నారీ శక్తి చూపుతారా?
కన్నడనాట ప్రతి లోక్సభ ఎన్నికల్లోనూ కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది.
కర్ణాటక బరిలో నిలిచిన పలువురు మహిళలు
కన్నడనాట ప్రతి లోక్సభ ఎన్నికల్లోనూ కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. వీరిలోనూ 99 శాతం మంది స్వతంత్య్ర అభ్యర్థులుంటారు. ప్రముఖ పార్టీలన్నీ కలిపి ఒక్కశాతం టికెట్లు కూడా మహిళలకు కేటాయించవు. ఈ కారణంగా ఏటేటా కర్ణాటక నుంచి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళా ఎంపీల సంఖ్య ఒకటి లేదంటే అదీ ఉండని పరిస్థితి. కానీ ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళల సంఖ్య కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలకు టికెట్లు ఇచ్చాయి. లోక్సభ ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళల సంఖ్యలో ఇదే అత్యధికం.
కాంగ్రెస్లో జోరు..
ఏడాది కిందటే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన మేరకు ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసింది. ఈ ఐదింటిలో రెండు కేవలం మహిళల కోసం రూపొందించినవే. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ‘శక్తి’, ప్రతి గృహిణికి రూ.2వేల ఆర్థిక సాయం అందించే ‘గృహలక్ష్మి’.. ఈ రెండు పథకాలు ప్రస్తుతం రాష్ట్రంలో సజావుగానే అమలవుతున్నాయి. మహిళలను కేవలం లబ్ధిదారులుగానే చూడకుండా రాజకీయాల్లోనూ వారికి అవకాశాలు సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ ఏడాదిగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. రాజకీయ పార్టీల పరంగా లోక్సభ ఎన్నికల్లో ఇంత మంది మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. పోటీ చేస్తున్న ఆరుగురిలో సంయుక్తా పాటిల్, ప్రియాంకా జార్ఖిహొళి, సౌమ్యా రెడ్డి మంత్రుల వారసులు. వీరంతా యువతరానికి ప్రతినిధులు. వీరిలో సంయుక్త పొరుగు నియోజకవర్గంలో పోటీ చేయడంవల్ల స్థానిక నేతల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. శివమొగ్గ నుంచి పోటీ పడుతున్న గీతా శివరాజ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప కుమార్తె, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి. దావణగెరె నుంచి పోటీ చేస్తున్న ప్రభా మల్లికార్జున్ రాష్ట్రంలో అతి పెద్ద వయసున్న ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప కోడలు. ఆమె భర్త మల్లికార్జున్ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. ఉత్తర కన్నడ నుంచి పోటీ చేస్తున్న అంజలి నింబాళ్కర్ ఐఏఎస్ అధికారి హేమంత్ నింబాళ్కర్ భార్య. ఆమె గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు తొలిసారిగా లోక్సభకు పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే పార్టీ అత్యధికంగా ముగ్గురికి టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికలో కేవలం ఓ మహిళకు టికెట్ ఇచ్చింది.
భాజపా నుంచి ఇద్దరే..
కాంగ్రెస్తో పోలిస్తే భాజపా నుంచి తక్కువ మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికే టికెట్ ఇచ్చిన భాజపా ఈసారి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ప్రస్తుతం బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉడుపి-చిక్కమగళూరు నుంచి భాజపా కార్యకర్తలు, నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవడంతో అధిష్ఠానం ఆమె నియోజకవర్గాన్ని మార్చింది. ఆమె వరుసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్పకు ఆప్తుల్లో ఒకరిగా పేరున్న శోభా కరంద్లాజెకు టికెట్ ఇవ్వడంపై పలువురు సీనియర్లు విమర్శలకు దిగడం గమనార్హం. దావణగెరె నుంచి పోటీ చేస్తున్న గాయత్రి భర్త జీఎం.సిద్ధేశ్వర్ ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి ఎంపీ. ఆయనను తప్పించి భార్యకు టికెట్ ఇవ్వడంపైనా స్థానిక భాజపా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భాజపాతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్ కేవలం మూడు చోట్ల పోటీ చేస్తుండగా ఈ మూడింటిలో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. 2019లో ఓ మహిళకు జేడీఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా.. విజయం దక్కలేదు.
కాంగ్రెస్ అభ్యర్థులు
- సంయుక్తా పాటిల్ (బాగల్కోటె)
- గీతా శివరాజ్ కుమార్ (శివమొగ్గ)
- అంజలి నింబాళ్కర్ (ఉత్తర కన్నడ)
- ప్రభా మల్లికార్జున్ (దావణగెరె)
- ప్రియాంకా జార్ఖిహొళి (చిక్కోడి)
- సౌమ్యా రెడ్డి (బెంగళూరు దక్షిణ)
భాజపా అభ్యర్థులు
- శోభా కరంద్లాజె (బెంగళూరు ఉత్తర)
- గాయత్రి సిద్ధేశ్వర (దావణగెరె)
- బరిలో మొత్తం మహిళలు: 21 మంది
- జాతీయ పార్టీల తరఫున: 8 మంది
- స్వతంత్రులు: 13 మంది
- కాంగ్రెస్: ఆరుగురు
- భాజపా: ఇద్దరు
ఈనాడు, బెంగళూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
విశాఖలో జరిగింది చిన్న సంఘటనే
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య