ఖర్చులిస్తేనే కదులుతాం!
లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు.
ప్రచార వ్యయం అడుగుతున్న స్థానిక నేతలు
తమ వద్ద సొమ్ము లేదంటున్న ఎమ్మెల్యేలు
పార్టీ నిధుల కోసం పలువురు ఎంపీ అభ్యర్థుల ఎదురుచూపు
నియోజకవర్గం మొత్తం తిరగాలంటే రూ.50 కోట్లకు పైగా అవసరమని అంచనా
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా పైసలిస్తేనే ఎన్నికల కదనరంగంలోకి దూకుదామని ఎదురుచూస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 40-50 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు కలిపి వంద మందికిపైగా ఉంటారు. వీరందరూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటేనే అభ్యర్థికి కలిసివస్తుంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే భారీగా వ్యయం కావడంతో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు మళ్లీ ఖర్చు పెట్టేందుకు సుముఖంగా లేరని లోక్సభ అభ్యర్థి ఒకరు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి కనీసం రూ.10 కోట్ల దాకా అవసరమని అభ్యర్థుల అంచనా.
వచ్చే నెల 11వ తేదీ వరకు ప్రచార గడువు ఉంది. అప్పటివరకు లోక్సభ నియోజకవర్గం మొత్తం అలుపెరగకుండా తిరగాలంటే కనీసం రూ.50 కోట్లకు పైగా అవసరమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఏసీ వాహనాలు, మంచినీరు, మజ్జిగ, భోజనాలు, బిర్యానీలు, మద్యం, ప్రచార పత్రాలు, ఫ్లెక్సీలు.. ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరం. ఏదైనా చిన్న గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ఖర్చులు ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి ఛోటామోటా నేతలు అడుగుతున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో కార్యకర్త రోజుకు రూ.వెయ్యి దాకా అడుగుతున్నారు. భోజనం, మద్యం అదనం. మండలస్థాయి నేతలకు రూ.లక్షల్లో చెల్లిస్తేనే ప్రచారానికి ముందుకొస్తున్నారు. ఇవి కాకుండా ఆయా సామాజికవర్గ సంఘాలు, కాలనీ సమూహాల విజ్ఞప్తుల మేరకు సామూహిక అవసరాల కోసం అక్కడక్కడా గుండుగుత్తగా సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. స్థానికులకు అవసరమైన కొన్ని పనులకు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రోజుకు రూ. కోటి ఖర్చు తప్పదా!
ఖర్చులకు సొమ్ము ఇచ్చేదెవరో తేలక కొందరు నేతలు ప్రచారానికి రావడం లేదు. ప్రతి పార్టీకి ప్రచారంలో నియోజకవర్గ నేతలు కీలకం. వారు ముందుండి నడిపిస్తేనే కార్యకర్తలు, స్థానిక నేతలు కదులుతారు. వారే చేతులెత్తేస్తుండటంతో అడిగినంత ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో ఒకరోజు ప్రచారానికి రూ.కోటి వరకూ ఖర్చవుతోందని అనధికారిక సమాచారం. పార్టీ విజయం ప్రధానమైనందున ఎమ్మెల్యేలు కూడా కొంత వ్యయం భరిస్తారని లోక్సభ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కానీ, తాము నెగ్గి నాలుగు నెలలే అయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చులతో తమ వద్ద ఇప్పుడు సొమ్ముల్లేవని కొందరు ఎమ్మెల్యేలు తెగేసి చెపుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారిదీ అదే పరిస్థితి.
అప్పులు చేసైనా సరే..
కొన్ని స్థానాల్లో లోక్సభ అభ్యర్థులు పార్టీ నిధుల కోసం చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే పార్టీలు టికెట్లు ఇవ్వడంతో.. వారు పార్టీ సొమ్ము కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. వీరిలో కొందరు టికెట్ ఖరారైనప్పటి నుంచి ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని కీలక నియోజకవర్గాల్లో నెగ్గాలంటే రూ.100 కోట్ల దాకా అవసరమవుతుందని అనధికార అంచనా. ‘ఎంపీగా నెగ్గితేనే రాజకీయంగా పేరు, పలుకుబడి వస్తాయి. ఎలాగైనా నెగ్గి తీరాలని.. ఉన్న ఆస్తులన్నీ అమ్మడం లేదా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రచారానికి ఖర్చుపెడుతున్నాను. గెలిస్తే ఎంపీ అవుతా. ఓడితే ఆస్తులు పోతాయి’ అని ఓ పార్టీ అభ్యర్థి ‘ఈనాడు’కు తెలిపారు. భారీగా ఖర్చు పెట్టకుంటే గెలిచే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?