కొంగు చాచి అడుగుతున్నా.. న్యాయం చేయండి
‘నాలుగు రోజులుగా నేను వైయస్ఆర్ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు.
ఆడబిడ్డలం పోరాడుతున్నాం..
ప్రజలకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గద్గద స్వరంతో పిలుపు
సభలను వైకాపా అడ్డుకున్నా భారీగా తరలివచ్చిన జనం
ఈనాడు, కడప: ‘నాలుగు రోజులుగా నేను వైయస్ఆర్ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. అంటే అవినాష్రెడ్డి హంతకుడని జగన్.. విశ్వసిస్తున్నట్లే కదా?’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైయస్ఆర్ జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రాత్రి పులివెందులలోని పూలంగళ్ల కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అభ్యర్థిని ఉంచినా.. మార్చినా ప్రజలకు మాత్రం సీఎం జగన్ సమాధానం మాత్రం చెప్పాల్సిందేనన్నారు. అయిదేళ్లుగా హంతకులను ఎందుకు కాపాడుతున్నారో వివరణ ఇవ్వాలన్నారు. వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఈ సభలకు ఎవరూ వెళ్లొద్దంటూ నేతలు చెప్పినా జనం స్వచ్ఛందంగా హాజరుకావడంతో పాటు భావోద్వేగంతో ఆమె చెప్పిన మాటలను ఎంతో ఒపిగ్గా విన్నారు. పులివెందుల గడ్డపై నిల్చుని ఆమె నేరుగా జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు ‘ఈ పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధానిని కూడా కట్టలేకపోయారు. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇన్నాళ్లూ కోటలో నిద్రపోయారు. ఇప్పుడు కుంభకర్ణుడులా నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. అయిదేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అని దుయ్యబట్టారు. ‘వివేకా హత్య కేసులో సునీత ఎంతో బాధపడింది. చిన్నమ్మ బాగా నష్టపోయారు. చిన్నాన్న విషయంలో న్యాయం చేయకపోతే మనం ఎందుకని అనుకున్నా. న్యాయం వైపు నిలబడాలని పోరాడుతున్నా. హంతకులెవ్వరన్నది.. సీబీఐ స్పష్టంగా తేల్చింది. జగన్ అడ్డుపడడం వల్ల సీబీఐ సైతం అవినాష్రెడ్డిని ఏమీ చేయలేకపోయింది’ అని ఆమె నిప్పులు చెరిగారు.
పర్యటన అడ్డుకోడానికి వైకాపా యత్నం
పులివెందుల నియోజకవర్గంలో షర్మిల, సునీతల పర్యటనను వైకాపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల సభలకు వెళ్లొద్దంటూ ప్రజలకు సూచనలు చేశారు. లింగాలలో షర్మిల ప్రసంగానికి అడ్డుతగిలి ‘జైజగన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుని సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వైకాపా నేతలను ఉద్దేశించి షర్మిల మండిపడ్డారు. ‘మీరు ఎంతైనా అరుచుకోండి.. మాకేం అభ్యంతరం లేదంటూ’ ఆగ్రహం వ్యక్తంచేశారు. లింగాల, సింహాద్రిపురం సభలో సునీత మాట్లాడుతూ.. పులివెందుల్లో జరిగే సభకు అవినాష్రెడ్డి వచ్చి తాను వివేకాను హత్య చేయలేదని ప్రజల మధ్య చెప్పాలని.. అప్పుడునిజమేమిటో తేలుతుందని అన్నారు.
షర్మిల భావోద్వేగ ప్రసంగం
పుట్టి పెరిగిన పులివెందులలో జరిగిన సభల్లో షర్మిల పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. వివేకా హత్యను ప్రస్తావించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. నేను వైఎస్ఆర్ బిడ్డను.. మీ బిడ్డను.. రాజన్న తరహాలో సేవ చేస్తా.. మీ గొంతును దిల్లీ దాకా వినిపిస్తా.. నన్ను ఆదరించండి’ అంటూ విన్నవించారు. ఇద్దరు ఆడబిడ్డల్ని చూడటానికి రహదారుల వెంట జనం బారులుతీరారు. పులివెందుల సభకు మహిళలు భారీగా తరలివచ్చారు. జనాన్ని నిఘా వర్గాలు చిత్రీకరించడం కనిపించింది.
‘కొంగు చాచి అడుగుతున్నా. వివేకా హత్య కేసులో న్యాయం చేయండి. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ రాజశేఖర్రెడ్డి బిడ్డ నిలబడింది.. మరోవైపు హంతకుడు పోటీలో ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది.. మరోవైపు అన్యాయం ఉంది. రాజన్న బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసులో నిందితుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి. ప్రజలు అధికారం ఇస్తే.. అవినాష్రెడ్డిని రక్షించడానికే వినియోగించుకున్నారు. అన్నీ ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోమని వేడుకుంటున్నాం’
పులివెందుల సభలో ప్రజలకు షర్మిల విజ్ఞప్తి
‘2019 మార్చి 15న నా తండ్రి హత్య జరిగింది. ఈ విషయంపై ఫోన్ రాగానే హైదరాబాద్ నుంచి బయలుదేరాం. కొంత సమయానికే మళ్లీ ఫోన్ వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పారు. పులివెందుల ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని చూడగా.. తల పగిలిపోయింది. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం కోరా. జగనన్న సీఎం అయ్యాక వెళ్లి కలిశా. సీఎంగా ఉండి.. దోషులకు శిక్ష వేయకపోతే తనకు అవమానమని చెప్పారు. అప్పుడు జగన్ను నమ్మాను. కాలం గడుస్తోంది. కేసు ఎటూ తేలలేదు. ఇంటి వారిపైనే అనుమానం ఉంది.. సీబీఐ విచారణ కోరదామని రెండోసారి జగనన్న దగ్గరకు వెళ్లా. సీబీఐ విచారణ కోరితే నాపై 12వ కేసు అవుతుంది. అవినాష్రెడ్డి భాజపాలో చేరిపోతాడట. ఇక ఆ మాటెత్తొద్దు అని జగనన్న అన్నారు. అందుకే నేను స్వయంగా వెళ్లి కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరాల్సి వచ్చింది’.
వివేకా కుమార్తె సునీత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్