కన్నడిగుల కనికరమెవరికి?
కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది.
భాజపా దూకుడుకు కళ్లెం పడేనా..
సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్
ఇరుపక్షాల మధ్య మహా సమరం
ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది. అదే సమయంలో ఆ అవకాశమే ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలని కమలనాథులు- దళపతులు పోరాడుతున్నారు. గత 5 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాల్లో గెలిచింది లేదు. 1999 ఎన్నికల్లో సాధించిన 18 స్థానాలే 25 ఏళ్లుగా కాంగ్రెస్ అందుకున్న అతి పెద్ద విజయం. 1984లో తొలిసారిగా లోక్సభకు భాజపా పోటీ చేసినా 1991 ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది. ఆ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన భాజపా.. కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓట్లను కొల్లగొట్టిన పార్టీగా అవతరించింది. అప్పటి నుంచి భాజపా రాష్ట్రంలో అటు కాంగ్రెస్ను, ఇటు జనతాదళ్ల ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ 2019 నాటికి అత్యధిక స్థానాల్లో (25) విజయంతో రికార్డు సృష్టించింది. ఈసారి ఇదే మార్కు విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న కమల దళానికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
కలిసొచ్చిన పొత్తు..
భాజపాకు రాష్ట్రంలో జనతాదళ్తో పొత్తు ఎంతగానో కలిసొచ్చే అంశం. 1997లో జనతాదళ్ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీగా ఏర్పడిన లోక్శక్తితో చేయి కలిపిన భాజపా 1998 ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పొత్తు కారణంగా భాజపా రాష్ట్రంలో తొలిసారిగా రెండంకెల స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 18 చోట్ల, లోక్శక్తి 10 చోట్ల పోటీ చేయగా భాజపా అత్యధికంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఆపై 1999 ఎన్నికల్లో జేడీయూతో కలిసి 7 స్థానాల్లో, 2004లో ఇదే పార్టీతో కలిసి 18 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా 19, 17, 25 స్థానాల్లో గెలిచిన భాజపాకు ఇన్నేళ్లకు పొత్తు అవసరం ఏర్పడింది. అదీ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగానే. జనతాదళ్ నుంచి విడిపోయి మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి.దేవెగౌడ నేతృత్వంలో ఏర్పడిన జేడీఎస్తో తొలిసారిగా భాజపా చేయి కలిపింది. ఈ ఎన్నికల్లో భాజపా 25 చోట్ల, జేడీఎస్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి.
గట్టి వ్యూహంతో భాజపా
2019 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.36 శాతాన్ని భాజపా రాబట్టుకుంది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 51.6 శాతం ఓట్ల శాతం తర్వాత ఇదే అత్యధికం. 2024 ఎన్నికలను ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎదుర్కొంటున్న భాజపాకు కర్ణాటకలో సాధించే స్థానాలు ఎంతో కీలకం. 2019 ఎన్నికల్లో దక్షిణాది 5 రాష్ట్రాల్లో కేవలం 35 స్థానాల్లోనే గెలిచిన భాజపా ఈసారి వాటి సంఖ్యను 50కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్కులో కనీసం సగం స్థానాలను సాధించే అవకాశం ఒక్క కర్ణాటక నుంచే సాధ్యం. ఇందు కోసం గతంలో సాధించిన ఓట్ల శాతాన్ని 60కి చేరుస్తూ గత స్థానాలను యథావిధిగా కొల్లగొట్టాలని భాజపా అధిష్ఠానం రాష్ట్ర శ్రేణులను ఆదేశించింది. అయితే ఈసారి 25 స్థానాల మార్కు సాధించడం అనుకున్నంత సులువు కాదని రాష్ట్ర నాయకులు దిల్లీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు కారణం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గతంలో మాదిరిగా బలహీనంగా లేదు. గత విధానసభ ఎన్నికల్లో 135 స్థానాలతో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. పైగా.. ఆ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుగులేని నాయకత్వాన్ని అందిస్తున్నారు. వీరిని ఎదుర్కొని 25 స్థానాలను అందుకోవాలంటే పొత్తు తప్పదని భాజపా నిర్ణయించింది.
వైభవం కోసం..
1999 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మొదలైన నాటి నుంచి పొత్తుల కోసం ఏనాడూ కన్నెత్తి చూడని కాంగ్రెస్ 2019లో అనివార్యంగా జేడీఎస్తో చేయి కలిపింది. ఆ ఎన్నికల్లో చరిత్రలో చూడని పరాభవాన్ని ఎదుర్కొంది. జేడీఎస్కు 9 స్థానాలిచ్చిన కాంగ్రెస్ 19 చోట్ల పోటీ చేసి ఒకే ఒక స్థానంలో గెలవగలిగింది. తాజా విధాన సభలో సాధించిన ఘన విజయం నుంచి ఈ పరాభవాన్ని మరచిపోయినా పార్టీకి జాతీయ స్థాయిలో మళ్లీ పట్టు సాధించి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. అందు కోసం ఈసారి యువకులు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 40 ఏళ్లలోపు వారు 10 మంది, డిగ్రీ ఆపై విద్యార్హతలున్నవారు 12 మంది బరిలో దిగగా.. మహిళలకు ఆరు టికెట్లు కేటాయించింది.
భాజపా బలం
మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగ ఓట్లను జేడీఎస్ సహకారంతో రాబట్టే అవకాశం. విధానసభ ఎన్నికల సమయంలో దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు మళ్లీ బాధ్యతలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం.
బలహీనతలు: రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, 12మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడం. తిరుగుబాటు అభ్యర్థులు. కేఎస్.ఈశ్వరప్ప, సి.టి.రవి, అనంతకుమార్ హెగ్డే, డి.వి.సదానందగౌడ వంటి సీనియర్ల నుంచి అసమ్మతి. జేడీఎస్తో పొత్తు కారణంగా అహింద ఓట్లకు దూరమయ్యే ప్రమాదం.
కాంగ్రెస్ బలం
అధికారంలో ఉండడం, ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం. 135 నియోజకవర్గాల్లో బలమైన కార్యకర్తల మద్దతు. భాజపాతో జేడీఎస్ పొత్తు కారణంగా అహింద (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) ఓట్లను గుంపగుత్తగా సాధించే అవకాశం. కీలకమైన సమూహాలకు నాయకత్వం. యువతరం. వారసులకు టికెట్లు కేటాయించడం.
బలహీనతలు: జిల్లాల ఫలితాలను శాసించే నేతల అసమ్మతి. జాతీయ నాయకత్వంపై విశ్వసనీయత లేకపోవడం. ఈ ఎన్నికల తర్వాత గ్యారంటీలు తొలగిస్తారన్న ప్రచారం. రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ అంశాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే