మంచివాళ్లంతా ముందుకొచ్చారట.. వారికే ఓటేయాలట!
గుంటూరు లోక్సభ నియోజకవర్గం, అసెంబ్లీ స్థానాలకు వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను శుక్రవారం గుంటూరులో జరిగిన సభలో సీఎం జగన్ పరిచయం చేస్తూ.. ఉత్సాహవంతులని, సౌమ్యులని పరిచయం చేశారు.
అభ్యర్థులకు జగన్ కితాబులు
విస్తుపోయిన స్థానికులు
అక్రమాలు, దోపిడీలకు బాధ్యులెవరో చెప్పి ఓట్లు అడగాలంటున్న ప్రజలు
ఈనాడు, అమరావతి: గుంటూరు లోక్సభ నియోజకవర్గం, అసెంబ్లీ స్థానాలకు వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను శుక్రవారం గుంటూరులో జరిగిన సభలో సీఎం జగన్ పరిచయం చేస్తూ.. ఉత్సాహవంతులని, సౌమ్యులని పరిచయం చేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజని నిజంగా స్థానికురాలంటూ నొక్కి చెప్పారు. మంగళగిరి నుంచి స్థానికురాలు, ప్రజలకు అందుబాటులో ఉండే లావణ్య పోటీ చేస్తున్నారని చెప్పారు. మంచి చేయడానికి వీరంతా ముందుకొచ్చారని జగన్ చెప్పడంపై.. అవునా? వీరంతా అంత మంచివారా అని సీఎం ప్రసంగాన్ని విన్న స్థానికులు విస్తుపోతున్నారు.
కిలారు రోశయ్య సౌమ్యుడట!
గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య మంచివాడు, సౌమ్యుడని జగన్ కితాబిచ్చారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పరిచయం చేశారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న రోశయ్యకు ఓటేయమని అడిగే ముందు అయిదేళ్లుగా పొన్నూరు నియోజకవర్గాన్ని కొల్లగొట్టిన నేతలెవరో ఆయనకు తెలుసేమో కాస్త కనుక్కోండి జగన్.. అని ప్రజలు అడుగుతున్నారు. మట్టి, ఇసుక, రేషన్ దోపిడీ సంగతేంటో, అయిదేళ్లుగా రూ.వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో.. కాస్త మీ ‘సౌమ్యుడిని’ కనుక్కొని చెప్పండయ్యా అని కోరుతున్నారు. ‘పొన్నూరును రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డాగా మార్చి.. మాఫియాను పెంచి పోషించారు. దళిత యువకుడు అంజి బర్నబాస్ను కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసి.. అతి దారుణంగా హత్య చేయడంలో పాత్ర ఎవరిది? ప్రతి నెలా రూ.6లక్షల చొప్పున ముడుపులు తీసుకునేదెవరు? ఎర్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలతో రూ.వందల కోట్లు సంపాదించినదెవరు? ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఎవరికి అందుతున్నాయి. శేకూరులో వంద అడుగుల లోతులో క్వారీ చేసి దోచుకుంటోందెవరు? కొత్తగా చేపట్టే ప్రతి నిర్మాణానికీ అంతస్తుకు రూ.లక్ష చొప్పున రేటు కట్టిందెవరు? పేదల కోసం గత ప్రభుత్వం తెచ్చిన ఆదరణ పరికరాలను రూ.15 లక్షలకు అమ్ముకునేంత నీచానికి పాల్పడిందెవరు’ ఇవన్నీ చేసిందెవరో మీ మంచివాడిని ఆరా తీసి చెప్పండని జగన్కు స్థానికులు సూచిస్తున్నారు. ‘విద్యుత్తు ఉపకేంద్రం, శిశుసంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టులను అమ్ముకున్నదెవరు? అధికారుల బదిలీలకు రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకూ రేటు కట్టి దోచుకున్న ఘనులెవరు? బార్ల యజమానుల నుంచి సొమ్ములు వసూలు చేసిందెవరు? వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతరంగా మార్చాలంటే ఎకరానికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ దోచుకుంటున్నారు. మరి సౌమ్యుడి నియోజకవర్గంలో ఇవన్నీ ఎవరు చేస్తున్నారబ్బా?’ అని గుంటూరు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అన్నాబత్తునికి ఆ అక్రమాలు తెలిసే ఉంటాయి కదా..!
అయిదేళ్లుగా తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసిన మీ స్నేహితుడు అన్నాబత్తుని శివకుమార్కు అక్కడ జరిగిన అరాచకాలకు కారకులెవరో, వాటి ద్వారా రూ.వందల కోట్లు వెనకేసుకున్నదెవరో తెలిసే ఉంటుంది కదా? అవన్నీ అన్నవైన మీకు చెప్పకుండా ఉంటారా? వారెవరో జనం ముందే ప్రకటించి ఓటేయమని అడగండి జగన్ అని తెనాలి ప్రజలు కోరుకుంటున్నారు. ‘జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి ద్వారా రూ.81 కోట్లు దోచేశారు. భూమి చదును పేరుతో మరింత దండుకున్నారు. ఇసుక అక్రమ రవాణా పేరుతో రూ.50 కోట్లు వెనకేశారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రశ్నించే వారిని ట్రాక్టర్లతో తొక్కించి కత్తులతో బెదిరించి భయానక వాతావరణం సృష్టించారు. స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో గొడవలు, ఆందోళనల చిచ్చు రేపారు. వెంచర్లు వేయాలన్నా.. నిర్మాణాలు చేయాలన్నా.. నియోజకవర్గంలో ప్రతి పనికీ కప్పం కట్టించుకుంటున్నారు. రౌడీషీటర్లను అడ్డం పెట్టి సెటిల్మెంటు చేయించారు. బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టి.. ఎవరికి ఇటుకలు కావాలన్నా తమ దగ్గరే కొనాలనే నిబంధన పెట్టి అమ్మారు. అలా కొనలేని వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరకు మున్సిపల్ శతాద్ది ఉత్సవాలనూ వదల్లేదు. ఇంత సౌమ్యుడున్న నియోజకవర్గంలో ఇవన్నీ ఎవరు చేశారో ఆయనకు తెలియకుండా ఉంటుందా? కాస్త చెప్పండి జగన్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు