ప్రజాప్రభుత్వ ఏర్పాటే కూటమి ఎజెండా
తెదేపా, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడమే కూటమి ఎజెండా అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
‘నిజం గెలవాలి’ ముగింపు సభలో నారా భువనేశ్వరి
తిరువూరు, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడమే కూటమి ఎజెండా అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో శనివారం జరిగిన ‘నిజం గెలవాలి ప్రజాప్రభుత్వం రావాలి’ పేరుతో జరిగిన ముగింపు సభలో ఆమె మాట్లాడారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ప్రతి ఒక్కరూ కూటమితో నడవాలన్నారు. ఒక సైనికుడిలా రాష్ట్రాన్ని నడిపించేందుకు చంద్రబాబు లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతో వైకాపాను ఓడించాలని, తెదేపా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టు అనంతరం చంద్రబాబు తనకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమ బాధ్యత అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెదేపా కుటుంబాలను కలిసే అవకాశం కల్పించారని తెలిపారు. సెప్టెంబరు 9వ తేదీని తన జీవితంలో మరచిపోలేనని, అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లిన విషయాన్ని తమ పెళ్లిరోజైన 10న లోకేశ్ ఫోన్ చేసి చెప్పడంతో తనకేమీ అర్థం కాలేదన్నారు. రాజమహేంద్రవరం జైలుకు ములాఖత్ కోసం వెళ్లిన సమయంలో అక్కడ చంద్రబాబును చూసిన తన కళ్లు చెమర్చాయని తెలిపారు. జైలు శిక్ష అనుభవిస్తూ కూడా ప్రజల గురించే ఆలోచించారని, మృతుల కుటుంబాలను కలిసి భరోసా ఇవ్వాలని ఆయన చేసిన సూచన మేరకు ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమం చేపట్టానన్నారు. రాజమహేంద్రవరం వెళ్లగానే తమకు ఇంటిని ఇచ్చిన దాతకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా లక్షలమందికి ఉపాధి కల్పించారన్నారు. తానున్నా లేకున్నా తాను చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకునే ఏకైక నాయకుడు ఆయన ఒక్కరే అన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో కూడా పోలవరం, అమరావతి, పట్టిసీమ, కియా సంస్థ ఏర్పాటు వంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే భరోసా ఉంటుందన్న నమ్మకంతోనే అక్రమ అరెస్టు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు 80 దేశాల్లోని తెలుగువారు మద్దతు తెలిపారన్నారు. మహిళలను లాఠీలతో కొట్టినా చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు తెలిపారని, వారందరికీ రుణపడి ఉంటానన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్ర చేపడతానని చెబితే..ఈ రాక్షస ప్రభుత్వం ఏదైనా చేస్తుందని భయపడ్డానని, తాను ఇంట్లో ఉన్నా చంపాలనుకుంటే చంపేస్తారని ప్రజల మధ్యలో ఉంటానని బయల్దేరిన తన కుమారుడిని ఆశీర్వదించినట్లు తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమం సందర్భంగా ఆయావర్గాల ప్రజలను కలిసిన సందర్భంలో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు చెబుతుంటే ఆశ్చర్యమేసిందన్నారు. పథకాల పేరు చెప్పి వైకాపా నాయకులు ప్రజల సొమ్ము దోచుకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముందుచూపుతో ఐటీ రంగం గురించి చెబితే నవ్వారని, ఈరోజు హైటెక్ సిటీ ద్వారా లక్షలమంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. అన్నదాతలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి 30 వేల ఎకరాలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇస్తే వైకాపా ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా తనను కించపరిచేలా ఈ ప్రభుత్వం మాట్లాడిందని, దేవాలయం లాంటి శాసనసభలో ఒక స్త్రీ గురించి హేళనగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నిమిషంపాటు తాను బాధపడినా..తాను ఎలాంటి వ్యక్తినో ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. తన తల్లిదండ్రుల సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగానని, తన తల్లి కుటుంబ విలువలు నేర్పించారన్నారు. ఇటీవల విశాఖలో 20 వేల కిలోల డ్రగ్స్ దిగుమతి చేసిన వైకాపా ప్రభుత్వం యువతను మత్తుకు బానిసలుగా చేయాలని చూసిందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 60,449 మంది కార్యకర్తల పిల్లలు విద్యనభ్యసించారని భువనేశ్వరి పేర్కొన్నారు.
భువనేశ్వరికి చంద్రబాబు అభినందనలు
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపాకు ప్రాణం, బలం కార్యకర్తలేనని... తమ కుటుంబం కంటే పార్టీకి ప్రాధాన్యమిచ్చే కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిర్వహించిన ‘నిజం గెలవాలి’ యాత్ర శనివారం విజయవంతంగా ముగియడంపై ఎక్స్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆరు నెలల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 9,079 కి.మీ. దూరం భువనేశ్వరి ప్రయాణించారు. సుమారు 203 కుటుంబాలను కలిశారు’ అంటూ యాత్ర విశేషాల్ని పోస్టు చేశారు.
కార్యకర్తల కుటుంబాలకు ‘నిజం గెలవాలి’ యాత్రతో భువనేశ్వరి అండగా నిలిచారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ‘గతేడాది అక్టోబర్ 25న చిత్తూరులో ప్రారంభమైన యాత్ర...శనివారం తిరువూరులో ముగిసింది. ఆరు నెలల్లో 14 విడతలుగా 47 రోజులు యాత్ర సాగింది. చనిపోయిన ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం, వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితవిద్య హామీ ఇచ్చారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!