కొంగు చాచి అడుగుతున్నా.. న్యాయం చేయండి
‘నాలుగు రోజులుగా నేను వైయస్ఆర్ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు.
ఆడబిడ్డలం పోరాడుతున్నాం..
ప్రజలకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గద్గద స్వరంతో పిలుపు
సభలను వైకాపా అడ్డుకున్నా భారీగా తరలివచ్చిన జనం
ఈనాడు, కడప: ‘నాలుగు రోజులుగా నేను వైయస్ఆర్ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. అంటే అవినాష్రెడ్డి హంతకుడని జగన్.. విశ్వసిస్తున్నట్లే కదా?’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైయస్ఆర్ జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రాత్రి పులివెందులలోని పూలంగళ్ల కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అభ్యర్థిని ఉంచినా.. మార్చినా ప్రజలకు మాత్రం సీఎం జగన్ సమాధానం మాత్రం చెప్పాల్సిందేనన్నారు. అయిదేళ్లుగా హంతకులను ఎందుకు కాపాడుతున్నారో వివరణ ఇవ్వాలన్నారు. వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఈ సభలకు ఎవరూ వెళ్లొద్దంటూ నేతలు చెప్పినా జనం స్వచ్ఛందంగా హాజరుకావడంతో పాటు భావోద్వేగంతో ఆమె చెప్పిన మాటలను ఎంతో ఒపిగ్గా విన్నారు. పులివెందుల గడ్డపై నిల్చుని ఆమె నేరుగా జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు ‘ఈ పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధానిని కూడా కట్టలేకపోయారు. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇన్నాళ్లూ కోటలో నిద్రపోయారు. ఇప్పుడు కుంభకర్ణుడులా నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. అయిదేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అని దుయ్యబట్టారు. ‘వివేకా హత్య కేసులో సునీత ఎంతో బాధపడింది. చిన్నమ్మ బాగా నష్టపోయారు. చిన్నాన్న విషయంలో న్యాయం చేయకపోతే మనం ఎందుకని అనుకున్నా. న్యాయం వైపు నిలబడాలని పోరాడుతున్నా. హంతకులెవ్వరన్నది.. సీబీఐ స్పష్టంగా తేల్చింది. జగన్ అడ్డుపడడం వల్ల సీబీఐ సైతం అవినాష్రెడ్డిని ఏమీ చేయలేకపోయింది’ అని ఆమె నిప్పులు చెరిగారు.
పర్యటన అడ్డుకోడానికి వైకాపా యత్నం
పులివెందుల నియోజకవర్గంలో షర్మిల, సునీతల పర్యటనను వైకాపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల సభలకు వెళ్లొద్దంటూ ప్రజలకు సూచనలు చేశారు. లింగాలలో షర్మిల ప్రసంగానికి అడ్డుతగిలి ‘జైజగన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుని సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వైకాపా నేతలను ఉద్దేశించి షర్మిల మండిపడ్డారు. ‘మీరు ఎంతైనా అరుచుకోండి.. మాకేం అభ్యంతరం లేదంటూ’ ఆగ్రహం వ్యక్తంచేశారు. లింగాల, సింహాద్రిపురం సభలో సునీత మాట్లాడుతూ.. పులివెందుల్లో జరిగే సభకు అవినాష్రెడ్డి వచ్చి తాను వివేకాను హత్య చేయలేదని ప్రజల మధ్య చెప్పాలని.. అప్పుడునిజమేమిటో తేలుతుందని అన్నారు.
షర్మిల భావోద్వేగ ప్రసంగం
పుట్టి పెరిగిన పులివెందులలో జరిగిన సభల్లో షర్మిల పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. వివేకా హత్యను ప్రస్తావించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. నేను వైఎస్ఆర్ బిడ్డను.. మీ బిడ్డను.. రాజన్న తరహాలో సేవ చేస్తా.. మీ గొంతును దిల్లీ దాకా వినిపిస్తా.. నన్ను ఆదరించండి’ అంటూ విన్నవించారు. ఇద్దరు ఆడబిడ్డల్ని చూడటానికి రహదారుల వెంట జనం బారులుతీరారు. పులివెందుల సభకు మహిళలు భారీగా తరలివచ్చారు. జనాన్ని నిఘా వర్గాలు చిత్రీకరించడం కనిపించింది.
‘కొంగు చాచి అడుగుతున్నా. వివేకా హత్య కేసులో న్యాయం చేయండి. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ రాజశేఖర్రెడ్డి బిడ్డ నిలబడింది.. మరోవైపు హంతకుడు పోటీలో ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది.. మరోవైపు అన్యాయం ఉంది. రాజన్న బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసులో నిందితుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి. ప్రజలు అధికారం ఇస్తే.. అవినాష్రెడ్డిని రక్షించడానికే వినియోగించుకున్నారు. అన్నీ ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోమని వేడుకుంటున్నాం’
పులివెందుల సభలో ప్రజలకు షర్మిల విజ్ఞప్తి
‘2019 మార్చి 15న నా తండ్రి హత్య జరిగింది. ఈ విషయంపై ఫోన్ రాగానే హైదరాబాద్ నుంచి బయలుదేరాం. కొంత సమయానికే మళ్లీ ఫోన్ వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పారు. పులివెందుల ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని చూడగా.. తల పగిలిపోయింది. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం కోరా. జగనన్న సీఎం అయ్యాక వెళ్లి కలిశా. సీఎంగా ఉండి.. దోషులకు శిక్ష వేయకపోతే తనకు అవమానమని చెప్పారు. అప్పుడు జగన్ను నమ్మాను. కాలం గడుస్తోంది. కేసు ఎటూ తేలలేదు. ఇంటి వారిపైనే అనుమానం ఉంది.. సీబీఐ విచారణ కోరదామని రెండోసారి జగనన్న దగ్గరకు వెళ్లా. సీబీఐ విచారణ కోరితే నాపై 12వ కేసు అవుతుంది. అవినాష్రెడ్డి భాజపాలో చేరిపోతాడట. ఇక ఆ మాటెత్తొద్దు అని జగనన్న అన్నారు. అందుకే నేను స్వయంగా వెళ్లి కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరాల్సి వచ్చింది’.
వివేకా కుమార్తె సునీత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే