ఖర్చులిస్తేనే కదులుతాం!
లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు.
ప్రచార వ్యయం అడుగుతున్న స్థానిక నేతలు
తమ వద్ద సొమ్ము లేదంటున్న ఎమ్మెల్యేలు
పార్టీ నిధుల కోసం పలువురు ఎంపీ అభ్యర్థుల ఎదురుచూపు
నియోజకవర్గం మొత్తం తిరగాలంటే రూ.50 కోట్లకు పైగా అవసరమని అంచనా
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా పైసలిస్తేనే ఎన్నికల కదనరంగంలోకి దూకుదామని ఎదురుచూస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 40-50 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు కలిపి వంద మందికిపైగా ఉంటారు. వీరందరూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటేనే అభ్యర్థికి కలిసివస్తుంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే భారీగా వ్యయం కావడంతో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు మళ్లీ ఖర్చు పెట్టేందుకు సుముఖంగా లేరని లోక్సభ అభ్యర్థి ఒకరు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి కనీసం రూ.10 కోట్ల దాకా అవసరమని అభ్యర్థుల అంచనా.
వచ్చే నెల 11వ తేదీ వరకు ప్రచార గడువు ఉంది. అప్పటివరకు లోక్సభ నియోజకవర్గం మొత్తం అలుపెరగకుండా తిరగాలంటే కనీసం రూ.50 కోట్లకు పైగా అవసరమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఏసీ వాహనాలు, మంచినీరు, మజ్జిగ, భోజనాలు, బిర్యానీలు, మద్యం, ప్రచార పత్రాలు, ఫ్లెక్సీలు.. ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరం. ఏదైనా చిన్న గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ఖర్చులు ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి ఛోటామోటా నేతలు అడుగుతున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో కార్యకర్త రోజుకు రూ.వెయ్యి దాకా అడుగుతున్నారు. భోజనం, మద్యం అదనం. మండలస్థాయి నేతలకు రూ.లక్షల్లో చెల్లిస్తేనే ప్రచారానికి ముందుకొస్తున్నారు. ఇవి కాకుండా ఆయా సామాజికవర్గ సంఘాలు, కాలనీ సమూహాల విజ్ఞప్తుల మేరకు సామూహిక అవసరాల కోసం అక్కడక్కడా గుండుగుత్తగా సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. స్థానికులకు అవసరమైన కొన్ని పనులకు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రోజుకు రూ. కోటి ఖర్చు తప్పదా!
ఖర్చులకు సొమ్ము ఇచ్చేదెవరో తేలక కొందరు నేతలు ప్రచారానికి రావడం లేదు. ప్రతి పార్టీకి ప్రచారంలో నియోజకవర్గ నేతలు కీలకం. వారు ముందుండి నడిపిస్తేనే కార్యకర్తలు, స్థానిక నేతలు కదులుతారు. వారే చేతులెత్తేస్తుండటంతో అడిగినంత ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో ఒకరోజు ప్రచారానికి రూ.కోటి వరకూ ఖర్చవుతోందని అనధికారిక సమాచారం. పార్టీ విజయం ప్రధానమైనందున ఎమ్మెల్యేలు కూడా కొంత వ్యయం భరిస్తారని లోక్సభ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కానీ, తాము నెగ్గి నాలుగు నెలలే అయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చులతో తమ వద్ద ఇప్పుడు సొమ్ముల్లేవని కొందరు ఎమ్మెల్యేలు తెగేసి చెపుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారిదీ అదే పరిస్థితి.
అప్పులు చేసైనా సరే..
కొన్ని స్థానాల్లో లోక్సభ అభ్యర్థులు పార్టీ నిధుల కోసం చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే పార్టీలు టికెట్లు ఇవ్వడంతో.. వారు పార్టీ సొమ్ము కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. వీరిలో కొందరు టికెట్ ఖరారైనప్పటి నుంచి ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని కీలక నియోజకవర్గాల్లో నెగ్గాలంటే రూ.100 కోట్ల దాకా అవసరమవుతుందని అనధికార అంచనా. ‘ఎంపీగా నెగ్గితేనే రాజకీయంగా పేరు, పలుకుబడి వస్తాయి. ఎలాగైనా నెగ్గి తీరాలని.. ఉన్న ఆస్తులన్నీ అమ్మడం లేదా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రచారానికి ఖర్చుపెడుతున్నాను. గెలిస్తే ఎంపీ అవుతా. ఓడితే ఆస్తులు పోతాయి’ అని ఓ పార్టీ అభ్యర్థి ‘ఈనాడు’కు తెలిపారు. భారీగా ఖర్చు పెట్టకుంటే గెలిచే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. -
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM