి దిగింది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ క్రియాశీలంగా ప్రచారం చేస్తూ హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేసి లక్షల ఓట్ల మెజారిటీని అందించాలని కోరుతున్నారు.
పోటీకి కాంగ్రెస్ సీనియర్ల విముఖత
పోటీ దగ్గరే కాంగ్రెస్లో నిస్తేజం ఆవరించినట్లు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి సీనియర్లంతా ముఖం చాటేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వారంతా దూరం జరిగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మొదలు
గత ఏడాది ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత భాజపాలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా దాదాపు 8,000 మంది నేతలు కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
ముఖాముఖి పోరే
రాజస్థాన్లో దాదాపుగా ముఖాముఖి పోరే నెలకొంది. భాజపా, కాంగ్రెస్లే ప్రధాన ప్రత్యర్థులు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, హనుమాన్ బేణీవాల్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఉన్నా నామమాత్రమే. నాగౌర్లో బేణీవాల్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థిని నిలపలేదు.
బాంస్వాఢా-దుంగార్పుర్లో భారతీయ ఆదివాసీ పార్టీకి (బీఏపీ) కాంగ్రెస్ మద్దతిస్తోంది. ఇక్కడ బీఏపీ తరఫున రాజ్ కుమార్ రోత్, భాజపా తరఫున రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్ మాలవీయ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ రెబల్గా అర్వింద్ దామోర్ పోటీ చేస్తున్నారు. ఆయనతో నామినేషన్ ఉపసంహరింపజేయాలనే పార్టీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ గుర్తు లభించింది. ఉపసంహరణ సమయానికి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీని వెనుక భాజపా హస్తముందనే ఆరోపణలొచ్చాయి.
5 చోట్ల గట్టి పోటీ
రాష్ట్రంలోని 25 స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. చురు, ఝుంఝునూ, కరౌలీ-ధౌల్పుర్, టోంక్-సవాయీ మాధోపుర్, బాడ్మేర్లలో కాంగ్రెస్ పోరాడుతోంది.
చురులో రెండు సార్లు గెలిచిన రాహుల్ కాస్వాను ఈ సారి భాజపా తప్పించింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నారు. రాహుల్ తండ్రి రాంసింగ్ కాస్వా అంతకుముందు రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?