వైకాపాలో వైఎస్ఆర్ ఎక్కడ?
‘వైకాపాలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నారా? ఏదీ ఎక్కడా కనిపించడం లేదేం? చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ వైఎస్ఆర్ను కనుమరుగు చేసేస్తున్నారేం? ఇప్పుడు మీ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయిపోయింది.
ప్రభుత్వ పథకాల్లోనూ కనుమరుగు చేస్తున్నారు
మీలా కాదు నేను వైఎస్ పేరుతోనే పార్టీ పెట్టాను
వివేకా హత్యపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి
సొంత జిల్లా బస్సు యాత్రలో షర్మిల డిమాండు
ఈనాడు, కడప: ‘వైకాపాలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నారా? ఏదీ ఎక్కడా కనిపించడం లేదేం? చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ వైఎస్ఆర్ను కనుమరుగు చేసేస్తున్నారేం? ఇప్పుడు మీ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయిపోయింది. వీళ్లు నా గురించి పెద్ద.. పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి మూసేశానట. ఆంధ్ర నాకు పుట్టినిల్లు. తెలంగాణ మెట్టినిల్లు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టా. అక్కడ వైఎస్ఆర్ పేరుతోనే స్థాపించా. మీలాగా ‘యువజన శ్రామిక రైతు పార్టీని’ వైఎస్ఆర్ అని చెప్పుకోవడం లేదు’ అని పీసీసీ అధ్యక్షురాలు, ఆ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వివరించారు. వైయస్ఆర్ జిల్లా ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సభల్లో షర్మిల ప్రసంగించారు. తెలంగాణలో పోటీ చేసే పక్షంలో కేసీఆర్ లబ్ధి పొందుతారని అంచనా వేశా.. అందుకే కాంగ్రెస్లో విలీనం చేశాను. ఆ పార్టీ బతికి ఉన్నంత కాలం వైతెపా బతికే ఉంటుంది. అధికారం, ముఖ్యమంత్రి పీఠం కోసం ఇక్కడికి రాలేదు. కాంగ్రెస్కు ఊపిరి పోయాలనే వచ్చాను’ అని వివరించారు. ప్రజల కోసం, విభజన హామీల సాధన కోసం ఇక్కడ అడుగుపెట్టానని, జగనన్న మోసాలపై పోరాటానికి వచ్చానని తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రత్యేక హోదా హామీ పట్టుకుని ఇక్కడ అడుగుపెట్టా.. రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. హంతకులకు కంచె వేసి కాపాడుతున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా?’ అని ప్రశ్నించారు. వివేకా హత్యపై రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఇక మీదట కడపలో హత్యల వాతావరణం లేకుండా ఉండేందుకే పోరాటం సాగిస్తున్నామని, హంతకులకు శిక్ష పడేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకుని, పరిశీలించిన షర్మిల.. ఈ పరిశ్రమ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రచారంతో జగన్కు వణుకు పుట్దిందని.. అవినాష్రెడ్డి స్థానంలో మరొకరని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
విమలారెడ్డి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో!
వివేకా హంతకులపై పోరాటం ఆగదని ఆయన కుమార్తె సునీత స్పష్టం చేశారు. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించనని తెలిపారు. కడపలో ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాలకు తావుండరాదని, వివేకా ఘటన ఓ గుణపాఠంగా చేస్తానని వివరించారు. హంతకులు చట్టసభల మెట్లెక్కకుండా చేద్దామని.. అందుకే షర్మిలను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ‘కొత్తగా మా మేనత్త విమలారెడ్డి తెరపైకి వచ్చారు. ఆమెకు ఏమైందో తెలియదు.. మాపై ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు’ అని అన్నారు.
కాంగ్రెస్లో చేరిన పి.గన్నవరం వైకాపా ఎమ్మెల్యే
వైకాపాకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీలో చేశారు. ముద్దనూరు సభలో షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ వ్యవహార శైలి నచ్చకనే పార్టీని వీడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అమెరికా వెళ్లిపోయిన విజయమ్మ
రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం జగన్ తల్లి వై.ఎస్.విజయమ్మ అయిదు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిపోయారు. ఇది రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. అక్కడ ఉన్న షర్మిల తనయుడు రాజారెడ్డి దగ్గరకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఉంటే కుమారుడు జగన్ నుంచి ఎన్నికల ప్రచారానికి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వివేకా హత్యపై మరోసారి మాటలయుద్ధం
ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు జిల్లాలో మరోమారు తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన హత్యతో అంతిమంగా లబ్ధి పొందిన జగన్.. నేరస్థులను కాపాడుతున్నారంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీతలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్కు మద్దతుగా ఆయన మేనత్త వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలారెడ్డి రంగంలోకి దిగారు. బహిరంగ సభల్లో షర్మిల, సునీతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమలారెడ్డి శనివారం ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న పనులతో తమ కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నారన్నారు. వివేకాను అవినాష్రెడ్డి హత్య చేయడాన్ని వారు చూశారా అంటూ ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే ఖరారు చేసేస్తే.. ఇక కోర్టులు, జడ్జిలు ఎందుకని ప్రశ్నించారు.
ఆర్థిక లబ్ధితోనే అనుకూలంగా మాట్లాడుతున్నారు: షర్మిల
విమలారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ మేనత్త విమలారెడ్డి కుమారుడికి జగన్ రూ.కోట్లల్లో కాంట్రాక్టు పనులు ఇవ్వడంతో వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ మేనత్త విమలారెడ్డికి వయసు పైపడి, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఐ అన్ని ఆధారాలూ చూపినందునే అవినాష్రెడ్డి నిందితుడని తాము ఆరోపిస్తున్నామని చెప్పారు. విమలారెడ్డికి వివేకానందరెడ్డి ఎంత మేలు చేశారో గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. తాను, సునీత ఎందుకు పోరాటం చేస్తున్నామో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట