బరిలో భారీగా బంధుగణం
లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 34 మంది వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు.
లోక్సభ సమరంలో మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రుల కుటుంబసభ్యులు
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 34 మంది వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా, మాజీ సీఎంల కుటుంబ సభ్యులు 30 మంది ఉన్నారు. ఇప్పటికే 31 మంది పేర్లను అధికారికంగా ప్రకటించగా.. ముగ్గురి పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ ప్రకటించిన వారిలో దిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె భాంసురీ స్వరాజ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండగా మిగతా వారంతా ఇదివరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి గెలుపోటములను చవిచూశారు.
లాలు కుమార్తెలిద్దరు..
తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ దానంచేసి ప్రాణం నిలబెట్టి ఆయన అసలైన వారసురాలిగా గుర్తింపు పొందిన రోహిణీ ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సారణ్ నుంచి భాజపా బలమైన ప్రత్యర్థి రాజీవ్ ప్రతాప్ రూఢీతో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాప్రా నుంచి సారణ్గా మారిన ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అన్నే సార్లు గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూఢీ ఇప్పుడు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాలూ మరో కుమార్తె, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రామ్ కృపాల్ యాదవ్తో తలపడుతున్నారు. రామ్ కృపాల్ ఒకప్పుడు ఆర్జేడీ సభ్యుడే. ఆ పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో లాలూ ప్రసాద్ ఆ స్థానాన్ని కుమార్తె మీసా భారతికి కేటాయించడంతో ఆయన భాజపాలో చేరి గెలిచారు. 2019లో మళ్లీ వారే ప్రత్యర్థులుగా తలపడినా రామ్ కృపాలే పైచేయి సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. రెండు సార్లు ఓడిపోయినా మీసా భారతి ధైర్యంగా మూడోసారి రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల్లో 10 మంది భాజపా తరఫున పోటీ చేస్తుండగా, 8 మంది కాంగ్రెస్ నుంచి, ఏడుగురు వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగారు.
గాంధీల కుటుంబం నుంచి..
మాజీ ప్రధానుల్లో ఇద్దరు గాంధీ పరివారానికి సంబంధించినవారే. ఇందులో భాజపా తరఫున సుల్తాన్పుర్ నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ ఇదివరకు పీలీభీత్ నుంచి ఆరు సార్లు, సుల్తాన్పుర్ నుంచి ఒకసారి గెలుపొంది లోక్సభలో అత్యంత సీనియర్గా పేరు గడించారు. జనతాదళ్ నుంచి రెండు సార్లు, ఇండిపెండెంట్గా రెండు సార్లు, భాజపా తరఫున మూడు సార్లు ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని అమేఠీ నుంచి గెలుపొందారు. 2019లో అక్కడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. మధ్యలో మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కొన్ని రోజులు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినా సుప్రీంకోర్టు జోక్యంతో పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు ఆయన మళ్లీ వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. అమేఠీ నుంచి పోటీ చేస్తారా.. లేదా.. అన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
సీఎంల బంధువుల పోటీ
మాజీ ముఖ్యమంత్రుల పిల్లల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ సింగ్ ఠాకుర్తోపాటు, ముఖ్యమంత్రిగా పని చేసిన బసవరాజ్ బొమ్మై, ఇదివరకే ఎంపీగా, ముఖ్యమంత్రిగా పని చేసిన కుమార స్వామి, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసి, తర్వాత భాజపాలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ఆరు సార్లు కటక్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు భర్తృహరి మెహతాబ్, దేశంలోనే 29 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా పని చేసిన అగాథా సంగ్మా ఉన్నారు. అందరూ వారివారి రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేసిన నాయకులే. పురందేశ్వరి, వైఎస్ షర్మిల, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, ప్రణీతి శిందేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు/కార్యనిర్వాహక అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర, బంగారప్ప తనయ గీతా శివరాజ్ కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి పరస్పరం తలపడుతుండగా, మిగతా వారంతా ఇతర అభ్యర్థులతో పోటీ పడుతున్నారు.
చంద్రశేఖర్ తనయుడు
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడైన నీరజ్ శేఖర్ 2007 నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఏదో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం భాజపా తరఫున బలియా నుంచి పోటీ పడుతున్నారు.
మండ్య నుంచి కుమారస్వామి..
మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి 1996లో కనకపుర నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో మళ్లీ అక్కడి నుంచే పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. 2009లో బెంగుళూరు రూరల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తన ఒక్కలిగ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న మండ్య నుంచి ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి పోటీచేసి ఇండిపెండెంట్గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో సుమలతకు భాజపా మద్దతివ్వడంతో జేడీఎస్ ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ పార్టీకి భాజపా మద్దతు ఇస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!