తిక్కలోడి మూడు ముక్కలాటకు రాష్ట్రం బలైంది
‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ముమ్మాటికీ అమరావతే
అమరావతికి మద్దతిచ్చిన వారికే ఓటు అని నినదించాలి
తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం సభల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు హాజరైనవారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చి రాష్ట్రం నడిబొడ్డు నుంచి, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశ అమరావతి. అమరావతి రాజధానిగా ఉంటుందని తాడికొండలో ప్రకటిస్తున్నాను. మరో 30 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. మీరు లిఖించబోయే చరిత్ర కళ్లముందు కనిపిస్తోంది. ప్రజాభిమానం చూస్తుంటే జగన్రెడ్డికి సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. జూన్ 4న సగర్వంగా అమరావతే రాజధాని అని మీరు ఉత్సవాలు చేసుకోండి. అదేరోజు జగనాసుర వధ జరుగుతుంది. ప్రజలు గెలవాలి.. జగన్ పోవాలి అనే నినాదంతో జనం ముందడుగు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
జగన్రెడ్డి అరాచకానికి ప్రజలంతా బాధితులే
‘రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? అదే రాజధాని అమరావతి వచ్చి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. జగన్రెడ్డి అరాచకానికి ప్రజలంతా బాధితులే. మీ పొట్ట కొట్టిన ఫ్యాన్ని చిత్తు చిత్తు చేసి చెత్త కుప్పలో పడేయాలి. రాజధాని అమరావతికి కట్టుబడి ఉండని పార్టీల అభ్యర్థులను బహిష్కరించాలి. అమరావతి ద్రోహుల్ని తరిమికొడదాం’ అని పిలుపునిచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును అభివృద్ధి చెందిన నగరంగా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
తనకు జతగా పట్టుదల, తపన ఉండే పవన్కల్యాణ్, కేంద్రంలో అధికారంలోకి రానున్న ఎన్డీయే ప్రభుత్వం కలిసి వస్తుంటే జగన్ నిలుస్తారా? అని ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘ప్రజాగళం సభలకు వస్తున్న జనాలను చూస్తే జగన్కు నిద్ర రాదు. నేను సీఎంగా కొనసాగితే 2020లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. పెన్నా, గోదావరి అనుసంధానం చేయాలని భావించాను. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు లాంటి జగన్రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు’ అని వ్యాఖ్యానించారు.
భవనాలకు రంగులేస్తే చదువు వస్తుందా?
‘విద్యావ్యవస్థను జగన్ పూర్తిగా నాశనం చేశారు. పాఠశాల భవనాలకు రంగులేస్తే చదువొస్తుందా? రాష్ట్ర విభజన సమస్యలున్నా ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చాం. జగన్ మాత్రం ఉద్యోగులకు పీఆర్సీ డీఏ, టీఏలు ఇవ్వలేదు. దాచుకున్న పీఎఫ్ డబ్బులు వచ్చాయా? 26వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చారా? మెజారిటీ పోలీసులు మనస్సు చంపుకొని పనిచేశారు. మళ్లీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. 6లక్షల మంది విద్యార్థులకు బోధన రుసుం చెల్లించలేదు. పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేశారు. అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.4-5లక్షల కోట్లను జగన్ దూరం చేశారు. మన ఆలోచనలు, కష్టం నుంచే సంపద వస్తుంది. సంపద సృష్టించి పేదలకు పంచి ప్రజల ఆదాయాలు పెంచే విధానాన్ని తీసుకొస్తా’ అని తెలిపారు.
జగన్ విఫల సీఎం
‘సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో 99% సమస్యలు పరిష్కరించానంటున్నా, ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేశారు. జగన్ విఫల సీఎం. రాష్ట్రాభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజాగళం సభకు రోడ్డుపై కారులో వస్తుంటే ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఉంది. జన్మభూమి మీద ప్రేమ, భవిషత్తుపై ఆశ ఉంటే ప్రజలంతా వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీయే అభ్యర్థులను గెలపించాలి’ అని చంద్రబాబు కోరారు.
ప్రజావేదిక నిర్మాణంతోనే పాలన ప్రారంభిస్తా
‘అయిదేళ్లలో ఏనాడైనా జగన్ ఏసీ బస్సులో నుంచి బయటకు దిగారా? ప్రజలను కలిశారా? ఎన్నికల ముందు బస్సుయాత్ర అంటూ ఏసీ బస్సుకు అడ్డు వస్తున్నాయని చెట్లన్నీ నరికేస్తున్నారు. రాష్ట్రంపై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయ్యారు. నేను నిర్మాణాలు చేస్తే, జగన్ విధ్వంసకర పాలన చేశారు. నేను సీఎం అయిన తొలిరోజే ప్రజావేదిక నిర్మాణాన్ని ప్రారంభిస్తా. రాష్ట్రాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తా. హైదరాబాద్, చెన్నైలోని మద్యం బ్రాండ్లు ఏపీలో దొరక్కపోవడానికి చిదంబర రహస్యం తాడేపల్లి ప్యాలెస్లో ఉంది’ అని ఎద్దేవా చేశారు.
ప్రజలే ధర్మాన భరతం పడతారు
ఎన్నికల్లో గెలిచి తామే అధికారంలోకి వస్తామని, వాలంటీర్లు రాజీనామా చేయొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాలంటీర్లపై శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బెదిరింపులకు దిగారని, ఆ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ధర్మాన భరతాన్ని ప్రజలు పడతారన్నారు. గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి మట్టి దొంగ అని ఆరోపించారు.
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ
ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నిస్వార్థంగా వైకాపాకు సేవ చేసిన తనకు అక్కడ అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్, ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
సైబరాబాద్ తరహా అభివృద్ధి కోసం రూపకల్పన
‘1995లో హైదరాబాద్లో హైటెక్సిటీ ప్రారంభించే సమయంలో అక్కడ ఎకరా రూ.లక్ష మాత్రమే. ఇప్పుడు ఎకరా రూ.100 కోట్లు పలుకుతోంది. ఏకంగా 10వేల రెట్లు పెరిగింది. అమరావతినీ అలాగే నిర్మించేందుకు రూపకల్పన చేస్తే మూడు ముక్కలాట అంటూ అమరావతిని నాశనం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు ఉండగా సైబరాబాద్ని నిర్మించి ట్రై సిటీగా మార్చి అభివృద్ధి చేసి చూపించాను. అదే స్ఫూర్తితో విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అమరావతి మహానగరాన్ని నిర్మించాలనుకున్నాను. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వాసం. అమరావతి అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను తిక్కలోడు జగన్ చెడగొట్టారు. రాజధాని కోసం తీసుకొచ్చిన మట్టి, ఇతర సామగ్రిని దొంగిలించారు. వారిలో ఓ ఎంపీ ఉన్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు.
పాసుపుస్తకాలపై జగన్ ఫొటోలేంటి?
‘ప్రజల భూమిని జగన్ తన పేరు మీద రాసుకుంటున్నారు. రైతుల పాస్పుస్తకం, సరిహద్దు రాళ్లపై జగన్ ఫొటోలు ఏంటి?జగన్ ఏమైనా భూములు కొని ప్రజలకు ఇచ్చారా? వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూమి హక్కు చట్టంలో భూముల యజమానులకు అప్పీలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తి కూడా గోవిందా’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని జగన్ ప్రకటించాలని సవాల్ విసిరారు. తెదేపా సూపర్-6 హామీలు ఎలా ఇస్తారని తనను జగన్ ప్రశ్నిస్తున్నారని, వంద సంక్షేమ పథకాలు తెదేపా ఇస్తే, వైకాపా నవమోసాలు, నకిలీ రత్నాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు