కన్నడిగుల కనికరమెవరికి?
కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది.
భాజపా దూకుడుకు కళ్లెం పడేనా..
సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్
ఇరుపక్షాల మధ్య మహా సమరం
ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది. అదే సమయంలో ఆ అవకాశమే ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలని కమలనాథులు- దళపతులు పోరాడుతున్నారు. గత 5 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాల్లో గెలిచింది లేదు. 1999 ఎన్నికల్లో సాధించిన 18 స్థానాలే 25 ఏళ్లుగా కాంగ్రెస్ అందుకున్న అతి పెద్ద విజయం. 1984లో తొలిసారిగా లోక్సభకు భాజపా పోటీ చేసినా 1991 ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది. ఆ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన భాజపా.. కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓట్లను కొల్లగొట్టిన పార్టీగా అవతరించింది. అప్పటి నుంచి భాజపా రాష్ట్రంలో అటు కాంగ్రెస్ను, ఇటు జనతాదళ్ల ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ 2019 నాటికి అత్యధిక స్థానాల్లో (25) విజయంతో రికార్డు సృష్టించింది. ఈసారి ఇదే మార్కు విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న కమల దళానికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
కలిసొచ్చిన పొత్తు..
భాజపాకు రాష్ట్రంలో జనతాదళ్తో పొత్తు ఎంతగానో కలిసొచ్చే అంశం. 1997లో జనతాదళ్ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీగా ఏర్పడిన లోక్శక్తితో చేయి కలిపిన భాజపా 1998 ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పొత్తు కారణంగా భాజపా రాష్ట్రంలో తొలిసారిగా రెండంకెల స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 18 చోట్ల, లోక్శక్తి 10 చోట్ల పోటీ చేయగా భాజపా అత్యధికంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఆపై 1999 ఎన్నికల్లో జేడీయూతో కలిసి 7 స్థానాల్లో, 2004లో ఇదే పార్టీతో కలిసి 18 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా 19, 17, 25 స్థానాల్లో గెలిచిన భాజపాకు ఇన్నేళ్లకు పొత్తు అవసరం ఏర్పడింది. అదీ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగానే. జనతాదళ్ నుంచి విడిపోయి మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి.దేవెగౌడ నేతృత్వంలో ఏర్పడిన జేడీఎస్తో తొలిసారిగా భాజపా చేయి కలిపింది. ఈ ఎన్నికల్లో భాజపా 25 చోట్ల, జేడీఎస్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి.
గట్టి వ్యూహంతో భాజపా
2019 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.36 శాతాన్ని భాజపా రాబట్టుకుంది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 51.6 శాతం ఓట్ల శాతం తర్వాత ఇదే అత్యధికం. 2024 ఎన్నికలను ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎదుర్కొంటున్న భాజపాకు కర్ణాటకలో సాధించే స్థానాలు ఎంతో కీలకం. 2019 ఎన్నికల్లో దక్షిణాది 5 రాష్ట్రాల్లో కేవలం 35 స్థానాల్లోనే గెలిచిన భాజపా ఈసారి వాటి సంఖ్యను 50కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్కులో కనీసం సగం స్థానాలను సాధించే అవకాశం ఒక్క కర్ణాటక నుంచే సాధ్యం. ఇందు కోసం గతంలో సాధించిన ఓట్ల శాతాన్ని 60కి చేరుస్తూ గత స్థానాలను యథావిధిగా కొల్లగొట్టాలని భాజపా అధిష్ఠానం రాష్ట్ర శ్రేణులను ఆదేశించింది. అయితే ఈసారి 25 స్థానాల మార్కు సాధించడం అనుకున్నంత సులువు కాదని రాష్ట్ర నాయకులు దిల్లీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు కారణం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గతంలో మాదిరిగా బలహీనంగా లేదు. గత విధానసభ ఎన్నికల్లో 135 స్థానాలతో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. పైగా.. ఆ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుగులేని నాయకత్వాన్ని అందిస్తున్నారు. వీరిని ఎదుర్కొని 25 స్థానాలను అందుకోవాలంటే పొత్తు తప్పదని భాజపా నిర్ణయించింది.
వైభవం కోసం..
1999 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మొదలైన నాటి నుంచి పొత్తుల కోసం ఏనాడూ కన్నెత్తి చూడని కాంగ్రెస్ 2019లో అనివార్యంగా జేడీఎస్తో చేయి కలిపింది. ఆ ఎన్నికల్లో చరిత్రలో చూడని పరాభవాన్ని ఎదుర్కొంది. జేడీఎస్కు 9 స్థానాలిచ్చిన కాంగ్రెస్ 19 చోట్ల పోటీ చేసి ఒకే ఒక స్థానంలో గెలవగలిగింది. తాజా విధాన సభలో సాధించిన ఘన విజయం నుంచి ఈ పరాభవాన్ని మరచిపోయినా పార్టీకి జాతీయ స్థాయిలో మళ్లీ పట్టు సాధించి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. అందు కోసం ఈసారి యువకులు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 40 ఏళ్లలోపు వారు 10 మంది, డిగ్రీ ఆపై విద్యార్హతలున్నవారు 12 మంది బరిలో దిగగా.. మహిళలకు ఆరు టికెట్లు కేటాయించింది.
భాజపా బలం
మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగ ఓట్లను జేడీఎస్ సహకారంతో రాబట్టే అవకాశం. విధానసభ ఎన్నికల సమయంలో దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు మళ్లీ బాధ్యతలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం.
బలహీనతలు: రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, 12మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడం. తిరుగుబాటు అభ్యర్థులు. కేఎస్.ఈశ్వరప్ప, సి.టి.రవి, అనంతకుమార్ హెగ్డే, డి.వి.సదానందగౌడ వంటి సీనియర్ల నుంచి అసమ్మతి. జేడీఎస్తో పొత్తు కారణంగా అహింద ఓట్లకు దూరమయ్యే ప్రమాదం.
కాంగ్రెస్ బలం
అధికారంలో ఉండడం, ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం. 135 నియోజకవర్గాల్లో బలమైన కార్యకర్తల మద్దతు. భాజపాతో జేడీఎస్ పొత్తు కారణంగా అహింద (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) ఓట్లను గుంపగుత్తగా సాధించే అవకాశం. కీలకమైన సమూహాలకు నాయకత్వం. యువతరం. వారసులకు టికెట్లు కేటాయించడం.
బలహీనతలు: జిల్లాల ఫలితాలను శాసించే నేతల అసమ్మతి. జాతీయ నాయకత్వంపై విశ్వసనీయత లేకపోవడం. ఈ ఎన్నికల తర్వాత గ్యారంటీలు తొలగిస్తారన్న ప్రచారం. రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ అంశాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే