పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమిటి
కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగాలి తప్ప శ్రీరాముని పేరిట అక్షింతలు, కుంకుమ ప్రజలకిచ్చి ఓట్లడుగుతూ దేవుడ్ని రాజకీయాల్లోకి లాగడమేమిటని ప్రశ్నించారు.
భాజపాకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు
మోదీ సర్కారు, భారాస ప్రభుత్వ వైఫల్యాలపై 14న కరీంనగర్లో దీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, న్యూస్టుడే: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగాలి తప్ప శ్రీరాముని పేరిట అక్షింతలు, కుంకుమ ప్రజలకిచ్చి ఓట్లడుగుతూ దేవుడ్ని రాజకీయాల్లోకి లాగడమేమిటని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలో గత భారాస ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడతానని, మిగతా జిల్లాల్లోనూ దీక్షలు చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు మెట్టు సాయికుమార్, సామ రామ్మోహన్రెడ్డిలతో కలిసి మంత్రి శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మోదీ తెలంగాణ ఏర్పాటును కించపరిచారు. అమరుల త్యాగాలను అవహేళన చేసి మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయలేదు. తెలంగాణకు చెందిన 7 మండలాలను, విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు అప్పగించారు. భాజపా బీసీలు, దళితులకు వ్యతిరేకం. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏంచేశారు? పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయని భాజపా, భారాస నేతలు.. 4 నెలల మా ప్రభుత్వాన్ని పట్టుకొని హామీల అమలు గురించి ప్రశ్నించడం సిగ్గుచేటు. హరీశ్రావు.. గతంలో భారాస ప్రభుత్వం రూ.3,016 నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్కార్డులు ఇచ్చినవారినే ఓట్లు అడగాలి. వర్షాభావ పరిస్థితులు భారాస అధికారంలో ఉన్నప్పుడే మొదలయ్యాయి. రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరి మీ హయాంలో కనీసం రూ.2,500 అయినా ఇచ్చారా? పంటనష్టంపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రండి. కేంద్రాన్ని పరిహారం అడుగుదాం’’ అని మంత్రి అన్నారు.
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి..
నాయీ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చాలని, నాయీ బ్రాహ్మణులకు గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన